Wednesday 23 January 2019

భారతదేశ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ కి సరికొత్త అధ్యాయం ప్రారంభమయిందన్న ఏఐసిసి అధికార ప్రతినిధి డాక్టర్ శ్రవణ్ దాసోజు.

ప్రత్యేక్ష రాజకీయాల్లో అడుగు పెట్టిన ఇందిరాగాంధీ మనుమరాలు శ్రీమతి ప్రియాంకాగాంధీ
ఉత్తర ప్రదేశ్  ప్రధానకార్యదర్శి గా ప్రియాంకను నియమించిన ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటి అధ్యక్షులు రాహుల్ గాంధీ.
భారతదేశ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ కి సరికొత్త అధ్యాయం  ప్రారంభమయిందన్న ఏఐసిసి అధికార ప్రతినిధి డాక్టర్ శ్రవణ్ దాసోజు.

మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ మనుమరాలురాజీవ్,సోనియాగాంధీల కుమార్తె శ్రీమతి ప్రియాంక గాంధీ ప్రత్యక్ష రాజకీయాల్లో ప్రవేశించడం  దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి  శుభ పరిణామమని ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ శ్రవణ్ దాసోజు అన్నారు. మరికొన్ని నెలల్లో లోక్ సభ ఎన్నికలు జరుగనున్న నేపధ్యంలో  ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ  అధ్యక్షులు రాహుల్ గాంధీ,  ప్రియాంకాను ఏఐసిసి ప్రధాన కార్యదర్శిగా, నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం పట్ల  దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు  వ్యక్తం అవుతున్నాయన్నారు.త్వరలోనే ఇందిరమ్మ రాజ్యం సాకారమవుతుందని  దాసోజు ధీమా వ్యక్తం చేశారు.
రూపురేఖల్లో, ఆలోచనల్లో, హావభావాల్లో అచ్చం నాయనమ్మ, దివంగత ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీని పోలిఉన్న ప్రియాంకా గాంధీ మంచితనం,మానవత్వం, మర్యాద , హుందాతనం కలగలసిన నేత అని, త్వరలోనే దేశ ప్రజల మన్ననలు చూరగొంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. తాను ఏప్రిల్ 5 2014న ప్రియాంకాగాంధీ గారితో భేటీ అయ్యాయని ఆసందర్భంగా ఆమె మాట తీరు, యువత, బడుగు బలహీన వర్గాల పట్ల కనబరిచిన శ్రద్ద పట్ల తీవ్రంగా ప్రభావితమయ్యానని, అదే స్ఫూర్తితో కాంగ్రెస్ పార్టీలో చేరానని డాక్టర్ శ్రవణ్ గుర్తుచేసుకున్నారు. రానున్న కాలంలో ప్రియాంకాగాంధీ ఒక బలమైన నాయకురాలుగా ఎదుగుతారన్నారు. గత 2014 ఎన్నికల ముందు నుంచే రాజకీయ వ్యూహాలు సిద్ధం చేయడంలోనూకమ్యూనికేషన్ పెంపోందించడం, సామాజిక మాధ్యమాల్లో ప్రచారం తదితర అంశాల్లో కీలక పాత్ర పోషించారని, తెరవెనుక కాంగ్రెస్ పార్టీతో క్రియాశీలక రాజకీయాల్లో చురుకుగా పాల్గొన్న ప్రియాంకా గాంధీ ప్రస్తుతం ప్రత్యేక్ష రాజకీయాల్లోకి  రావడం  ద్వారా భారత దేశ రాజకీయాల్లో పెను మార్పులు సంభవించడం ఖాయమన్నారు. రాబోయే కాలంలో దేశంలోని అరవై కోట్ల మంది మహిళలకు ప్రియాంకాగాంధీ ప్రతినిధిగా కనిపిస్తారన్నారు. ఓ వైపు పేద బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేయాలన్ననాయనమ్మ బాటలో నడుస్తూ బలహీన వర్గాల ప్రజల కు దిక్సూచిగా వ్యవహరిస్తున్న ప్రియాంకాగాంధీ, మరోవైపు కులమతాలకతీతంగా ప్రతిభ కలిగిన యువత కు పెద్ద పీట వేయాలని చూస్తున్న రాహుల్ గాంధీ నేతృత్వంలొ త్వరలోనే సరికొత్త భారత్ ఆవిష్కృతం అవుతుందని, రానున్న కాలంలో కాంగ్రెస్ పార్టీ అజేయంగా మారుతుందని డాక్టర్ శ్రవణ్ ధీమా వ్యక్తం చేశారు.

Tuesday 22 January 2019

Lack of minimum ministers in Telangana is violation of constitution: AICC Spokesperson Dr. Sravan Dasoju


Hyderabad, January 22: All India Congress Committee (has strongly condemned Chief Minister K. Chandrashekhar Rao for not appointing minimum number of ministers in his cabinet and described it as a violation of Constitution of India.

Addressing a press conference at Gandhi Bhavan on Tuesday, Sravan released a copy of open letter which he wrote to Governor E.S.L. Narasimhan seeking his immediate intervention on absence of a full-fledge Council of Ministers even after five weeks of formation of new government. "The Article 164 (1A) says that the total number of Ministers, including the Chief Minister, in the Council of Ministers in a State shall not exceed fifteen per cent of the total number of members of the Legislative Assembly of that State, provided that the number of Ministers, including the Chief Minister in a State shall not be less than twelve. However, violating the constitutional mandate, the present government as of now consists of only the Chief Minister and Home Minister," he said.

Further, he said that the Article 163 (1) of Constitution says, “There shall be a Council of Ministers with the Chief Minister as the head to aid and advise the Governor in the exercise of his functions, except in so far as he is by or under this Constitution required to exercise his functions or any of them in his discretion”. Hence, in the absence of a full-fledged council of ministers, even the role of Governor has become deceased and defunct in Telangana, as there is none to aid and advice the Governor.

Sravan said except for four portfolios of Home, Stamps and Registrations, Relief and Rehabilitation, Urban Land Ceiling, all other portfolios are kept with a single person, i.e., the Chief Minister. He wondered whether Mahmood Ali enjoys the authority to take independent decision on portfolios being held by him. "There are 33 departments and 289 organizations in the government of Telangana and it is humanely to impossible for one person to make decisions and monitor their execution. Without minimum number of ministers, we are not only curtailing the functioning of the government, but also doing disservice to the people who participated in democratic elections and voted. How much time it will take to reorganize the departments? It is a lame excuses covering up the delay in forming the full-fledged cabinet. How come such a small cabinet takes any decision?" he asked.

"We wonder what for we have had these elections and why it is being allowed to blatantly violate the constitution and scuttle the spirit of democracy? To form the full-fledged cabinet is not only a constitutional mandate, but also a tradition and custom to be adhered to by any ruling government," he said.

Sravan alleged that Telangana State was now under zero-governance due to lack of cabinet ministers. "We hear that there is a serious financial bankruptcy in the state of Telangana, there is a delay in payment of pensions, and many electoral promises made by ruling party are yet to be grounded. In the absence of the Finance Minister, who is gathering information to prepare the budget? There are already signs of drought in the state and what kind of proactive disaster management is being taken up. Whole lot of planning is needed to ensure adequate supply of seeds and fertilizers to farmers in forthcoming Kharif season. In order to facilitate sufficient lending, the government is expected to arrange for state level bankers meeting. As such Rythu Bandhu payments are not completely made, many farmers received only messages on the polling day but not the money. Thousands of crores of bill are pending for ongoing projects. On the whole, there is no transparency and utter chaos in Government," he said.

Stating that there were more than 30 lakh unemployed youth in Telangana, the AICC Spokesperson said that there was no mention of unemployment issue in the Governor's speech. Similarly there was no clarity on 3-acre land to Dalits or double bed room scheme etc., "There are many issues and many loose knots that need to be knitted by the ruling government and to do that we need a full-fledged cabinet so that it collectively shares the authority and accountability. Or else it is not democracy but a mere autocracy, which is detrimental to the spirit of our constitution," he said.

Sravan said that Governor was a custodian of the Constitution and is responsible to rigorously persuade to implement the same. "The Council of Ministers is collectively responsible and accountable to the legislative assembly and government does not mean one or two individuals. It is unfortunate that without full-fledged cabinet, the assembly sessions are allowed to be held and the honorable Governor delivered lecture, giving direction to the government, which does not have complete cabinet," he said.  

"Ironically, he said, a dictatorial ordinance was brought in with regard to Panchayat Raj Act and the same was assented the ordinance by the Governor without looking into whether there was minimum quorum of cabinet ministers to recommend such ordinance. On the whole there is a serious crisis to democracy and the spirit of constitution is being destroyed in Telangana," he said while appealing the Governor to ensure that provisions of article 163 and 164 of our constitution are implemented to protect the interests of people and democracy at large. He urged the Governor to intervene to ensure expansion of cabinet on a war footing.

Congress workers praised for good performance in Panchayat elections

Sravan also congratulated the Congress workers and leaders for putting up a brave and decent performance in Panchayat Raj elections. He said despite defeat of several senior leaders in recently held elections, party activists did not let their morale go down. They bravely countered the threats and intimidation by TRS MLAs at local level and ensured Congress victory in over 900 Gram Panchayats as against 2600 won by TRS in the first phase. He said that the Congress party could have won more seats if ruling party would not have misused official machinery and police to win polls. He appealed the Congress workers to exhibit the same spirit in the second and third phase of Panchayat Raj elections.

EVM hacking is a reality: Sravan

Alleging that EVM hacking was a reality, Sravan demanded that the Election Commission of India introduce ballot paper in the forthcoming Lok Sabha elections. He said cyber expert Syed Shuja's has made several shocking revelations in the London conference on how EVMs were hacked and how the murders of BJP leader Gopinath Munde and writer Gowri Lankesh were linked to EVM hacking. He said that EVM tampering was the only reason why ECI did not accept the Congress party's demand to count the VVPATs slips in recently held Assembly elections in Telangana.

TPCC Spokespersons Syed Nizamuddin and Charan Kaushik Yadav were also present in the press conference. (eom)




క్యాబినెట్ విస్తరణ జాప్యం వల్ల జరిగిన రాజ్యాంగ ఉల్లంఘనను అడ్డుకోకపోవడం ప్రజాస్వామ్య స్పూర్తికి విరుద్దమని గవర్నర్ కు లేఖ రాసిన డాక్టర్ శ్రవణ్.


క్యాబినెట్ విస్తరణ జాప్యం వల్ల జరిగిన రాజ్యాంగ ఉల్లంఘనను అడ్డుకోకపోవడం ప్రజాస్వామ్య స్పూర్తికి విరుద్దమని గవర్నర్ కు  లేఖ రాసిన డాక్టర్  శ్రవణ్.

టీఆర్ఎస్ సర్కార్ కు  గుడ్డిగా  వత్తాసు పలకడం గవర్నర్ కు సరికాదని వెల్లడి.
ఆర్టికల్ 163,164 ప్రకారం కనీసం 12 మంది మంత్రులను నియమించేలా చర్యలు తీసుకోవాలని విజ్నప్తి.
పంచాయితీఎన్నికల్లో మూడోవంతు స్ధానాల్లో  కాంగ్రెస్ పార్టీ గెలుపొందడంలో కృషి చేసిన కార్యకర్తలకు  అభినందన.  
ఈవిఎంల టాంపరింగ్ జరిగిందని వస్తున్న ఆరోపణ ల నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్లు ప్రవేశపెట్టాలని డిమాండ్.


ప్రజలెన్నుకున్న ప్రభుత్వం కొనసాగాలంటే రాజ్యాంగ నిభంధనలకు లోబడి తప్పనిసరిగా క్యాబినెట్  విస్తరణ జరగాలని రాజ్యాంగం ప్రకారం కనీసం 12 మంది మంత్రులు ఉండాలని, రాజ్యాంగ పరిరక్షకుడైన గవర్నర్ రాజ్యాంగ పరిరక్షణకు పూనుకొని తక్షణమే కాబినెట్ మంత్రులను నియమించాలని ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ శ్రవణ్ దాసోజు అన్నారు. ఇవాళ మధ్యాహ్నం గాంధీ భవన్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో పాల్గొన్న ఆయన  మంత్రుల నియామకం ప్రజల ప్రాతినిధ్యానికి సంబంధించిన అంశమన్నారు, రాజ్యాంగంలో స్పష్టం గా ఉందని దీన్ని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు  బేఖాతర్ చేస్తున్నారని కనీసం రాజ్యాంగ పరిరక్షకుడిగా ఉండాల్సిన గవర్నర్ ప్రత్యేక శ్రద్ద చూపాలన్నారు.  ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే తెలంగాణాలో ప్రభుత్వం నడవడం లేదని గవర్నర్ కు తన పనితీరులో సహాయకులుగా ఉండాల్సిన మంత్రులు లేకపోవడం  సరికాదన్నారు. ముఖ్యమంత్రి, హోం మంత్రి మాత్రమే ప్రమాణస్వీకారం చేశారని హోం మంత్రికి ఎలాంటి నిర్ణయాధికారాలు లేవని ముఖ్యమంత్రి ఫెడరల్ రాజకీయాలు, పూజలు పునస్కారాల పేరిట కాలం వెళ్లదీస్తున్నారని డాక్టర్ శ్రవణ్ ఆరోపించారు.
ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతుంటే వత్తాసు పలుకుతున్న గవర్నర్... డాక్టర్ శ్రవణ్ దాసోజు ఆరోపణ
తెలంగాణాలో మొత్తం 33 శాఖలు, 298 ఆర్గనైజేషన్లు ఉన్నాయన్నాయని, కాని టీఆర్ఎస్ ప్రభుత్వంలో కేవలం ఒకే ఒక మంత్రి మహమూద్ అలీ ప్రమాణ స్వీకారం చేశారని ఆయనకు నాలుగుశాఖలు మాత్రమే కేటాయించారన్నారు. అయినే నిర్ణయాధికారం ముఖ్యమంత్రి చేతిలోనే ఉందని శ్రవణ్ ఆరోపించారు. కనీసం హోం గార్డునుకూడా ట్రాన్స్ఫర్ చేయించలేని హోం మంత్రి మినహా మరో మంత్రి లేక పోవడం దారుణమన్నారు. నిరంతరం మంత్రుల సలహాలు, సూచనలను అమలుచేయాల్సిన గవర్నర్ ఎవరి సూచనలు సలహాల ప్రకారం ప్రభుత్వాన్ని నడుపుతున్నారో స్ఫష్టం చేయాలన్నారు. గవర్నర్ పట్టింపులేనట్టు వ్యవహరించడం వల్ల తెలంగాణాలో ప్రభుత్వం ఉందో లేదో తెలియడం లేదన్నారు.33 శాఖల్లోంచి సమాచారం తెప్పించుకోవడం, రివ్యూలు చేయడం కేవలం ఒక్క ముఖ్యమంత్రి, హోం మంత్రి వల్ల కాదని.. ఇవన్నీ ఒంటిచేత్తే చక్కబెట్టేందుకు ముఖ్యమంత్రి ఏమన్నా సూపర్ కంప్యూటరా అని శ్రవణ్ ఎద్దేవా చేశారు. ప్రజలను ఎందుకు మభ్యపెడుతున్నారో స్పష్టంచేయాలని, రాజ్యాంగ ఉల్లంఘనను గవర్నర్ ఎందుకు వత్తాసు పలుకుతున్నరో చెప్పాలని డిమాండ్ చేశారు.
ఏడాదంతా ఎన్నికలతో ఎవరి ప్రయోజనాలు నెరవేరుస్తారని సూటి ప్రశ్న
2014 తర్వాత ఐదేళ్ల పాటు సుస్థిరపాలన కొనసాగుతుందని భావించి ప్రజలు నమ్మకంతో  ఓట్లేసి టీఆర్ఎస్ కు పట్టం కట్టారని, కాని అధికారం లోకి వచ్చింది  మొదలు తన నియంతృత్వ ఆలోచనతో  పాలన సాగించిన కేసీఆర్ అకస్మాత్తుగా ముందస్తు ఎన్నికలకు పోయిండన్నారు. దీంతో 9 నెలల పాలన కుంటుపడిందని మళ్లీ ఇప్పడు పంచాయితీ ఎన్నికలు, ఆతర్వాత ఎంపీటీసి, జెడ్పీటిసి, ఎంపీ ఎన్నికలు, మున్సిపాలిటి ఎన్నికలు ఇలా ఏడాదంతా ఎన్నికలు ఉండడం వల్ల  కోడ్ అమలులో ఉంటుందని ఇలాగయితే  పాలన సజావుగా  ఎలా సాగుతోందని ప్రశ్నించారు. ప్రభుత్వం ఏర్పాటయిన తర్వాత కూడా మంత్రులను నియమించక పోవడం వల్ల ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు.
అస్తవ్యస్థంగా ఆర్ధిక వ్యవస్థ.. డాక్టర్ శ్రవణ్
తెలంగాణా రాష్ట్రం పూర్తిగా అప్పుల్లో మునిగిపోయి లోటు బడ్జెట్ తో కొట్టుమిట్టాడుతోందని డాక్టర్ శ్రవణ్ ఆరోపించారు. డబ్బులు లేక వేల కోట్ల కాంట్రాక్ట్ లు అన్నీ ఆగిపోయాయన్నారు. ఒకటో తారీఖున రావాల్సిన ఫించన్లు  సకాలంలో విడుదల చేయలేకపోతున్నారన్నారు. ఆర్ధిక మంత్రి ని నియమించకపోతే బడ్జెట్ ఎవరు తయారుచేస్తున్నారో స్పష్టత లేదన్నారు. ఒక పక్కన సిబ్బందికి  జీతాలు ఇవ్వడంలో ఆలస్యం అవుతోందని, ఇంతా జరుగుతున్నా ముఖ్యమంత్రి పై ఒత్తిడి తెచ్చి మంత్రి వర్గ విస్తరణ చేపట్టాల్సిన గవర్నర్ స్పందించక పోవడం సరికాదన్నారు. అలాగే 2014 ఎన్నికల్లో, 2018 ఎన్నికల్లో  ఎన్నో వాగ్దానాలు చేశారని  వాటన్నింటిని కొనసాగిస్తారా లేక వదిలేస్తారో తెలియడం లేదని డాక్టర్ శ్రవణ్ ఆందోళన వ్యక్తం చేశారు. రైతు బంధు పథకానికి సంబంధించిన అంశంలో ఎన్నికల కు ముందు  రైతులకు డబ్బులు వచ్చినట్లు మెసేజ్ లు పంపారని కాని ఇంతవరకు ఎవరి ఖాతాల్లో  డబ్బులు జమకాలేదని ఆరోపించారు.  
నిరుద్యోగ సమస్యలపై శాసనసభలో ఎందుకు ప్రస్తావించలేదని గవర్నర్ కు సూటి ప్రశ్న.
తెలంగాణా రాష్ట్రంలో దాదాపు 30 లక్షల మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎదిరి చూస్తున్నారని కాని వారి సమస్యను నివారించేదిశగా ఎలాంటి ప్రస్తావన గవర్నర్ ప్రసంగంలో లేదని డాక్టర్ శ్రవణ్ దుయ్యబట్టారు. గవర్నర్ ప్రసంగం చూస్తే ప్రజల మనోభావాలకు అనుగుణంగా కాకుండా. ప్రభుత్వం ఏం చెబితే అదే వేదంగా నడుచుకుంటున్నట్టుగా ఉందని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ పార్టీ చెప్పినట్టు చేయడం వారికి కొమ్ముకాయడం గవర్నర్ వ్యవస్థ ను దిగజారుస్తుందన్నారు.
163,164 ఆర్టికల్ ప్రకారం క్యాబినెట్ విస్తరణ వెంటనే చేపట్టేలా చర్యలు తీసుకోవాలన్న శ్రవణ్
టీఆర్ఎస్ ప్రభుత్వం మెడలు వంచి రాజ్యాంగ సూత్రాలకు లోబడి ఆర్టికల్ 163,164 ప్రకారం
క్యాబినెట్ విస్తరించేలా చర్యలు తీసుకోవాలని డాక్టర్ శ్రవణ్ సూచించారు. కనీసం  పన్నెండు మంది మంత్రులను నియమించేలా వత్తిడి చేయాలన్నారు. రాజ్యాంగానికి కస్టోడియన్ అయిన గవర్నర్ ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని రాజ్యాంగ సాంప్రదాయాలను కాపాడాలని మొద్దు నిద్రను వీడాలని సూచించారు.
పంచాయితీఎన్నికల్లో మూడోవంతు స్ధానాల్లో  కాంగ్రెస్ పార్టీ గెలుపొందడంలో కృషి చేసిన కార్యకర్తలకు  అభినందన.  
కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీ జెండాను పల్లెపల్లెకు మోసుకు పోయి పంచాయతీరాజ్ ఎన్నికల్లో అనేక గ్రామాల్లో సర్పంచ్ లను గెలిపించుకున్నకార్యకర్తలను డాక్టర్ శ్రవణ్ అభినందించారు. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్య నాయకులంతా ఓటమి బాధతో ఉన్నా కార్యకర్తలు మాత్రం ఎత్తిన జెండా విడవకుండా సర్పంచ్ ఎన్నికల్లో గెలుపు బావుటా ఎగిరేసిన్రన్నారు. బెదిరించి భయపెట్టి 800 పై చిలుకు ఏకగ్రీవం చేసినా పోటీచేసిన 1800 సర్పంచ్ స్ధానాల్లో 900 స్థానాల్లో కాంగ్రెస్  పార్టీ గెలిచిందని దీన్ని బట్టి  చూస్తే మొన్న జరిగిన ఎమ్మెల్యే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ దొడ్డి దారిన గెలిచిందని స్పష్టం అవుతోందన్నారు. విచ్చల విడిగా మద్యాన్ని ఏరులై పారించినా అడుగడుగునా పోలీసులను మోహరించినా  పెద్దయెత్తున సీట్లు గెలుచుకోవడం చూస్తే గ్రామాల్లో కాంగ్రెస్  పార్టీకి ఉన్న ఆదరణ ఏంటో స్పష్టం అవుతోందన్నారు. ఇంకా చాలా చోట్ల కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులను బెదిరించి భయపెట్టి తమ పార్టీలోకి లాక్కున్నారని లేకుంటే మరిన్ని సీట్లు గెలుచుకునే వారమన్నారు. రెండు, మూడు విడుతల్లో జరుగబోయే సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు రెట్టించిన ఉత్సాహంతో పనిచేయాలని కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషిచేయాలని పిలుపు నిచ్చారు.
ఈవిఎం ల హాకింగ్ నిజమేనని నిపుణులు తేల్చినందున రాబోయే ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్ పెట్టాలని డిమాండ్.
లండన్ లో నిర్వహించిన హాకతాన్ లో  ఎలక్ట్రానికి ఓటింగ్ మిషన్ లను హాకింగ్ చేయడం సాధ్యమేనని ప్రముఖ నిపుణుడు సయ్యద్ షుజా తేల్చిన నేపధ్యంలో రాబోయే ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్ ప్రవేశ పెట్టాలని ఎన్నికల కమీషన్ ను డాక్టర్ శ్రవణ్ డిమాండ్ చేశారు. ఈవిఎంలు టాంపరింగ్ చేశారని వివిపాట్ స్లిప్పులు లెక్కించాలని తాము చేసిన విజ్నప్తి ని ఎన్నికల కమీషన్ బేఖాతర్ చేసిందని  ఆయన ఆరోపించారు. అలాగే సయ్యద్ షుజా చెప్పినట్లు హాకింగ్ వెనుక కుట్ర కోణం ఉందని గోపీనాధ్ ముండే, గౌరీలంకేశ్ హత్యల వెనుక ఉన్న గూడు పుఠాణీ వెలికి తీయాలని డిమాండ్ చేశారు. డాక్టర్ శ్రవణ్ వెంట కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధులు సయ్యద్ నిజాముద్దీన్,  చరణ్ కౌశిక్ యాదవ్ లు విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు.






Tuesday 8 January 2019

ప్రొటెం స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ ను అనర్హుడుగా ప్రకటించాలి.......ఏఐసిసి అధికార ప్రతినిధి డాక్టర్ శ్రవణ్ దాసోజు.


43 కేసులున్న వ్యక్తి  ఎందుకు శిక్షించడం లేదో ముఖ్యమంత్రి స్పష్టం చేయాలి.

అసదొద్దీన్, రాజాసింగ్ లు  మత విద్వేషాలు రెచ్చగొట్టడంలో పోటీ పడుతున్నారని వ్యాఖ్య.

బిజెపి అధినాయకత్వం రాజాసింగ్ ను పార్టీ నుంచి బహిష్కరించాలని డిమాండ్.


హైదరాబాద్ : జనవరి 8. 2019. తెలంగాణా శాసన సభ సభ్యుడిగా మైనార్టీ కి చెందిన ప్రొటెం స్పీకర్ ముందు  ప్రమాణ స్వీకారం చేయనని  మత తత్వ బిజెపి పార్టీ కి చెందిన  గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అనడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. రాజా సింగ్ వ్యాఖ్యలు యావత్ మైనార్టీ సమాజాన్ని కించ పరిచినట్లేనని, ఆసమాజం పై ఆయనకున్న ద్వేష భావాన్ని బహిర్గతం చేస్తున్నాయని, ప్రజాస్వామ్య సిద్దాంతాలకు, లౌకిక విధానాలకు ఆయువు పట్టైన శాసనసభ లో బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ కొనసాగే అర్హత లేదని ఆయననను తక్షణమే అనర్హుడుగా ప్రకటించాలని ఏఐసిసి అధికార ప్రతినిధి డాక్టర్ శ్రవణ్ దాసోజు డిమాండ్ చేశారు.

43 కేసులున్న వ్యక్తి  ఎందుకు శిక్షించడం లేదో ముఖ్యమంత్రి స్పష్టం చేయాలి.

బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ పై దాదాపు 43 క్రిమినల్ కేసులు నమోదయ్యాయని వాటిలో ఎక్కువ మేరకు విద్వేషపూరిత ప్రసంగాలకు సంబంధించినవేనని డాక్టర్ శ్రవణ్ ఆరోపించారు.  2014 లో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన  తర్వాత రాజాసింగ్ పై దాదాపు 24 కేసులు నమోదయ్యాయన్నారు. టీఆర్ఎస్ పాలన లో ఆయన పై నమోదయిన ఏ ఒక్క కేసుల్లో  కూడా అరెస్ట్ చేసిన దాఖలాలు లేవన్నారు. లౌకిక వాదం అంటూ గొప్పలు చెప్పే కేసీఆర్  ఎందుకు రాజాసింగ్ ను కాపాడుతున్నారని, పోలీసులు ఆయన పై చర్యలు తీసుకోకుండా ఎందుకు అడ్డుకుంటున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ పార్టీతో అంటకాగుతున్న ఎంఐఎం పార్టీ నేత అసదొద్దీన్ ఒవైసీ రాజాసింగ్ పై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి పై ఎందుకు వత్తిడి తేలేకపోతున్నారో, ఈ ఇద్దరి మధ్య ఉన్న రహస్య ఒప్పందం ఏంటో స్పష్టం చేయాలన్నారు.

అసదొద్దీన్, రాజాసింగ్ లు  మత విద్వేషాలు రెచ్చగొట్టడంలో పోటీ పడుతున్నారని వ్యాఖ్య.

ఓవైసీ సోదరులు, రాజాసింగ్ లు ఇరువురు  విద్వేషపూరిత ప్రసంగాలు చేస్తూఒకరికి మరోకరు సహకరించుకుంటున్నారన్నారు.  భవిష్యత్తులో ఈ ఇరువురు మట్టి కరువక తప్పదని హెచ్చరించారు. ద్వేష పూరిత ప్రసంగాలు చేస్తున్న వారిపై కఠిన చర్యలకు పూనుకోక పోతే  వీరి ఆగడాలకు అడ్డుండదన్నారు.చట్టంమంటే భయం లేకుండా వ్యవహరిస్తు సంఘ విద్రోహులుగా  పేట్రేగి పోతున్నారని ఆరోపించారు.
రాజాసింగ్ పై అనర్హత వేటు వేయాలి... డాక్టర్ శ్రవణ్ డిమాండ్
బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ గతంలో మాట్లాడిన రికార్డుల ఆధారంగా రాజాసింగ్ పై పెండింగ్ లో ఉన్న కేసుల పై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ను డాక్టర్ శ్రవణ్ కోరారు.  రాజాసింగ్ కేవలం మతం కారణంగా ప్రొటెం స్పీకర్ ముందు ప్రమాణం చేయననడం పై ఆయన సభ్యత్వాన్ని రద్దు పరిచేందుకు  అసెంబ్లీలో తీర్మానం చేయాలని, ఆయన్ను పదవిచ్యుతుణ్ని చేయాలని డిమాండ్ చేశారు. గతంలో ఏ తప్పు చేయని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ కుమార్ ల సభ్యత్వాలను రద్దుచేసిన టీఆర్ఎస్ పార్టీ  ద్వేష పూరిత వ్యాఖ్యలు చేసిన రాజాసింగ్ పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో చెప్పాలన్నారు.
ద్వేష పూరిత వ్యాఖ్యలను సహించకూడదని ముఖ్యమంత్రికి సూచన.
గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ద్వేష పూరిత వ్యాఖ్యలు చేసిన ఎంఐఎం పార్టీ నేతలు ఓవైసీ సోదరులను జైలుకు పంపామని అలాంటి ద్వేష పూరిత వ్యాఖ్యలు చేసిన రాజాసింగ్ పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో చెప్పాలని, ద్వేష భావాన్ని పెంపోందించే వ్యక్తులపై కనికరం చూపరాదని, ముఖ్యమంత్రి  వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డాక్టర్ శ్రవణ్  సూచించారు. 
బిజెపి అధినాయకత్వం రాజాసింగ్ ను పార్టీ నుంచి బహిష్కరించాలని డిమాండ్.
రాజాసింగ్ తన ప్రకటన ద్వారా ఒక కమ్యూనిటి పట్ల తన పార్టీ అభిప్రాయాన్ని వెల్లడించారని డాక్టర్ శ్రవణ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. బిజెపి అధ్యక్షుడు అమిత్ షా, ప్రధాని నరేంద్ర మోడి లు తమ పార్టీ ఎమ్మెల్యే మాట్లాడిన మాటలను సమర్దిస్తున్నారా లేక వ్యతిరేకిస్తున్నారో వెల్లడించాలని దేశంలోని అన్ని మతాలు ప్రజల పట్ల సమభావంతో ఉన్నట్లయితే వెంటనే రాజాసింగ్ ను పార్టీనుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు. ఒక వర్గం పట్ల తీవ్ర వ్యతిరేకత ప్రదర్శించే రాజాసింగ్ లాంటి వ్యక్తులు  అసెంబ్లీలో ఎమ్మెల్యేలుగా ఉండడం దురదృష్టకరమని ఇలాంటి వారి వల్ల దేశంలో జాతి సమగ్రతకు భగ్నం కలుగుతున్నదని డాక్టర్ శ్రవణ్ అన్నారు.

Congress demands BJP MLA Raja Singh's expulsion from Assembly




Hyderabad, January 8: The Congress party has strongly condemned BJP's MLA-elect Raja Singh's statement saying he would not take oath as member of Telangana Legislative Assembly in front of a Pro-Tem Speaker who is a Muslim.



"Raja Singh's statement shows the level of hatred that he holds against the Muslim community. He does not deserve to be a Member of Legislative Assembly which is a symbol of democracy and secularism. He must be expelled from the House with immediate effect," demanded All India Congress Committee (AICC) Spokesperson Dr. Sravan Dasoju in a statement on Sunday.

Sravan pointed out that as many as 43 criminal cases were pending against Raja Singh and most of them pertain to hate speeches. He said as many as 24 cases were booked against Raja Singh since 2014 under TRS regime. However, he said Raja Singh was never arrested or tried in those cases. "Why TRS Government, which claims to be secular, is defending Raja Singh? Why Chief Minister K. Chandrashekhar Rao is preventing the police authorities from taking action against the BJP MLA who has crossed all the limits? Why MIM President Asaduddin Owaisi is not using his influence over CM KCR to send Raja Singh behind the bars for his utterances?" he asked.

The Congress leader alleged that "Owaisi brothers and Raja Singh serve as fodder for each other. While hate speeches made by Owaisi brothers give fodder to BJP leaders, persons like Raja Singh reciprocate by making hate statements against Muslims and MIM. Owaisi and Raja Singh are made for each other and both will be finished if either of them collapses," he said. However, he said people like Raja Singh could not be allowed to spread hatred and must be punished in an exemplary manner. Else, they will continue to spread hatred without any fear of law, he said.

Sravan asked the Chief Minister to take serious note of Raja Singh's statements and inaction on pending cases against him. Since Raja Singh has given a statement against the Pro-Tem Speaker due to his religion, a resolution should be passed in the Assembly cancelling Raja Singh's membership. "If TRS Government could expel two Congress MLAs without any fault just by passing a resolution, why it cannot give same treatment to BJP MLA who is spreading hatred?" he asked.

He pointed out that the previous Congress regime has put Owaisi brothers in jail when they gave hate speeches. "There should be zero tolerance against people who spread hatred and communalism," he said.

The AICC Spokesperson said that Raja Singh's statement reflects the mindset of entire BJP which is surviving on the foundation of hatred against a particular community. He said BJP President Amit Shah and Prime Minister Narender Modi should expel Raja Singh from the BJP if his statement does not align with their party's mindset. "People like Raja Singh do not deserve to be MLA and must be expelled not only from the Assembly, but also from the party and also the country. There should be no place in the country for the people who want to survive by speaking ill against other communities," he said. (eom)

Saturday 5 January 2019

KCR ploy to cut down OBC reservations through Supreme Court: AICC Spokesperson Dr. Dasoju Sravan


Hyderabad, January 5: All India Congress Committee (AICC) Spokesperson Dr. Dasoju Sravan alleged that it was Chief Minister K. Chandrashekhar Rao’s ploy to reduce the quota for Backward Classes in Panchayat Raj polls from 34% to 22.8% through Supreme Court.




Addressing a massive dharna at Indira Park organised by Telangana Jana Samithi on Saturday, Sravan said BCs played an active role in statehood movement and a majority of nearly 1500 youth who committed suicide for Telangana were BCs. The BCs made several sacrifices with the hope that the community would get social justice in the new State. However, he said injustice was being done with BCs after formation of Telangana State and conspiracies were being hatched to crush their political representation.

Sravan said that KCR has brought a situation where in the BCs are unable to get even 34% reservation in Panchayat Raj elections which they used to get in the past. He said that KCR was misleading the people by saying that the quota was reduced due to an order of the Supreme Court. He said after the Krishna Murthy Vs Govt of India case of 2010, a quota of 34% has been implemented for BCs in all Panchayat and local bodies elections held in the erstwhile united Andhra Pradesh. He said this particular case in not an impediment for enhancing the reservation provided KCR had submitted the details of Intensive Household Survey with figures of BC population and the caste-based socio-economic status and political backwardness.

The Congress leader said that KCR simply brought an ordinance reducing quota to 23% for the BCs who constitute nearly 52% of the total population in Telangana. He said KCR did not consult the opposition parties, BC associations or other community leaders before bringing an ordinance. He alleged that the KCR also did not implement the High Court orders for caste-based enumeration of BC voters and categorisation of BC reserved seats in A, B, C, D, and E categories. He asked whether TRS itself had not approached court during GHMC elections of 2009 seeking categorisation of BC seats.

Sravan said that the cut in BC quota was aimed at political suppression of BCs at ground level. Due to the reduction in quota from 34% to 23%, less number of BCs will be elected as Sarpanch, MPTC and ZPTCs. He said of 119 MLAs, as many as 39 belong to Reddy community. However, BCs, who constitute 52% of population, has only 25 MLAs. He said if BCs are given proper reservation, then at least 60 BC MLAs would get elected. He said KCR wants BCs to continue with their old professions and does not grow politically. He also slammed at MIM President Asaduddin Owaisi for his silence on the cut of quota for BCs as it would also affect Muslims coming under BC-E category.

Sravan enthralled the BCs belonging to all political parties and associations to join hands to fight against the injustices being done to the community by KCR Government.

The dharna was also addressed by TJAC Chairman Prof. M. Kodandaram, BC Welfare Association President R. Krishnaiah and other leaders. (eom)

రాజకీయాలకు అతీతంగా జెండాలు, ఎజెండాలు పక్కన బెట్టి బిసి రిజర్వేషన్లకోసం పోరాడాలి ఏఐసిసి అధికార ప్రతినిధి డాక్టర్ శ్రవణ్ దాసోజు.

  • రాజకీయాలకు అతీతంగా  జెండాలు, ఎజెండాలు పక్కన బెట్టి  బిసి రిజర్వేషన్లకోసం పోరాడాలి ఏఐసిసి అధికార ప్రతినిధి డాక్టర్ శ్రవణ్ దాసోజు.
  • 50 శాతం రిజర్వేషన్లు పెంచడానికి సుప్రీంకోర్టు అడ్డుకాదు..ప్రభుత్వము బిసీల వెనుకబాటు తనాన్ని అధ్యయనం  చేసి కోర్టుకు ఇస్తే.. కోర్టు బిసి రిజర్వేషన్లను ఎట్టి పరిస్థితిలో వ్యతిరేకించదు.
  • బిసి రిజర్వేషన్ ల అమలు పట్ల టీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా తెలంగాణా జన సమితి చేపట్టిన దీక్షకు మద్దతు ప్రకటించిన కుట్రపూరితంగా బిసిల రిజర్వేషన్లు ఇవ్వకుండా టీఆర్ఎస్ పార్టీయే కుట్రతో కేసులేసి అడ్డుకుంటుందని ఆరోపణ.
  • రాజకీయంగా ఎదగాలంటే పంచాయితీరాజ్ ఎన్నికల్లో బిసిలకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ 
  • బిసి రిజర్వేషన్ల విషయంలో కోర్టు ఉత్తర్వులను బేఖాతర్ చేసి కేసీఆర్ కోర్టు ధిక్కరణకు పాల్పడుతున్నారని ఆరోపణ.
  • ఎన్నికలు అడ్డుకునేందకు టీఆర్ఎస్ పార్టీ కేసులేస్తే తప్పులేదు కాని న్యాయం కోసం బిసిలు కోర్టుకు వెళితే తప్పెలా అవుతుందని సూటిప్రశ్న.
  • ఒక్క రోజులో సమగ్ర సర్వే చేయగలిగిన కేసీఆర్, ఆరునెలలుగా బిసిల కులగణన చేయకపోవడం కుట్ర పూరితమన్న డాక్టర్ శ్రవణ్ దాసోజు.
  • బిసిల రిజర్వేషన్ల కోసం పార్టీల రహితంగా నాయకులు పోరాడాలని పిలుపు.





దళితులు సామాజిక అంటరాని తనం ఎదుర్కుంటుంటే... బీసిలు రాజకీయ అంటరాని తనం ఎదుర్కుంటున్నారని, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ఎడతెగని పోరాటం చేసిన బీసి బిడ్డలు రాజ్యాంగ బద్దంగా బిసీలకు రావాల్సిన హక్కుల కోసం  మరో మారు  రోడ్డెక్కాల్సిన అవసరం ఏర్పడ్డదని ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటి అధికార ప్రతినిధి డాక్టర్ శ్రవణ్ దాసోజు అన్నారు. బిసి రిజర్వేషన్ ల అమలు పట్ల టీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా శనివారం మధ్యాహ్నం ఇందిరాపార్క్ వద్ద  తెలంగాణా జన సమితి చేపట్టిన దీక్షకు మద్దతు ప్రకటించిన దాసోజు తెలంగాణా సాధన కోసం దాదాపు 1500 వందల మంది బిడ్డలు ఆత్మబలిదానం చేసుకుంటే వారిలో ఎక్కువ మంది బీసిల బిడ్డలే అత్మహత్యలు చేసుకున్నారని  తెలంగాణా రాష్ట్ర సాకారం అయితే తమ హక్కులు సాధించుకోవచ్చని  ప్రాణాలను సైతం లెక్కచేయకుండా బరిగీసి కొట్లాడారన్నారు.  తెలంగాణా వస్తే సామాజిక న్యాయం వస్తుందని,  హక్కుల కాపాడ బడుతాయని, రాజ్యాంగ బద్దమైన ప్రజాస్వామిక హక్కులు పోందవచ్చని భావించారన్నారు. ఇందుకోసం చేస్తున్న పనులు పక్కన బెట్టి, రోడ్ల మీదికి వచ్చి కొట్లాడి తెలంగాణా సాధించుకున్నామన్నారు. కాని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దుర్మార్గంగా ప్రవర్తిస్తూ బీసిల నోట్లో మన్నుగోట్టి నాలుగున్నరేళ్ల తర్వాత కూడా ఎక్కడేసిన గొంగళక్కడే అన్నట్లు మార్చారని ఆరోపించారు.
గతంలో ఇచ్చిన 34 శాతం రిజర్వేషన్లు ఇప్పుడెందుకు ఇవ్వలేక పోతున్నారో స్పష్టం చేయాలి.
2010 లో కృష్ణమూర్తి వర్సెస్ భారత ప్రభుత్వం విషయంలో  సుప్రీంకోర్టులో తీర్పు ఇస్తే ... ఆతర్వాత దేశవ్యప్తంగా జరిగిన ఎన్నికల్లో బీసిలకు 34 శాతం రిజర్వేషన్లు అమలయ్యాయని గుర్తుచేశారు. అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదశ్ లో కూడా రిజర్వేషన్లు అమలయ్యాయని కాని ఇప్పుడెందుకు రిజర్వేషన్లు అమలు చేయలేకపోతున్నారో ముఖ్యమంత్రి స్పష్టం చేయాలన్నారు. ఆర్డినెన్స్ ద్వారా అనుకున్న పదవులు ఇచ్చుకుంటున్న కేసీఆర్ 52 శాతం ఉన్న బిసి భవిష్యత్తును నిర్ణయించే రిజర్వేషన్లు విషయంలో ఆర్డినెన్స్  ఎందుకు తీసుకువచ్చారని ప్రశ్నించారు.
ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికయిన ఎమ్మెల్యే,  ప్రతిపక్షనేతలు, ప్రజాసంఘాల నేతలుండగా ఎవరితో చర్చ చేయకుండా దొడ్డిదారిన  ఆర్డినెన్స్ ఎందుకు తేవడాన్ని డాక్టర్ శ్రవణ్ తప్పుపట్టారు.
బిసి ల పట్ల చిన్నచూపు చూస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్
బిసికులాలకు చెందిన వారిని బానిసల్లా బతకండని శాసించిండన్నారు. అణగదొక్కేందకు చేసే ప్రయత్నంలో భాగంగానే దొడ్డిదారిన ఎన్నికలకు పోతున్నాడన్నారు.  పంచాయితీరాజ్ చట్టం 2018 ప్రవేశ పెట్టినప్పుడు  సమగ్ర కుటుంబ సర్వే చేసినప్పుడు 52 శాతం ఉన్నరని తెలిసిన  మేమెంతో మాకంత రావాలని ఉద్యమంలో కూడా కొట్లాడామన్నారు.  ప్రాణాలకు తెగించి సాధించుకున్న తెలంగాణాలో సమగ్ర సర్వే ప్రకారం  52 శాతం కాకుండా ఎందుకు 33 శాతం రిజర్వేషన్లు ఇస్తున్నారని కోర్టులో కేసు వేసానని, విద్యా ఉపాధి రంగాల్లో ఏ,బీ,సి,డి, ఈ ,లుగా ఎలాగయితే రిజర్వేషన్లు అమలు అవుతున్నయో అదేవిధంగా రాజకీయాల్లో కూడా ఎందుకు అమలు చేయాలని కోరానన్నారు. కాని ముఖ్యమంత్రి తన స్ధాయి మరిచి వాడెవడో దాసోజు శ్రవణ్ అట ఏ,బీ,సి,డి,ఈ లు గా వర్గీకరించాలని కేసు వేశాడని వెటకారంగా మాట్లాడుతున్నాడని శ్రవణ్ ఆక్షేపించారు.
ఎన్నికలు అడ్డుకునేందకు టీఆర్ఎస్ పార్టీ కేసులేస్తే తప్పులేదు కాని న్యాయం కోసం బిసిలు కోర్టుకు వెళితే తప్పెలా అవుతుందని సూటిప్రశ్న.
13300 మంది కి రిజర్వేషన్లు చేయాలంటే ఎన్నికలు ఎప్పుడవుతాయని ప్రశ్నిస్తున్న ముఖ్యమంత్రికి గతంలో 2009 లో జీహెచ్ ఎంసీ కార్పోరేషన్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో పోటీ చేయకున్నా ఎన్నికలు అడ్డుకోవాలనే కుట్ర తో ఏ,బీ,సి,డి అమలు చేయాలని సత్యం రెడ్డి టీఆర్ఎస్ పార్టీ ఫౌండర్ అడ్వకేట్, ఇవాళ అడ్వకేట్ జనరల్ గా ఉన్న రామచంద్రరావులతో కేసేయించింది మరిచిపోయారా అని ప్రశ్నించారు. రాజకీయ అవసరాలకోసం కేసేస్తే తప్పులేదు కాని బిసిల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానానికి అనుగుణంగా కేసేస్తే తప్పని మాట్లాడతున్నారని ఆరోపించారు. మేమెంతో మాకంత ఇవ్వడానికి ముఖ్యమంత్రికి వచ్చిన కష్టమే0టో చెప్పాలని డిమాండ్ చేశారు. రెడ్లు వెలమలు మాత్రమే రాజకీయంగా ఎదుగుతున్నారని బిసిలకు చెందిన చిన్న కులాలు రాజకీయంగా అభివృద్ది చెందే అవకాశం రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

లీడర్ షిప్ ఎదగాలంటే పంచాయితీరాజ్ ఎన్నికల్ల రిజర్వేషన్లులుంటేనే సాధ్యమన్న శ్రవణ్
గ్రామస్ధాయిల్లో జరిగే ఎన్నికలు లీడర్ షిప్ ఎదిగేందుకు అవకాశం ఉంటుందని కొత్తనాయకత్వం తయారు కావాలంటే రిజర్వేషన్లు అవసరమన్నారు. సర్పంచ్ లు, ఎంపీటిసి, జెడ్పీటిసి అయితేనే రాజకీయంగా ఎదిగి తద్వారా  జెడ్పీఛైర్మెన్ లుగా ఆతర్వాత ఎమ్మెలేలు అయ్యే అవకాశం ఉంటుందన్నారు. దురదృష్టవశాత్తూ 119 మంది ఎమ్మెల్యేలు ఉన్న అసెంబ్లీలో అతి తక్కువ శాతం ఉన్న రెడ్లు  39 శాతం మంది గెలిచినా.. 52 శాతం మంది ఉన్న బీసిలు 25 మంది కూడా గెలవలేదన్నారు. ఇందుకు కిందిస్ధాయిలో సర్పంచ్ లు ఎంపీటిసిలు, జెడ్పీటిసిలు జనాభాకు అనుగుణంగా లేకపోవడం వల్లనే అన్నారు. రిజర్వేషన్లు సరిగ్గా అమలయితే అసెంబ్లీలో  60 మంది ఎమ్మెల్యేలు బీసిలకు చెందిన వారే ఉండేవారన్నారు. ఎక్కువ సంఖ్యలో బిసీలు ప్రజాప్రతినిధులుగా ఉంటే అడుక్కునే స్ధాయి నుంచి శాసించే స్ధాయికి వస్తామన్నారు. బిసి ల హక్కుల కోసం చట్టసభలో కూచ్చొని గల్లా పట్టి అడిగి  సాధించుకునేవారమని తెలిపారు.
కాని కుమ్మరి కుండలు చేయాలని, చాకలి బట్టలుతుకాలని, మంగలి కటింగులు చేసుకోవాలని దూదేకుల వాళ్లు దూదేరుకోవాలని కేసీఆర్ అంటున్నారన్నారు. ముస్లీంలకు ప్రతినిధిలా మాట్లాడుతున్న అసదొద్దీన్ సోయిలేకుండా కేసీఆర్ కు గుడ్డిగా మద్దతు పలుకుతున్నారని ముస్లీంలకు రిజర్వేషన్లు అమలయితే వందల సంఖ్యలో ప్రజాప్రతినిధులుగా ఉండేవారని బీసీ కులాలన్ని సంఘటితంగా పోరాడాలని పిలుపు నిచ్చారు.
హైకోర్టు తీర్పును ధిక్కరిస్తూ తనకు అనుకూలంగా కోర్టులో కేసులేయించిన ఘనత టీఆర్ఎస్ పార్టీదేనన్న శ్రవణ్
బీసి కులాలకు  న్యాయం జరుగాలని హైకోర్టులో కేసేస్తే జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు గారు  బిసి కులగణన చేయాలని
చాలా స్పష్టంగా ఆదేశాలిచ్చారని బీసిల వెనుక బాటు తనం పై అధ్యయనం చేయాలని తీర్పు చెప్పారన్నారు. అవి రెండు చేసిన తర్వాత గ్రామాల వారిగా ఆ వివరాలన్ని కూడా గ్రామ సభలో పెట్టి ప్రచురించి అభ్యంతరాలు స్వీకరించాలని తద్వారా   ఎన్నికలకు పోవాలా అని ఎ,బీ,సి,డి,ఈ చేయాలని తీర్పు ఇస్తే తనకు తోచిన విథంగా వ్యవహరించారన్నారు.  జూన్,2018లో  కోర్టు తీర్పు వస్తే గడిచిన ఆరునెలలుగా కులగణన చేపట్టకుండా, కాలాయాపన చేశారన్నారు. ముఖ్యమంత్రి ఒక్కరోజులో సమగ్ర కుటుంబ సర్వే చేయగలిగారని కాని కేవలం 2 కోట్ల మంది బీసిల లెక్కలు తీయడానికి అభ్యంతరమేంటని ప్రశ్నించారు. హైకోర్టు స్పష్టమైన తీర్పు  ఇస్తే పక్కన బెట్టి... టీఆర్ఎస్ పార్టీ నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే అనుచరుడు గోపాల్ రెడ్డి అనే వ్యక్తి వేసిన కేసుల ఆధారంగా రిజర్వేషన్లు 50 శాతం దాటకూడదని కేసేయించారన్నారు. కేసులో మూడు, నాలుగు మార్లు హియిరింగు వచ్చినా  రాష్ట్రప్రభుత్వం నుంచి ఏఒక్కరూ హాజరుకాకుండా  బిసిల పట్ల బాధ్యత లేకుండా వ్యవహరించారని ఆరోపించారు. ప్రభుత్వం నుంచి స్పందన లేకనే కోర్టు50 శాతం రిజర్వేషన్లు దాటకూడదని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిందన్నారు. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ కు పోకుండా సుప్రీంకోర్టుకు పోయి కృష్ణమూర్తి జడ్జిమెంట్ ను అసరాగా చేసుకుని తీర్పునిచ్చిందన్నారు. బీసీల వెనకబాటు తనంను పై స్పష్టమైన సమాచారం వస్తే తదనుగుణంగా  రిజర్వేషన్లు కేటాయించుకోవచ్చన్న  విషయాన్ని పక్కదారి పట్టించారని ఆరోపించారు.  ఇదే విషయాన్ని నిమ్మక జయరాజ్ వర్సెస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేసులో స్పష్టం చేసిందని గుర్తుచేశారు.
పార్టీ జెండాలు ఎజెండాలు పక్కన పెట్టి బీసి రిజర్వేషన్లుకోసం సమైక్య పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. బీసిల హక్కుల సాధన కోసం పోరాటం చేయాలని లేదంటే బానిసకొక బానిస అన్నట్లు పరిస్థితి  మారుతుందన్నారు.
తెలంగాణా ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ప్రొఫెసర్ కోదండరాం ఆధ్వర్యంలో బీసీ రిజర్వేషన్లు సాధించుకునేందుకు బీసీలంతా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత వినయ్ కుమార్,బీసి సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య, టీజెఎస్ నేతలు పీఎల్ విశ్వేశ్వర్, దిలీప్ కుమార్, గాదె ఇన్నయ్య, , జస్వంత్, ఝాన్పీ గారు, వార్డు సత్యం, బూస శ్రీనివాస్ గారు నర్సయ్యగారు రమేశ్  తదితరులు పాల్గొన్నారు.

Video Link :

Thursday 3 January 2019

Modi Govt is not for 'Aam Admi', but Ambani-Adani: AICC Spokesperson Dr. Dasoju Sravan

Modi Govt is not for 'Aam Admi', but Ambani-Adani: Sravan

Hyderabad, January 3: All India Congress Committee (AICC) Spokesperson Dr. Dasoju Sravan alleged that the Narender Modi Government at the Centre was not for Aam-Aadmi (common man), but only for entrepreneurs like Ambanis and Adanis.



Addressing a press conference at Gandhi Bhavan on Thursday, Sravan accused Prime Minister Narender Modi of mortgaging the interest of the country to benefit a few individuals like Anil Ambani. He alleged that PM Modi went into hiding to evade a reply on Rafale scam. He demanded that the Central Government constitute a Joint Parliamentary Committee to probe into the Rafale scam.

Sravan said that the Congress party has released the audio clip of Goa Health Minister Vishwajit Pratapsingh Rane wherein he claimed that former Defence Minister and present Goa Chief Minister Manohar Parrikar had all files pertaining to Rafale in his bedroom. Instead of facing the truth, he alleged that PM Modi has been hiding to hush up a defence scam of over Rs. 40,000 crore. Further, he said that the Prime Minister needs to answer as to why his government purchased Rafale aircrafts at escalated prices of Rs. 1650 crore each instead of Rs. 526 crore which was finalised during the previous UPA regime. He said that the government owe an explanation on why the contract was snatched from HAL, a public sector unit with huge experience in defence manufacturing, and given to Anil Ambani's company with no previous experience. By doing so, PM Modi has not only compromised on national security, but also on national wealth, he said.

He said that Rahul Gandhi's demand for a JPC probe was not being accepted only due to the fear that they would get completely exposed.

Sravan also ridiculed PM Modi's statement given in an interview to a news channel that he was not aware of the Federal Front which Telangana Chief Minister and TRS chief K. Chandrashekhar Rao was planning to constitute. Describing it as the biggest joke of 2019, he said KCR has been touring the entire country in the name of Federal Front. By feigning total ignorance about it, Modi is trying to mislead the people, he said. KCR, he said, has been trying to form a Federal Front at the instance of Narender Modi with the only aim to split anti-BJP parties and votes. However, he said that the leadership of Congress president Rahul Gandhi has been receiving tremendous response across the country and many like-minded parties are joining hands to defeat the BJP in next elections.

The Congress leader said Modi has referred to the defeat of 'Praja Kutami' in Telangana Assembly elections to claim that the proposed grand alliance at the national level would meet the same fate. Sravan said PM Modi should realise that the BJP has been almost wiped out of Telangana in Assembly elections. He alleged that PM Modi and BJP chief Amit Shah have cheated the candidates of their own party. He said Modi and Amit Shah have entered into a secret deal with TRS and even killed the interest of their own party in Telangana just to prevent Congress from coming to power. He pointed that the Congress had won 22 seats in 2014 and this time it could win only 19 seats. However, he said BJP's tally in Assembly has come down from 5 in 2014 to just 1 in 2018. He said BJP candidates lost their deposit in 105 seats.

Earlier, TPCC Working President Ponnam Prabhakar and ex-MLA T. Jeevan Reddy felicitated Sravan and congratulated him on being elevated as the AICC Spokesperson. (eom)

కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ గురించి తెలియదంటున్న మోడీ మాటలపై....2019 లోఅతి పెద్ద జోక్ అన్న డాక్టర్ శ్రవణ్ దాసోజు

నరేంద్ర మోడీ  ప్రభుత్వం... "ఆమ్ ఆద్మీ ప్రభుత్వం కాదు...అంబాని,అదాని ప్రభుత్వమని" ఎద్దేవా చేసిన డాక్టర్ శ్రవణ దాసోజు.
రాఫెల్ కుంభకోణంలో దేశ ప్రయోజనాలను తాకట్టు పెట్టిన ప్రధాని నరేంద్రమోడీ, పార్లమెంటులో సమాధానం ఇవ్వకుండా తప్పించుకుంటున్నారని ఆరోపణ.
రాఫెల్ కుంభకోణంలో వాస్తవాలను వెలికి తీసేందుకు జెపిసి వేయాల్సిందేనని డిమాండ్.
కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ గురించి తెలియదంటున్న మోడీ మాటలపై....2019 లోఅతి పెద్ద జోక్ అన్న డాక్టర్ శ్రవణ్..
తెలంగాణాలో ప్రజాకూటమి ఓటమి పాలయిందన్నమోడీ... రాష్ట్రంలో బిజెపీ మట్టి కొట్టుకు పోయిందన్న సోయి తెచ్చుకోవాలని హితవు.  
తెలంగాణాలో బిజెపి ఎమ్మెల్యే అభ్యర్ధులను మోసగించిన మోడీ, అమిత్ షాలు.. పులి తన పిల్లలను తానే తిన్న చందంగా ప్రవర్తించారని విమర్శ.
రాహుల్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ కి వస్తున్న ఆదరణ ను ఓర్చుకోలేకే మోడీ, కేసీఆర్ లు కుట్ర పూరిత రాజకీయాలకు తెరలేపారు.... దాసోజు శ్రవణ్





దేశవ్యాప్తంగా కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ పేరిట తిరుగుతున్నా తనకు తెలియదంటూ మోడీ ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వూలో చెప్పడం దేశ ప్రజలందరిని మోసగించడమేనని  ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటి అధికార ప్రతినిధి డాక్టర్ శ్రవణ్ దాసోజు అన్నారు. గురువారం మధ్యాహ్నం గాంధీ భవన్ లో  మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, మాజీ మంత్రి జీవన్ రెడ్డిలతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో  మోడీ, కేసీఆర్ లు లోపాయి కారి ఒప్పందాలతో దేశ ప్రజలందరిని మోసగిస్తున్నారని ఆరోపించారు. రోజు రోజుకు దేశ వ్యాప్తంగా  రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీకి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక  యూపీఏ అనుకూల పార్టీలను తమ వైపు కు తిప్పుకునేందుకు వారిలో అయోమయం సృష్టించేందుకు మోడీ, కేసీఆర్లు కుట్ర పూరిత రాజకీయాలకు పాల్పడుతున్నారన్నారు. తెలంగాణాలో ప్రజాకూటమి ఓటమి పాలయిందన్న మోడీ కి తన స్వంత పార్టీ  మట్టిగోట్టుకు పోయిందన్న సోయి లేక పోవడం దారుణమన్నారు. కేసీఆర్ తో కలిసి క్షుద్ర రాజకీయాలకు తెరలేపిన మోడీ తన స్వంత పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధులకు డిపాజిట్ లు రాకుండా కష్టపడ్డారని ఎద్దేవా చేశారు. మోడీ అమిత్ షాలు స్వంత పార్టీ ని ఓడించడాన్ని పులి తన పిల్లలను తానే తిన్నట్లు గా ఉందని అభివర్ణించారు.
కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు గురించి తెలియదంటున్న మోడీ..2019లోఅతి పెద్ద జోక్ గా అభివర్ణించిన డాక్టర్ శ్రవణ్..
2019 లో ప్రధాని మోడీ దేశానికి ఒక విజన్ చూపబోతున్నాడని పెద్దయెత్తున మీడియాలో ఊదరగొట్టి కొండంత రాగం తీసి పనికిమాలిన పాట పాడినట్లుగా మోడీ ఇంటర్వూలో పాత అంశాలనే ప్రస్తావించారని డాక్టర్ శ్రవణ్ ఎద్దేవా చేశారు. 90 నిమిషాల ఇంటర్వూలో ప్రజలను మభ్యపెట్టడం మినహా మరేమీ లేదన్నారు. తెలంగాణాకు సంబంధించిన అంశంలో  కేసీఆర్ ఏర్పాటు చేసిన కూటమి  తనకు తెలియదనడం 2019 లో అతి పెద్ద జోక్ గా డాక్టర్ శ్రవణ్ అభివర్ణించారు. దేశవ్యాప్తంగా ఒరిస్సా, పశ్చిమబెంగాల్ పర్యటించిన కేసీఆర్  కాంగ్రెస్, బీజెపీయేతర ఫ్రంట్ ఏర్పాటు చేస్తున్నామని  హడావుడి చేస్తూ..మోడీని సన్నాసి అని తిడుతూ తిరుగుతుంటే తనకు తెలియదని చెప్పడం ఎవరి చెవిలో పువ్వులు పెట్టడం కోసమని ప్రశ్నించారు.  మోడీ కేసీఆర్ లు ఇద్దరు కలిసి కుమ్ముక్కయి కాంగ్రెస్ పార్టీ కి దేశవ్యాప్తంగా వస్తున్న ఆదరణను తగ్గించేందుకు కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ అనుకూల పార్టీలను యూపిఏ నుంచి దూరం చేయడాని కోసం ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తనను తిడుతున్నా తెలియదనడం, తనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నా పట్టించుకోకపోడం నవ్విపోదురుకాక నాకేటి సిగ్గు అన్నట్టుందన్నారు. 
రాష్ట్రంలో ప్రజాకూటమి ఓటమి పాలయిందంటున్నమోడీ... బిజెపీ మట్టి కొట్టుకు పోయిందన్న విషయాన్ని గమనించుకోవాలని హితవు.
తెలంగాణాలో ప్రజాకూటమి ఓడిపోయిందని మోడీ మాట్లాడడం చూస్తుంటే జాలేస్తుందన్నారు డాక్టర్ శ్రవణ్ ఓ వైపు తన స్వంత పార్టీ  బిజెపి పుర్తిగా మట్టికొట్టుకు పోయినా  కనీసం సోయి లేకుండా వ్యవహరిస్తూ కాంగ్రెస్ పార్టీ జట్టుకట్టిన కూటమి ఓడిపోయిందని మాట్లాడడం సిగ్గుచేటు కాదా అని ప్రశ్నించారు.  చావు తప్పి కన్ను లొట్ట పోయినట్టుగా గోషామహాల్ లో  ఎమ్మైఎం తో  కుమ్ముక్కై పోరాడితే రాజాసింగ్ ఒక్కడే బయట పడ్డాడని ఉన్న ఆరు సీట్లు పోయి  పోటీ చేసిన 105  స్ధానాల్లో డిపాజిట్ గల్లంతయ్యిందని ఎద్దేవా చేశారు.   అది మరిచి పోయి ప్రజాకూటమి ఓటమి పాలయ్యిందని సంకలు గుద్దుకోవడం హాస్యాస్పదం కాదా అని ప్రశ్నించారు. 2014 లో కాంగ్రెస్ పార్టీకి 22 సీట్లు ఉండేవని 2018లో  కేవలం 3 సీట్లు మాత్రమే కోల్పోయామన్నారు.
తెలంగాణాలో బిజెపి ఎమ్మెల్యే అభ్యర్ధులను మోసగించిన మోడీ, అమిత్ షాలు.. పులి తన పిల్లలను తానే తిన్న చందంగా ప్రవర్తించారని ఎద్దేవా..
పులి తన  పిల్లలను తానే తిన్నట్లు తన స్వంత పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధులను బలి ఇచ్చిన దౌర్భాగ్యపు చరిత్ర మోడీ కే దక్కుతుందని ఎద్దేవా చేశారు  కాంగ్రెస్ పార్టీని ఇబ్బందులకు గురిచేసేందుకు కేసీఆర్ తో లోపాయి కారి ఒప్పందానికి తెగబడ్డారని ఆరోపించారు.  మోడీ క్షుద్ర రాజకీయాలకు బిజెపీ నేతలు కిషన్ రెడ్డి, లక్ష్మణ్  లాంటి వారికి కూడా  డిపాజిట్ లు రాకుండా అవమానించారన్నారు.  
రాఫెల్ కుంభకోణంలో దేశ ప్రయోజనాలను తాకట్టు పెట్టిన ప్రధాని నరేంద్రమోడీ, పార్లమెంటులో సమాధానం ఇవ్వకుండా తప్పించుకుంటున్నారని ఆరోపణ.
గోవా హెల్త్ మినిష్టర్ ఆడియో టేపుల్లో రాఫెల్ కుంభకోణం పై పార్లమెంట్ లో చర్చకు వస్తే తప్పించుకునేందుకు మోడీ  ప్రయత్నిస్తున్నారని డాక్టర్ శ్రవణ్ ఆరోపించారు. 40 వేల కోట్లు కుంభకోణం జరిగినా మోడీ తన తప్పేం లేదన్నట్లు వ్యవహరిస్తున్నారని, రూ.526 కోట్ల రూపాయలకు ఒక  విమానం కొనుగోలు చేయాల్సి ఉండగా రూ. 1650 కోట్ల తో ఒక్క విమానాన్ని ఏ ప్రాతిపదిక న కొనుగోలు చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. దేశ రక్షణకు సంబంధించిన అంశంలో ఎయిర్ ఫోర్సో అధారిటి ప్రోసీజర్స్ ఎందుకు పాటించలేదో స్పష్టం చేయాలన్నారు. ఏ రకమైన అనుభవం లేని అనిల్ అంబానీ కంపెనీకి ఎలా ఇంత పెద్ద కాంట్రాక్ట్ అప్పగించారన్నారు. ఒక చిన్న ఇల్లు కట్టాలంటే అనుభవం ఉన్న మేస్త్రీని మాట్లాడుకుంటామని, కాని ఏ అనుభవం లేని అనిల్ అంబాని కంపెనీకి వేల కోట్ల రూపాయల కాంట్రాక్ట్ ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. దేశరక్షణకు సంబంధించిన వేల కోట్ల రూపాయల  విలువైన ఎయిర్ క్రాఫ్ట్ లు  కొనుగోలు విషయంలోఅనిల్ అంబాని కి సంబందించిన  కంపెనీకి ఎలా కట్టబెట్టారని  పార్లమెంటులో రాహుల్ గాంధీ ప్రశ్నిస్తే సమాదానం చెప్పకుండా మోడి పారిపోయారన్నారు. అనుభవంలేని అంబాని కంపెనీకి యుద్దవిమానాలు తయారుచేసే కాంట్రాక్ట్ అప్పగించడం వల్ల దేశ భద్రత కు నష్టం వాటిల్లిందని, అలాగే వేలాది కోట్ల రూపాయల దేశ సంపద ను అడ్డగోలుగా దోచిపెట్టడం వల్ల జాతి సంపద కూడా ప్రమాదంలోకి నెట్టబడిందని డాక్టర్ శ్రవణ్ ఆందోళన వ్యక్తం చేశారు.
నరేంద్ర మోడీ  ప్రభుత్వం... "ఆమ్ ఆద్మీ ప్రభుత్వం కాదు...అంబాని,అదాని ప్రభుత్వం".. డాక్టర్ శ్రవణ దాసోజు.
రాఫెల్ కుంభకోణం అంశంలో పార్లమెంటులో చర్చ జరుగుతుంటే దానిపై స్పందించకుండా సభ్య సమాజం సిగ్గుపడే రీతిలో  ఉల్టాచోర్ కొత్వాల్ కో డాంటే అన్నట్లు గా  కాంగ్రెస్ నేతల మీద కేసులున్నాయని, బెయిల్ పై ఉన్నారని అసందర్భంగా  మోడీ మాట్లాడుతున్నారని డాక్టర్ శ్రవణ్ ఆరోపించారు. చేసిన తప్పును కప్పి పుచ్చుకుంటున్నారని ఇంత పెద్ద అభియోగం వస్తే ఎంక్వైరీ చేయకుండా.., జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏ ఏర్పాటు వ్యతిరేకించడాన్ని యావత్ భారత దేశం గమనిస్తోందన్నారు. నరేంద్ర మోడీ  ప్రభుత్వం ఆమ్ ఆద్మీ ప్రభుత్వం కాదని అంబాని,అదాని ప్రభుత్వమన్నారు.
రాఫెల్ కుంభకోణంలో వాస్తవాలను వెలికి తీసేందుకు జెపిసి వేయాల్సిందేనని డిమాండ్.
నరేంద్ర మోడీ కి ఏమాత్రం విలువలున్నా రాహుల్ గాంధీ కోరినట్లు జెపీసీ వేయాలని డిమాండ్ చేశారు. రాఫెల్ అంశంలో దొంగతనం బయట పడుతుందని  భయపడుతున్నారని ఆరోపించారు. ప్రజాస్వామిక విలువల పట్ల  ఏమాత్రం గౌరవమున్నా వెంటనే జెపీసీ ఏర్పాటు చేయాలన్నారు. జాతీయ భద్రత అంశాలు మాట్లాడుతున్నారని కాంగ్రెస్ పై ఆరోపణలు చేస్తున్న మోడీ దేశ భద్రతకు సంబంధించిన రాఫెల్ డీల్ లు ఏమాత్రం అనుభవం లేని అనిల్ అంబానికి ఎలా ఇచ్చారన్నారు.  పార్లమెంట్ లో రాఫెల్ అంశంపై పెద్ద యెత్తున దుమారం రేగుతున్నా మోడీ పట్టించుకోకుండా ఎక్కడో పంజాబ్ లో ఉన్న లవ్లీ యూనివర్శిటీలో తన ప్రసంగాలను చేస్తున్నారని నరేంద్ర మోడీకి గుణపాఠం  చెప్పాలంటే ప్రజలు ఎక్కడికక్కడ ప్రశ్నించాలని పిలుపు నిచ్చారు. డాక్టర్ శ్రవణ్ తో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, మాజీ మంత్రి జీవన్ రెడ్డి లు సమావేశంలో పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా దాసోజు మాట్లాడుతూ తన పని తనాన్ని గుర్తించి ఏఐసీసీ లో అవకాశం కల్పించిందుకు ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ గారికి,ఏఐసీసీ మీడియా కమిటీ చైర్మన్ రణదీప్ సింగ్ సుర్జీవాల గారికిటీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికిఇంచార్జ్ ఆర్సీ కుంతియా గారికి ,మాజీ కేంద్ర మంత్రి జైరాం రమేష్ గారికినాయకులు కొప్పుల రాజు గారికిఆయన కృతజ్ఞతలు తెలిపారు. అలాగే మీడియా మిత్రులకు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది.