Hyderabad, October 30: Telangana Pradesh Congress Committee (TPCC) Chief Spokesperson Dr. Dasoju Sravan has strongly condemned the statement of Chief Electoral Officer Rajath Kumar that the services of policemen from Andhra Pradesh would not be utilised for Telangana Assembly elections.
Sravan asked the CEO to clarify whether he was following the dictate of caretaker Chief Minister K. Chandrashekhar Rao or performing duties as per the Constitution. He reminded that as per the AP Reorganisation Act, Hyderabad is the joint capital of both the Telugu States for 10 years. Instead of implementing the Act, Rajath Kumar is singing the 'bhajans' of TRS which is not correct, he said.
The Congress leader alleged that the attitude of CEO was creating a regional divide among people to please TRS leaders.. If any individual police from Andhra are indulging in illegal things, the EC can make a complaint and seek an action, but it is improper to typecast entire Andhra Police as illegal and biased. He said by refusing to hire the services of AP Police for election duty, the CEO has insulted the entire police system while sending a wrong message that police personnel could be biased towards their region
Sravan said that there has been an increase in the popularity graph of Congress and TDP after both the parties decided to join hands in next elections. Worried over its falling popularity, TRS leaders are desperately trying to lure people hailing from Seemandhra region. At one side KCR is abusing Andhra People and trying to play divisive politics in the name of Telangana-Seemandhra. On the other side, KTR is touching the feet of Seemandhra people to get their votes.
The Congress leader said there has been a huge contradiction in the TRS stand on Seemandhra people in the recent. While KCR spew venom against Seemandhra people during his speech in the public meeting of Kongara Kalan, KTR gave an entirely different speech in his speech during the recently held 'Mana Andari Hyderabad' event. Similarly, he said KCR tried to incite regional feelings with his speech in Nizamabad. He said the contradictions in speeches and confusing stand clearly show that father-son (KCR-KTR) duo were highly disturbed. He said both KCR and KTR were trying to create an impression that Telangana was a separate country and people of Seemandhra need to take a license from Kalvakuntla to stay here.
Sravan said Hyderabad was a home to people with different origins. He said several descendants of British live in Tarnaka while Malakajgiri is the hub for Tamilians and Malayalis. Similarly, thousands of Rajasthani and Gujarati live in Begum Bazar while people having their origins in Yemen and Saudi Arabia live in Barkas. Is it not the responsibility of the government to ensure their security and welfare? he asked and said all citizens of India have a right to live anywhere in the country irrespective of their religion, region, caste or language.
ఆంధ్రా పోలీస్ వద్దు, వారంటే భయం, కానీ... ఆంధ్రా ఓటర్లు మాత్రం ముద్దు, ఈ ఎన్నికలు అయ్యేవరకు మాత్రమే.....ఈ తిరకాసేంటీ ? కేటీఆర్..నిలదీసిన కాంగ్రెస్ నాయకుడు దాసోజు శ్రవణ్. ఆంధ్రా పోలీస్ వద్దంటూ ఎన్నికల కమీషనర్ అనడం వారిని అవమానించడమే, వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమేనని ఆగ్రహం. టీఆర్ఎస్ నేతలు, ఎన్నికల అధికారులు కుమ్ముక్కై విభజన రాజకీయాలకు తెరలేపారని వ్యాఖ్య. తండ్రి జుట్టు పట్టుకుంటే.. ఓట్ల కోసం కొడుకు కాళ్లు పట్టుకుంటున్నాడని ఎద్దేవా. తెలంగాణా ఏమన్న ప్రత్యేక దేశమా, ఇక్కడ ఉండాలంటే కేటీర్ అండ ఎందుకని సూటి ప్రశ్న
ఎన్నికల విధుల్లో ఆంధ్రా పోలీస్ వద్దంటూ వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన ఎన్నికల కమీషనర్..
ఎన్నికల విధులకు ఆంధ్రాపోలీస్ ను అనుమతించడం లేదని తెలంగాణా ఎన్నికల కమీషనర్ రజత్ కుమార్ చెప్పడం రాజ్యాంగ విరుద్దమని శ్రవణ్ దాసోజుఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎన్నికల కమిషనర్ కెసిఆర్ ఆదేశాల్ని అమలు చేస్తుండా; లేక భారత రాజ్యాంగాన్ని అమలుచేస్తుండా .. సూటిగా ప్రశ్నించిన దాసోజు శ్రవణ్.
పదేళ్ల పాటు ఉమ్మడి రాష్ట్ర రాజధానిగా హైదరాబాద్ ఉందని విభజన చట్టం హామీ స్పష్టం చేస్తున్నాతుంగలో తొక్కి టీఆర్ఎస్ పార్టీకి భజన చేయడం సరికాదని టీపిసిసి కాంపైన్ కమిటి కన్వీనర్ శ్రవణ్ దాసోజు విమర్శించారు.
ఇవాళ మీడియాకు విడుదల చేసిన ఓ లేఖలో.. రాజ్యాంగాన్ని సంరక్షించాల్సిన ఎన్నికల కమీషనర్ గులాబీ పార్టీకి తొత్తుగా మారి ఆంధ్రా, తెలంగాణా అంటూ విభజన రాజకీయాలకు పాల్పడతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రా పోలీస్ పై టీఆర్ఎస్ ఫిర్యాదు చేస్తే అవకతవకలకు పాల్పడ్డ పోలీసులపై విచారణ చేపట్టి సస్పెండ్ చేయొచ్చని, కాని చేయకుండా మొత్తం పోలీస్ వ్వవస్ధనే కించపరిచే విధంగా ఎన్నికల విధులనుంచి తప్పించడం సరికాదన్నారు.
ప్రజల్లో టీడీపీ కాంగ్రెస్ ప్రజకూటమికి రోజురోజుకు వస్తున్న ఆదరణతో కంటిమీద కునుకు లేకుండా పిచ్చిపట్టినట్టు వ్యవహరిస్తున్న కేటీఆర్ సీమాంధ్ర ప్రజల ఓట్ల కోసం కాకాపట్టే ప్రయత్నం చేస్తున్నాడని ఓవైపు కేసీఆర్ ఆంధ్రా ,తెలంగాణా అంటు విభజన రాజకీయాలు మాట్లాడితే.. వారి ఓట్ల కోసం కొడుకు కాళ్లు పట్టుకుంటున్నాడని ఎద్దేవా చేశారు.
ఇటీవల హమారా హైదరాబాద్ కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్ తీరు, గతంలో మాట్లాడిన కేసీఆర్ తీరు గమనిస్తే నొసటితో వెక్కిరిస్తూ, నోటితో నవ్వుతున్నట్లుందని ఈ ఇద్దరివ్యవహరాన్ని ప్రజలంతా గమనిస్తున్నారని త్వరలోనే కర్రుగాల్చి వాత పెడుతారని హెచ్చరించారు.
ఎన్నికల కోసం విభజన రాజకీయాలకు తెరలేపారని ఆగ్రహం
ఎన్నికల్లోలబ్ది పొందేందుకు ఏది పడితే అది మాట్లాడడం కల్వకుంట్ల కుటుంబానికి అలవాటేనని, ముందస్తు ఎన్నికల నేపధ్యంలో కొంగర కలాన్ సభలో ఆంధ్రా రాక్షసులంటూ,అమరావతికి అమ్ముడు పోదామా అంటూ విషం చిమ్మిన విషయం అప్పుడే ప్రజలంతా ఎలా మరిచిపోతారని శ్రవణ్ అన్నారు.
మరో వైపు నిజామాబాద్ సభలో ఇక్కడ పుట్టినోళ్లంతా ఇక్కడోళ్లే, మిగితా వారంతా ఆంధ్రా వాళ్లని విభజన రాజకీయాలు చేసారని, అక్కడి వారు, ఇక్కడి వారు అంటూ విడదీసే అధికారం ఎక్కడిదని ప్రశ్నించారు.
తెలంగాణాలో నివసించే వారంతా ఇక్కడి వారేనని క్లెయిమ్ చేసుకోవాలని కేసీఆర్ అనడం చూస్తుంటే భారత రాజ్యాంగం కాకుండా కొత్తగా కల్వకుంట్లరాజ్యాంగం అమలులో ఉందా అని ప్రశ్నించారు.
తెలంగాణాలో నివసించాలంటే అదేదో ప్రత్యేక దేశమన్నట్లు, కల్వకుంట్ల వారి అనుమతి ఉంటేనే ఉండాలన్నట్లు వారిదయాదాక్షిణ్యాలతోనే ఉంటున్నట్లు వ్యవహరించడం సరికాదన్నారు.
తెలంగాణాలో ఆంధ్రాప్రాంతం వారిపట్ల ఏమన్నా వివక్షఉందా అని కేటీఆర్ ప్రశ్నిస్తున్నారని, మరో వైపు కేసీఆర్ ఇక్కడుండే ఆంధ్రావారంతా క్లెయిమ్ చేసుకోవాలంటున్నారని ఇది వివక్ష కాక మరేంటో స్పష్టం చేయాలన్నారు.
తార్నాక ప్రాంతంలో లిటిల్ ఇంగ్లండ్ లో ఉన్న ఆంగ్లేయుల వారసులు , మల్కాజ్ గిరి ప్రాంతంలో ఉన్నతమిళ ప్రజలు, మళయాళీలు, కన్నడిగులు, బేగంబజార్ లోరాజస్థానీలు, గుజరాతీలు ఇలా భిన్న రాష్ట్రాలనుంచి వచ్చిన వారున్నారున్నారని, అలాగే వందల ఏళ్ల క్రితం సౌదినుంచి వచ్చి బార్కస్ లో నివసిస్తున్న వారందరికి అండగా ఉండరా అని ప్రశ్నించారు.
మతానికి కులానికి ,ప్రాంతానికి, ఆస్తికి అంతస్తుకు అతీతంగా అండగా ఉండడం రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన ప్రభుత్వాల ప్రధాన కర్తవ్యమన్నారు.
ప్రత్యేకంగా ఆంధ్రా ప్రజలకు అండగా ఉంటామనడం వారిని పరోక్షంగా బెదిరించడమేనని, వారి ఓట్ల కోసం మరో చిల్లర రాజకీయం చేస్తున్నారని, ఓ పక్క తండ్రి తిడితే, మరో పక్క కొడుకు బతిమిలాడడాన్ని తెలంగాణ ఆంధ్ర ప్రజలు ఆలోచించాలని విజ్నప్తిచేశారు.
కాంపైన్ కమిటి కన్వీనర్ డాక్టర్ శ్రవణ్ దాసోజు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ వర్క్ షాప్
ముఖ్య అతిధిగా హాజరయిన ప్రచార కమిటీ ఛైర్మెన్ భట్టి విక్రమార్క, ప్రొఫెసర్ నాగేశ్వర్.
మీడియా కోఆర్డినేషన్ పాత్ర పై అధికార ప్రతినిధులతో తొమ్మిది గంటల పాటు సుధీర్ఘ చర్చ.
మాక్ డిస్కషన్ లో పాల్గొన్నసీనియర్ జర్నలిస్టులు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధులు.
టీపిసిసి కాంపైన్ కమిటీ కన్వీనర్ డాక్టర్ శ్రవణ్ దాసోజు ఆధ్వర్యంలో మీడియా కోఆర్డినేషన్ సమావేశం , లక్డికాపూల్ లోని హోటల్ అశోకాలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన టీపిసిసి ప్రచారకమిటి ఛైర్మెన్ భట్టి విక్రమార్క జ్యోతి ప్రజ్వలనం చేసి కార్యక్రమాన్నిప్రారంభించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ అధికార టిఆర్ఎస్ పార్టీ చేస్తున్న అరాచకాలను, నియంతృత్వ పోకడలను ప్రజలలో ఎండగట్టి రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్పార్టీని అధికారంలోకి తెచ్చి ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో అధికార ప్రతినిధులు కృషి చేయాలని వారి పాత్ర చాల కీలకమైనదన్నారు. అధికార ప్రతినిధులు ఎంత బాగా పనిచేస్తే పార్టీ అంత బలంగా ఉంటుందని, అధికార పక్షం చేసే అరాచకాలు, నియంతృత్వ ధోరణలను ఎప్పటికప్పడు ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తోడ్పడాలన్నారు. తద్వారా కాంగ్రెస్ పార్టీ పై సానుకూల స్పందన రావడంలో మీడియా ప్రతినిధులు క్రియాశీలక పాత్ర వహించాలన్నారు. సుమారు తొమ్మిది గంటల పాటు సుధీర్ఘంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో మూడు విభాగాలు గా విభజించి ఒక్కో విభాగంలో ప్రముఖలతో శిక్షణా కార్యక్రమాలు, మాక్ డిబేట్ లు నిర్వహించారు.
అధికార ప్రతినిధులు..నిత్య విద్యార్దులుగా ఉండాలన్న ప్రొఫెసర్ నాగేశ్వర్
టీపీసీసీ స్పోక్స్ పర్సన్ వర్క్ షాప్ లో ముఖ్యఅతిధి, మరియు వక్తగా హాజరయిన ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ పాత్రికేయులు ప్రొఫెసర్ నాగేశ్వర్ మాట్లాడుతూ పొలిటికల్ కమ్యూనికేషన్, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ అండ్ సోషల్ మీడియా..పాత్ర..పార్టీ ప్రాబల్యాన్ని పెంచడంలో స్పోక్స్ పర్సన్ ల యొక్క పాత్ర. వారికి ఉండాల్సిన నైపుణ్యాలు పై కూలంకషంగా వివరించారు. అధికార ప్రతినిధులు అన్నిఅంశాలలో సమగ్రంగా, లోతుగా అధ్యయనం చేసుకోవాలన్నారు.అధికార ప్రతినిధుల అభిప్రాయాలనే పార్టీ విధానాలుగా భావించాల్సి ఉంటుంది కాబట్టి మాట్లాడే ప్రతి విషయం చాల కీలకంగా వ్యవహరించాలని, ప్రతి అంశంపై సమగ్రంగా విశ్లేషించుకుని అభిప్రాయాలను ప్రకటించాలని కోరారు. అధికార ప్రతినిధులు వెలిబుచ్చే అంశాలు, ప్రసంగాలు, విశ్లేషణలు, ప్రజలను ఆలోలింపజేసే విధంగా ఉండాలని, వారి అభిప్రాయాలకు దగ్గర ఉండాలని, ప్రతి రోజు విద్యార్థిలా ప్రతి విషయం తెలుసుకునే ప్రయత్నం చేయాలన్నారు., మన భావాలను వ్యక్తీకరించే సమయంలో స్పష్టత ఉండాలని, ఒక్క అంశం పొరపాటు జరిగినా అది పార్టీకి భారీ నష్టాన్ని కలిగిస్తుందని ప్రొఫెసర్ నాగేశ్వర్ అన్నారు. ప్రజాప్రతినిధులు ఏ అంశాలను వెలికితీసి , ఏం మాట్లాడితే ప్రజలనుంచి మంచి స్పందన వస్తుందో అర్ధం చేసుకుని, ప్రజల నాడిని బట్టి నడుచుకోవాలని సూచించారు. రాజకీయ పార్టీల పట్ల ప్రజలు ఏరకంగా ఆలోచిస్తున్నారో అర్ధం చేసుకోవాలన్నారు. రాజకీయాల పట్ల ప్రజల ఆలోచనా విధానం ఎలా ఉంది, వారు రాజకీయ నాయకులు, పార్టీల పట్ల ఏరకంగా ఆలోచిస్తున్నారన్న అంశాన్ని పసిగట్టడంలో సమయానుకూలంగా తమ నైపుణ్యాన్ని ప్రదర్శించాలన్నారు. ప్రజల నాడిని తెలుసుకోవాలంటే, ప్రజల్లో ఉంటూ వారి స్థితిగతులను అర్ధం చేసుకోవాలని సూచించారు. కేవలం కార్యాయాలకు పరిమితం కాకూడదని ప్రజలలో ఉంటేనే వారి స్థితిగతులు అర్థం అవుతాయని వారు అధికార పార్టీ పట్ల, ప్రతిపక్ష పార్టీ ల పట్ల ఎలాంటి అభిప్రాయంతో ఉన్నారనే విషయం అర్థం అవుతుందని వివరించారు. ప్రజల మనోగతాలు తెలియకుండా రాజకీయాలు చేస్తే అవి విజయవంతం కాబోవని సూచించారు.
ప్రతిపక్ష పార్టీల మోసాలు....సమకాలీన రాజకీయాల్లో రాహుల్ గాంధీ పాత్ర
సమావేశాన్ని మూడు సెషన్ లుగా విభజించి చర్చించారు. ఇందులో మొదటి పానెల్ సభ్యులతో సుధీర్ఘమైన చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి 2014 లో రాష్ట్రం ఆవిర్భవించే వరకు దేశానికి చేసిన సేవలపై చర్చించారు. అలాగే కాంగ్రెస్ పార్టీ సాధించిన ఘన విజయాలు, దేశాభివృద్దికి తోడ్పడ్డ ఎన్నో దృష్టాంతాలను విపులంగా చర్చించారు. దేశంలో హరిత విప్లవం, బ్యాంకుల జాతీయ కరణ, ఆర్టిఐ చట్టం, స్కిల్ డెవలప్ మెంట్ ఆక్టివిటీలు, సమగ్ర రైతు చట్టం, ఉపాధి హామీ పథకం లాంటి ఎన్నో వినూత్న పథకాలతో పాటు దళిత, గిరిజనుల అభివృద్ది కోసం కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాలపై చర్చ జరిగింది. గత కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో చేసిన అంశాల వల్లే నిరుద్యోగం ఎలా నిర్మూలనజరిగిందన్న అంశంపై ప్రతినిధులు సుధీర్ఘంగా చర్చించారు. అలాగే రెండవ సెషన్ లో టీఆర్ఎస్, బీజెపీ, ఎంఐఎం పార్టీలు గడిచిన నాలుగేళ్లుగా ప్రజల కు చేస్తున్న మోసాలు, ప్రజాసమస్యలు పరిష్కరించడంలో ఎదురయిన వైఫల్యాల పై చర్చించారు. మూడవ సెషన్ లో సమకాలీన రాజకీయ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ లో రాహుల్ గాంధీ ఆవశ్యకత ఏంటన్నదానిపై చర్చించారు.
సీనియర్ పాత్రికేయుల తో మాక్ డిబేట్లు
ప్రముఖ పాత్రికేయలు జకీర్, యాంకరింగ్ చేయగా అధికార ప్రతినిధులతో మాక్ డిబేట్లను నిర్వహించారు. ఇందులో కాంగ్రెస్ బీజెపి టీఆర్ఎస్ టీడిపి, ఎంఐఎం తరుఫునముందస్తు ఎన్నికలు, సమకాలీన రాజకీయ పరిస్థితులు, స్థితిగతులు, టీఆర్ఎస్ వైఫల్యాలపై చర్చ.ఎన్నికల గెలుపు ఓటమిలు అవకాశాల పై ఇందిరాశోభన్, కురువ విజయ్ కుమార్, సుజాయత్ అలీ, పేక రమేశ్ లు పాల్గొని ఆయా పార్టీ లకు ప్రాతినిధ్యం వహిస్తున్నట్టు కండువాలు కప్పుకొని పాల్గొని చర్చ చేశారు. ఈ సందర్భంగా చర్చలో పాల్గొన్న వారికి ఫీడ్ బ్యాక్ ఫారం ప్రకారం మాట్లాడే అంశంపై ఎలాంటి స్ఫష్టత ఉండాలి, చర్చలో పాల్గొనే ప్రతినిధుల ప్రవర్తన ఎలా ఉండాలి, మాట్లాడే అంశం చర్చ పరిధి దాటి పోకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి, కాంగ్రెస్ పార్టీ అంశంలో ఏ రకంగా రాహుల్ గాంధీ దేశానికి సమర్ధవంతమైన నాయకత్వం తో కూడిన ప్రధాని కాగలుగుతడో వివరించడం, మెజారిటీ గా యువకులున్నదేశంలో రాహుల్ లాంటి యువనాయకత్వం అవసరం ఏమేరకుంది, ప్రజలు రాహుల్ ప్రధాని ఎందుకు కావాలనుకుంటున్నారన్న అంశాలపై, అదే విధంగా తెలంగాణాలో టీఆర్ఎస్ పార్టీ మోస పూరిత విధానాలు, నియంతృత్వ విధానాలపై సమగ్రమైన విశ్లేషణ ను ఎలా మాట్లాడాలన్న అంశం పై చర్చిచారు. అలాగే మరో సీనియర్ జర్నలిస్టు సతీష్ కమాల్ లు ఆధ్వర్యంలో జరిగిన మరో చర్చలో ముందస్తు ఎన్నికలు ముగిశాయి, ఎగ్జిట్ పోల్స్ వెలువడుతున్నాయి, మరో వైపు ఎన్నికల కౌంటింగ్ జరుగుతున్నది, గెలుపు దిశలో కాంగ్రెస్ పార్టీ ఉందన్న ఎగ్జిట్ పోల్ అంచనాలపై సలీం, రామ్మోహన్ రెడ్డి, శ్రీరంగం సత్యం, లోకేష్ యాదవ్ లు పాల్గొని ఆయా పార్టీల ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు చర్చించారు.
ఆరు అంశాలతో కూడిన ఫీడ్ బ్యాక్ ఫారమ్
అంశాలతో కూడిన పార్మాట్ ను శ్రవణ్ తీర్చిదిద్దారు. ఈ ఫార్మాట్ ప్రకారం ప్రతినిధులు మాట్లాడే భాష, సమయస్ఫూర్తిగా వ్యవహరించడం, ఒక విషయాన్ని నమ్మకంగా, ధృడంగా చెప్పగలగడం, డిబేట్ లో పాల్గొన్న వ్యక్తి తనకు కేటాయించిన స్ధానంలో కూర్చునే తీరు, అసహనం, సహనశీలత వెలువరించే తీరు తదితర అంశాలపై మార్కులు కేటాయించారు.
వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన శ్రవణ్ కు కితాబిచ్చిన ప్రముఖులు
తొలిసారిగా వినూత్న కార్యక్రమానికి డాక్టర్ శ్రవణ్ శ్రీకారం చుట్టారని కిసాన్ సెల్ ఛైర్మెన్ కోదండ రెడ్డి ప్రశంసించారు. అధికార ప్రతినిధుల ఒకరోజు వర్కషాప్ ఎంతో ఉపయోగకరమైందని, కౌలురైతుల అంశం, ఇరిగేషన్ ప్రాజెక్ట్ లు తదితర అంశాలపై డాక్టర్ శ్రవణ్ ఇచ్చిన ప్రజెంటేషన్లు, ఆయన చేసే మీడియా కోఆర్డినేషన్ లుఅధికార ప్రతినిధులకు మార్గదర్శకంగా తీసుకోవాలని ప్రతినిధులకు సూచించారు. అలాగే మారిన రాజకీయ పరిస్థితుల్లో, మీడియా రంగంలో వచ్చిన విప్లవాత్మకమైన మార్పుల వల్ల పార్టీ అధికార ప్రతినిధులు పార్టీ గెలుపుపై , తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని, వారి పనితీరు పై, వారి సమర్ధత పైనా ఆధారపడి ఉంటుందని కార్యాక్రమంలో పాల్గొన్న వక్తలు తమ అభిప్రాయాలను వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేఏంజేయబోతున్నదన్న విషయం పైమొట్ట మొదటి సారిగా ఉదయం 9.30నుంచి 6.30వరకు సుదీర్ఘంగా 9 గంటల పాటు ఈ సమావేశం జరిగింది. కాగా ముందస్తు ఎన్నికలు జరుగుతున్న కీలక దశలోఒక కీలకమైన కార్యక్రమం చేపట్టారని సమావేశంలో పాల్గొన్నవక్తలు కొనియాడారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి, రాబోయే ఎన్నికల్లో గెలుపు కు ఈ సమావేశం దోహద పడుతుందని సంతోషం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో భట్టి విక్రమార్క, ఎమ్మెల్సీ నాగేశ్వర్, కిసాన్ సెల్ ఛైర్మెన్ కోదండరెడ్డి, ఏఐ సిసి కార్యదర్శి, కర్ణాటక ఇంఛార్జి మధుయాష్కి గౌడ్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి, ప్రముఖ జర్నలిస్టు శ్రీనివాస్ రావు, సాంబశివరావు, ఏఐసిసి ప్రతినిధులు మెహరోజ్, తన్నీరు నరేందర్ రావు, ఇతర టీపీసీసీ ప్రతినిధులు పాల్గొన్నారు.
కేంద్ర ఎన్నికల కమీషన్ కు గులాబీ రంగు సోకిందా..శ్రవణ్ దాసోజు సూటి ప్రశ్న.
గులాబీ పార్టీకి ఎన్నికల కమీషన్ గులాములుగా మారిందని ఎద్దేవా.
గులాబీ రంగులో బ్యాలెట్ పేపర్ల కొనుగోలుకు జీవో ఎట్లా జారీ చేస్తారని నిలదీత
ఫోన్ ట్యాపింగ్ జరిగినా పట్టించుకోవడం లేదని ఆరోపణ
తెలంగాణాలో ఎన్నికలు ప్రజాస్వామ్య యుతంగా జరిగే పరిస్థితి లేదని ఆవేదన
పోలీసు అధికారులు మీడియా సంస్ధలను బెదిరించడం రాజ్యంగ ఉల్లంఘన.
తెలంగాణా పత్తి పంటలపై సోకిన పింక్ (గులాబీ రంగు) ఇప్పుడు ఎన్నికల కమీషన్ కు సోకినట్లుందని ఆపద్దర్మ టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని ఉల్లంఘనలకు పాల్పడినా గులాబీ పురుగు సోకి ఆ మత్తులో ఉండి పట్టించుకోవడంలేదని టీపిసిసి కాంపైన్ కమిటీ కన్వీనర్, ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ శ్రవణ్ దాసోజు అన్నారు. ఇవాళ సాయంత్రం గాంధీ భవన్, మీడియా సమావేశంలో పాల్గొన్నశ్రవణ్ ఎన్నికల కమీషన్ టీఆర్ఎస్ ప్రభుత్వానికి తాబేదార్లుగా మారడం సరికాదన్నారు. తెలంగాణా లో ఎన్నికలు రాజ్యాంగ బద్దంగా, చట్టబద్దంగా, న్యాయపరంగా జరిగే పరిస్ధితి కనిపించడం లేదని, ప్రశాంతంగా జరగాల్సిన ఎన్నికల వాతావరణాన్ని విధ్వంసకరంగా మారుస్తున్న ఆపద్దర్మ ప్రభుత్వానికి ఎన్నికల కమీషన్ వత్తాసు పలుకడం, రాజ్యాంగాన్ని కాపాడాల్సిన ఎన్నికల కమీషన్ నిర్లజ్జగా వ్యవహరించడం దురదృష్టకరమన్నారు.
గులాబీ రంగులో బ్యాలెట్ పేపర్లు
ఆపద్దర్మ ప్రభుత్వం ఉల్లంఘనలకు పాల్పడినప్పుడల్లా కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేయాల్సి రావడం సిగ్గుచేటని, తెలంగాణాలో ఎన్నికలు పారదర్శకంగా జరగవనడానికి తేది 26.10.2018 రోజున గులాబీ రంగులో 90 లక్షల ఈ వీ ఎం బ్యాలెట్ పేపర్లను 75 పీఎస్ ఎం ప్రకారం, కొనుగోలు చేయాలని డిప్యూటీ చీఫ్ ఎన్నికల అధికారి, డిప్యూటి సెక్రటరీకి జారీ చేసిన జీవో నెంబర్ 1605 ఉత్వర్వే సాక్ష్యమన్నారు. ఓవైపు ఆపద్దర్మ ప్రభుత్వం అనువైన ప్రతి చోట ఎన్నికల నిబంధనలను అతిక్రమిస్తుందని నెత్తి మీద నోరు పెట్టుకుని మొత్తుకుంటుంటే ప్రభుత్వ వాహనాల్లో, కార్యాలయాల్లో, రింగుటోన్లలో పథకాల ప్రచారం చేస్తూ ప్రజలను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తుంటే పట్టించుకోకుండా ఇలాంటి జీవో లు జారీచేస్తుంటే ప్రజాస్వామ్యం ఎలా మనుగడ సాగిస్తుందని ఎన్నికల కమీషన్ ను సూటిగా ప్రశ్నించారు.
గులాబీ పార్టీకి గులాములుగా ఎన్నికల కమీషన్
ఎన్నికల కమీషన్ గులాబీ రంగు గులాములుగా మారిందేమోనన్న అనుమానం వ్యక్తం చేశారు. స్వతంత్రంగా వ్యవహరించాల్సిన కమీషన్ రాజ్యంగానికి, చట్టానికి లోబడి ఎన్నికలు నిర్వహిస్తారా లేక టీఆర్ ఎస్ పార్టీకి అనుకూలంగా పనిచేస్తారో తేల్చుకోవాలని హితవు పలికారు.
తప్పులు చేయడం సరిదిద్దుకోవడం ఎన్నికల కమీషన్ కు అలవాటుగా మారింది.
పింక్ రంగు పోలింగ్ కేంద్రాలను వ్యతిరేకిస్తే వాటిని తొలగించిన ఎన్నికల కమీషన్ వేరే రంగు లో పెడుతామన్నారని, ఇలా ప్రతిసారి తప్పులు చేస్తూ వాటిని ఎత్తిచూపితేనే స్పందిస్తామని చెప్పడం, తప్పులు జరిగిన ప్రతిసారి సరిదిద్దుకోమని చెప్పాల్సిరావడం దున్నపోతుకు ముల్లకర్రతో పొడిచినట్లేనన్నారు. ప్రతిసారి మేం అభ్యంతరం చెబితేనే స్పందిస్తారా అంటూ ఆగ్రహాం వ్యక్తం చేశారు.
టీఆర్ ఎస్ పార్టీకి ప్రచారం చేయాలని ఎద్దేవా
ఎన్నికల కమీషన్ స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్ధని రాజ్యాంగ బద్దంగా, పారదర్శకంగా, పారదర్శకంగా వ్యవహరించి మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకునే అవకాశం ప్రజలకు కల్పించాలన్నారు. ప్రపంచంలో వేరే రంగే లేనట్టు, ఎన్నికల బూత్ లకు , బ్యాలెట్ పేపర్లకు పింక్ రంగు వాడేదుంటే ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు. నేరుగా ప్రజల వద్దకే వెళ్లి టీఆర్ఎస్ తరుఫున ప్రచారం చేయాలని,కారుగుర్తుకే ఓటేయ్యాలని చెప్పాలని ఎద్దేవా చేశారు.
ఫోన్ ట్యాపింగ్ జరిగినా పట్టించుకోవడం లేదని ఆరోపణ
ప్రతిపక్ష పార్టీల నేతల ఫోన్ లు ట్యాపింగ్ జరగుతున్నా పట్టించుకునే నాధుడే లేడన్నారు. పోలీస్ ఇంటలిజెన్స్, నేరస్తులు, దొంగల ఆచూకీ పై ఇంటలిజెన్స్ చేయకుండా, ప్రతిపక్ష పార్టీల నేతల కదలికలపై ఇంటలిజెన్స్ చేస్తున్నారన్నారు. ప్రతిపక్ష నేతలు ఏం మాట్లాడుకుంటున్నరు, ఎక్కడ తింటున్నరు, ఎక్కడ పడుకుంటున్నరు. ఎప్పుడు లేస్తున్నరనే విషయంపై నివేదికలు తయారు చేసి ఆపద్దర్మ ముఖ్యమంత్రికి అందజేస్తున్నరని ఆరోపించారు. ఇంటలిజెన్స్ వ్యవస్ధ ప్రతిపక్షపార్టీ ల పై నిఘా పెట్టాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ నేతల వాహనాలను ఆపుతూ తనిఖీల పేరిట వేధిస్తున్నారన్నారు. మరో వైపు పాత కేసులు తిరగదోడుతున్నారన్నారు. ఎన్నికల వేళ ఆపద్దర్మ ప్రభుత్వం ఇన్ని అకృత్యాలకు పాల్పడుతున్నా ఎన్నికల కమీషన్ కళ్లుమూసుకోవడం, కస్టోడియన్ ఆఫ్ ఇండియన్ పాలసీకి ప్రతీక ఉండాల్సిన కమీషన్ ఇలా ప్రవర్తించడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల ఉల్లంఘనలు జరిగుతున్నాయని లేఖ ఇస్తేనే స్పందించడం సరికాదని ప్రభుత్వం వెలువరిస్తున్న జీవోలను సైతం పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు.
పోలీసు అధికారులు మీడియా సంస్ధలను బెదిరించడం రాజ్యంగ ఉల్లంఘన.
ఒక ప్రైవేట్ టీవీ ఛానెల్ తమ రహస్య పరిశోధనలో చంచల్ గూడ జైల్లో టేకు కర్రలను పాట్నాకు తరలిస్తున్నారని కథనం ప్రసారం చేయడంతో సదరు టీవీ ఛానెల్ యాజమాన్యాన్ని కమర్షియల్ సెక్స్ వర్కర్ అంటూ బెదిరింపులకు పాల్పడుతూ జైళ్ల శాఖ డీజీ వినయ్ కుమార్ సింగ్ లేఖ రాయడాన్ని డాక్టర్ శ్రవణ్ తప్పుపట్టారు. యధారాజ తధాప్రజ అన్నట్లు కేసీఆర్ వరంగల్ సభలో మీడియాను పదికిలోమీటర్ల లోతున పాతరేస్తానని బెదిరిస్తే తన అకృత్యాలను వెలికి తీసారన్న అక్కసుతో జైళ్ల శాఖ డిజి బెదిరింపులకు పాల్పడడం సిగ్గుచేటన్నారు. మీడియా తప్పు చేస్తే ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కు ఫిర్యాదు చేయాలని లేదంటే ఇండియన్ జర్నలిస్టు యూనియన్ కు, లైసెన్స్ రద్దు చేయమని బ్రాడ్ కాస్టింగ్ డిపార్ట్ మెంటు కు ఫిర్యాదు చేయోచ్చని అలా కాదని బెదిరింపులకు దిగడం సరికాదని ఇది రాజ్యాంగ ఉల్లంఘన అవుతుందని హితవు పలికారు. తెలంగాణా రాష్ట్రంలో పత్రికా స్వాతంత్ర్యం లేదనడానికి ఇంతకంటే ఉదాహరణ ఏముంటుందన్నారు.
పత్రికాస్వాతంత్ర్యం హరించడం ప్రజాస్వామ్యానికి ప్రమాదం
మీడియా తప్పుచేస్తే కేసులు నమోదు చేయాలని, ప్రెస్ కౌన్సిల్ ఇండియ. ఇండియన్ జర్నలిస్టుయనియన్ బ్రాడ్ కాస్టింగ్ డిపార్ట్ మెంట్ కు ఫిర్యాదు చేయాలని కమీషన్ కు ఫిర్యాదు చేయాలని సూచించారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి పరిస్థితులు ప్రమాదకరమని, డిజీపి మహేందర్ రెడ్డి వెంటనే సదరు అధికారిపై చర్యలు తీసుకోవాలన్నారు. జైళ్ల శాఖ డీజి వెంటనే బేషరతుగా మీడియా సంస్ధలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. శ్రవణ్ దాసోజు వెంట కాంగ్రెస్ పార్టీ నేతలు పోరెడ్డి స్రవంత్ రెడ్డి, దరువు ఎల్లన్న, ఇందిరా శోభన్ తదితర నేతలు పాల్గొన్నారు.
Hyderabad, October 24: Telangana Pradesh Congress
Committee (TPCC) Chief Spokesperson Dr. Dasoju Sravan has alleged that the
Election Commission of India was not taking any action over the violation of
Model Code of Conduct by the State Government and police officials in favour of
ruling TRS.
Addressing a press conference at Gandhi Bhavan on Wednesday,
Sravan welcomed the decision of ECI to withdraw the proposal for setting up of
pink polling booths for women. He said the ECI has reacted positively to the
representation made by the Congress party and shelved the plans to establish
'pink' polling booths as it did during Karnataka Assembly elections. However,
he said that the election authorities were not taking a note of MCC violations
by the officials.
Sravan alleged that the officials of State Government were
using the ring tones highlighting various government schemes in their mobile
phones. He said that the EC should direct the officials to change the ring
tones that might influence the voters. Further, he strongly objected to the
presence of pictures of caretaker Chief Minister K. Chandrashkehar Rao and
other ministers in government offices.
The Congress leader alleged that the caretaker CM, ministers
and other TRS leaders were misusing the official vehicles in violation of MCC.
Despite imposition of Model Code of Conduct, ministers have been moving in
large convoys and misusing other official machinery. He said the police
protocol should be withdrawn for caretaker ministers and former MLAs till
elections are over.
Sravan also alleged that the police machinery, especially in
rural areas, was being used by TRS to threaten Congress workers. He said
Congress workers were being threatened of implication in false cases and forced
to join the TRS. He said that the Election Commission should take note of such
violations and complaints and take immediate action to ensure free and fair
polling in Telangana.
The Congress leader has accused the TRS of creating a divide
among people by inciting regional feelings in the name of Telangana and Andhra.
(eom)
*పింక్ బూత్ ల ఏర్పాటును
ఎన్నికల కమీషన్ నిలిపివేయడాన్ని స్వాగతిస్తున్నాం శ్రవణ్ దాసోజు.
*ఆపద్దర్మ ముఖ్యమంత్రి, మంత్రులు ఎమ్మెల్యేలు కోడ్ ను
ఉల్లంఘిస్తున్నా కమీషన్ పట్టించుకోవడం లేదని ఆరోపణ
*అధికారుల ఫోన్లలో ప్రభుత్వ పథకాలకు చెందిన రింగ్ టోన్ లు
మార్చాలని డిమాండ్
*టీఆర్ఎస్ పార్టీలో చేరాలని కాంగ్రెస్ కార్యకర్తలను
వేధింపులకు గురిచేస్తున్న పోలీసుల పై చర్య తీసుకోవాలని కమీషన్ ను కోరిన శ్రవణ్
కర్ణాటక లో ఏర్పాటు చేసిన మాదిరిగానే తెలంగాణాలో పింక్ బూత్ ల ఏర్పాటు
వల్ల టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా మారుతుందని, గులాబీ రంగుతో బూత్ లను ఏర్పాటు
చేయడం రాజ్యాంగ విరుద్దమని మంగళ వారం రోజున
(నిన్న) కేంద్ర ఎన్నికల సంఘానికి తాను రాసిన లేఖ పై కమీషన్ స్పందన ఆహ్వానించదగ్గ
పరిణామమని, పింక్ బూత్ ల ఏర్పాటు అంశాన్ని ఎన్నికల కమీషన్ వెనక్కి తీసుకోవడాన్ని
కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తుందని, బుధవారం సాయంత్రం గాంధీ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా
సమావేశంలో టీపిసిసి ఎన్నికల కాంపైన్ కమిటీ కన్వీనర్, ముఖ్య అధికార ప్రతినిధి
డాక్టర్ శ్రవణ్ దాసోజు అన్నారు. ప్రజాస్వామ్యయుతంగా, రాజ్యాంగ విలువలు పెంపొందించేలా
ఎన్నికలు నిర్వహించేలా కమీషన్ వ్యవహరించాలని ఆయన కోరారు.
ఎన్నికల కోడ్ ను ఉల్లంఘిస్తున్న ఆపద్దర్మ ప్రభుత్వం
మరోవైపు రాష్ట్రంలో ఉన్న ఆపద్దర్మ ప్రభుత్వం ఎన్నికల నియమావళిని అడుగడుగునా
ఉల్లంఘిస్తున్నా ఎన్నికల కమీషన్ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఆపద్దర్మ
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుతో సహా ఆపద్దర్మ మంత్రులు, ఎమ్మెల్యేలు
యధేశ్చగా ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని
పలుమార్లు ఎన్నికల కమీషన్ దృష్టికి తెచ్చినా పట్టించుకోవడం లేదన్నారు.
అధికారుల ఫోన్లలో ప్రభుత్వ పథకాల రింగ్ టోన్లు మార్చాలి
కోడ్ అమలు లో ఉన్నప్పుడు ప్రభుత్వ కార్యాలయాల్లో ఆపద్దర్మ
ముఖ్యమంత్రి, మంత్రులతో కూడిన ఫోటోలను ప్రదర్శించడం, ప్రభుత్వ పథకాల సందేశాలతో కూడిన టోన్ లు అధికారుల
ఫోన్ లలో మోగడం సైతం వెంటనే నిలిపివేయాలని
శ్రవణ్ డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ కార్యకర్తలపై పోలీసుల వేధింపులు ఆపాలి
ఆపద్దర్మముఖ్యమంత్రి. మంత్రులు, ఎమ్మెల్యేలు ,ప్రభుత్వ వాహనాలు,
పోలీస్ యంత్రాంగాన్ని ఇష్టారాజ్యంగా వాడుకుంటున్నారని ఇది ఎన్నికల నియమావళికి విరుద్దమని
శ్రవణ్ ఆక్షేపించారు. మరో వైపు పోలీసులు గ్రామీణ
ప్రాంతాల్లో టీఆర్ ఎస్ కు అనుకూలంగా వ్యవహరించాలని, పార్టీలో చేరాలని కాంగ్రెస్
పార్టీ కార్యకర్తలపై బెదిరింపులకు
పాల్పడుతూ, కేసుల పెడుతామని వేధింపులకు గురిచేస్తున్నారన్నారు. ఇలాంటి చర్యల వల్ల
ప్రజలు భయ భ్రాంతులకు గురయ్యే అవకాశం ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామాల్లో
తాజా మాజీ ఎమ్మెల్యేలు, నాయకులు తెలంగాణా,ఆంధ్రా బేధ భావాలు సృష్టిస్తున్నారన్నారు.
వీటన్నిటిని దృష్టిలో ఉంచుకుని ఎన్నికల
కమీషన్ తక్షణమే ప్రభుత్వ వాహనాలను, పోలీస్ ప్రోటోకాల్ ను తొలగించాలని నియమావళిని
ఉల్లంఘిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగేందుకు
సహకరించాలని కోరారు. శ్రవణ్ దాసోజు తో పాటు మీడియా సెల్ కన్వీనర్, టీపిసిసి
ఉపాధ్యక్షులు డాక్టర్ మల్లు రవి పాల్గొన్నారు.
ఇట్లు
డాక్టర్ శ్రవణ్ దాసోజు,
కాంపైన్
కమిటీ కన్వీనర్, ముఖ్య అధికార ప్రతినిధి, టీపీసీసీ.
పేద వర్గాల ఆశాజ్యోతి వైయస్ ను
తిట్టడం తగదన్న శ్రవణ్ దాసోజు
తిట్ల పురాణం వల్లించి బూతు
ముఖ్యమంత్రిగా రికార్డు స్వంతం చేసుకున్నాడని ఎద్దేవా...
కాంగ్రెస్ పార్టీ బంగారు
పళ్లెంలో పెట్టితెలంగాణా ఇస్తే కుక్కులు చింపిన విస్తరిగా మార్చేసిన ఘనుడు కేసీఆర్
అని విమర్శ
ఆంధ్రా తెలంగాణా సెంటిమెంట్
రగిల్చి ఓట్లుదండుకోవాలని చూస్తున్నాడని ఆరోపణ
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆంద్రా
ముద్దు ..ముందస్తు ఎన్నికల్లో ఎందుకు వద్దంటూ సూటి ప్రశ్న
అపరిచితుడు, గజిని లా వ్యవహరిస్తున్నకేసీఆర్,
చిల్లర రాజకీయాలు మానుకోవాలని హితవు
టీఆర్ ఎస్ పార్టీకి కర్రుగాల్చి
వాతపెట్టాలని ప్రజలకు పిలుపు
ఆపద్దర్మ ముఖ్యమంత్రి కే
చంద్రశేఖర్ రావు తన పాలనా కాలంలో చేపట్టిన అంశాలేం లేక పోవడంతో ముందస్తు
ఎన్నికల ప్రచారం లో ప్రజల మెప్పు పొందేందుకు తిట్ల పురాణం మొదలుపెట్టాడని టీపిసిసి
కాంపైన్ కమిటీ కన్వీనర్, ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్
శ్రవణ్ దాసోజు విమర్శించారు.ఉద్యమసమయంలో ప్రజలను ఉద్యమోన్ముఖులను చేయడానికి కఠిన
మైన భాష వాడి కొట్లాడి, తెలంగాణా సాధించుకున్నామని, నాలుగేళ్ల తర్వాత కూడా అదే రకమైన భాషను వాడడం సరికాదన్నారు. మిగులు
బడ్జెట్ తో బంగారు పళ్లెంలోపెట్టి తెలంగాణాను అప్పగిస్తే
అభివృద్ది చేయకుండా, కుక్కలు చింపిన విస్తరిలా మార్చి
ముందస్తు ఎన్నికలు కు పోయిండని, ఇదేంటని ప్రశ్నించిన
ప్రతిపక్షాలపై బూతులతో విరుచుక పడుతున్నాడన్నారు. ముఖ్యమంత్రి ఏదో
తెలియని మానసిక వైకల్యంతో ఉన్నాడేమోనన్న అనుమానాన్ని ఆయన వ్యక్తంచేశారు.
తిట్ల పురాణం వల్లించి బూతు
ముఖ్యమంత్రి రికార్డు స్వంతం చేసుకున్నడని ఎద్దేవా...
కొంగరకలాన్ సభలో కేసీఆర్ కటౌట్
కిందపడ్డప్పటినుంచి డిప్రషన్ లోకెళ్లిన కేసీఆర్ రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్
పార్టీ అధోగతి పాలుకానుందన్న సంకేతం వచ్చినట్టుందని అందుకే వశపోక మసిపూసుకున్నచందంగా
వ్యవహరిస్తున్నాడన్నారు. రోజురోజుకు బలోపేతమవుతున్న మహాకూటమి ధాటికి తన పార్టీ
కూకటి వేళ్లతో కూలిపోక తప్పదన్న భయంతో నోటికొచ్చింది మాట్లాడుతున్నాడన్నారు. దేశ
చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ఈ స్థాయిలోబూతులు మాట్లాడిన ముఖ్యమంత్రి లేడని, కేసీఆర్ బూతు
ముఖ్యమంత్రిగా రికార్డు స్వంతం చేసుకున్నారని ఎద్దేవా చేశారు.
దివంగత నేతలను తిట్టడం సరికాదని
హితవు
తెలంగాణా ఇచ్చిన సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు బతికున్నోళ్లందరిని తిట్టడం అయిపోయిందని,
ఇక దివంగత నేతలపైబూతుల తో విరుచుకు
పడుతున్నాడన్నారు. నవభారత నిర్మాత, భారతరత్న, జన్మదినోత్సవం సందర్భంగా బాలల దినోత్సవం జరుపుకుంటూ చాచా నెహ్రూగా ఆప్యాయంగా పిలుచుకునే జవహర్ లాల్ నెహ్రూ ను తూలనాడి
సమాజానికేం సందేశం ఇస్తున్నారో చెప్పాలని అలాగే, గరీభీ హటావో
నినాదం ఇచ్చి"అన్నమో రామచంద్రా"అంటూ ఆకలితో అలమటించిన పేదలందరికి స్వాంతన కలిగించి
దేశ పటిష్టతకు కృషి చేసిన శ్రీమతి ఇందిరాగాంధీని తిట్టడం చూస్తుంటేకేసీఆర్ మానసిక స్థితి బాగాలేదోమో నని అనుమానం వస్తుందని శ్రవణ్ అనుమానం
వ్యక్తం చేశారు.
సెంటిమెంటు రగిలించి
లబ్దిపొందేందుకు కుట్ర
తెలంగాణా ను బలవంతంగా ఆంధ్రాలో
కలిపిన్రని భారతదేశానికి దిశానిర్ధేశ్యం చేసి ప్రపంచ దేశాల్లో స్థిరమైన స్ధానం
కల్పించిన భారతరత్న నెహ్రూ ను తిట్టడం సరికాదన్నారు. డబుల్ బెడ్రూం ఇళ్లిస్తానని, కేజీ టూ పీజీ అమలు చేస్తానని, దళితులకు
మూడెకరాల భూమి ఇస్తానని, ఇవ్వలేకతన అసమర్ధత, అవినీతితో పాలన కొనసాగించి మళ్లీ
తగుదునమ్మా అంటూ ఎన్నికల కోసం తెలంగాణా, ఆంధ్రా బేధ భావాలను
సృష్టించి సెంటిమెంటును రగిలించి లబ్ది పొందాలని చూస్తుండన్నారు. రజాకార్ల
దాష్టీకాలకు అధోగతి పాలయిన తెలంగాణాను భారతదేశంలో భాగస్వామ్యం కల్పిస్తూ, తప్పనిసరి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ లో కలిపారన్నారు. పరిస్థితులకు అనుగుణ్యంగా
రెండు ప్రాంతాలను కలిపామని ఇరుప్రాంతాల అభిప్రాయాలు కలవక పోతే ఎప్పుడైనా
విడిపోవడానికి వెసులుబాటు కల్పించిన కారణంగా నే నేడు తెలంగాణా వచ్చిందన్న కనీస
ఇంగితం ఆపద్దర్మ ముఖ్యమంత్రికి లేకపోవడం దారుణమన్నారు. దేశం కోసం 16
సంవత్సరాలపాటుజైలు శిక్ష అనుభవించిన భారత రత్నను తూలనాడడం కేసీఆర్ అహంకారానికి
కండకావరానికి నిదర్శనమన్నారు.
బంగారు పళ్లెంలో తెలంగాణా ఇస్తే
కుక్కలు చింపిన విస్తరిచేస్తారా..
బంగారు పళ్లెంలో తెలంగాణా
రాష్ట్రం ఇస్తే కుక్కలు చింపిన విస్తరాకులా, గాదెకిందపందికొక్కులా
రాష్ట్రాన్ని దోచుకుతిని, అధోగతి పాలు చేశారని శ్రవణ్ తీవ్రం
గా విమర్శించారు. 60 నెలలు పాలించమని అధికారం కట్టబెడితే నలభైనెలలు కూడా
పరిపాలించడం చేతకాక మధ్యలోనే కాడి వదిలేసిన దద్దమ్మ కేసీఆరేనన్నారు. ముందస్తు
ఎన్నికలకు వెళ్లి ప్రజలనోళ్లలో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న విద్యార్ధులనోళ్లలో
మన్నుగొట్టారన్నారు.
అపరిచితుడు కేసీఆర్రామూలా. వెంటనే రెమోలా మారుతడిని దాసోజు ఎద్దేవా
సినిమాలోపాత్రకు ఉన్న
రోగమేదో కేసీఆర్ కు ఉన్నట్లుందని ఎద్దేవా చేశారు. రెండు నాల్కల విధానంతో
ప్రజలను మభ్యపెట్టి ఓట్లు దండుకోవాలని చూస్తుండని, ఇలాంటి
ఊసరవెల్లిని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. గజనీ సినిమాలో సూర్య కారెక్టర్
లాచెప్పిన విషయాలను మరిచిపోయి, ఎప్పుడేం
మాట్లాడుతుండో తెలియకుండా మాట్లాడుతున్నడని ఎద్దేవాచేసిన శ్రవణ్రెండు బెడ్రూం ఇళ్లిస్తానని, ఇంటికో
ఉద్యోగం ఇస్తానని, ఆతర్వాత నేనెందుకన్నానంటున్నడని
విమర్శించారు.వాస్తుపేరిట బంగ్లాలు కూలుస్తానని చెప్పిన కేసీఆర్ నేనెప్పుడన్నానంటూ
మాటమార్చిండని , రాజకీయనాయకులంటేనే అబద్దాలు, బూతులు మాట్లాడుతారన్నట్టు, ఏహ్య భావం పుట్టేట్టుగా
దిగజారి వ్యవహరిస్తున్నడన్నాడన్నారు ఈసందర్భంగా కేసీఆర్ పలు దఫాల్లో
మాట్లాడిన వీడియోలను శ్రవణ్ ప్రదర్శించారు.
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆంద్రా
ముద్దు ముందస్తు ఎన్నికల్లో ఎందుకు వద్దంటూ సూటి ప్రశ్న
జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో ఆంధ్రా
ప్రాంతం వారు ఎందుకు ముద్దు.. ముందస్తు ఎన్నికల్లో ఎందుకు వద్దో స్పష్టం చేయాలని
శ్రవణ్ డిమాండ్ చేశారు. ఉద్యమ సమయంలో ఆంధ్రా వారిని ఉద్దేశించి లంకలో
పుట్టినోళ్లంతా రాక్షసులేనన్న కేసీఆర్ జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో ఆంధ్రా వారంతా మావాళ్లేనని
వారి కాళ్లలో ముల్లుకుచ్చుకుంటే పంటితో తీస్తాననిమాట్లాడిన్రన్నారు.నాగార్జున లాంటి సినిమా హీరోలను వాడుకుని అందరిని
మభ్యపెట్టి ఓట్లు దండుకున్నారని ఆరోపించారు. ముందస్తు ఎన్నికలల్లో మాత్రంఇక్కడున్నోళ్లు, ఆంధ్రా లో ఉన్నోళ్లు
వేర్వేరంటూ మాట్లాడుతున్నారని తేడా చూపుతూ రెచ్చగొడుతున్నారన్నరు.
హైదరాబాద్ లో దేశంలోని
అన్నిప్రాంతాలకు చెందిన వారు ప్రశాంతంగా జీవిస్తున్నారని భిన్నత్వంలో ఏకత్వం
సాధించిన తెలంగాణాను ఓట్లకోసం పదేపదే ఇరు ప్రాంతాల మధ్య ఎవరికి లేని అభ్యంతరం
ఆంద్రా వారిపట్ల ఎందుకని ప్రశ్నించారు.
విజ్ డమ్ ఆఫ్ ఎకానమీ అంటూ
పొగడ్తలు .. చంద్రబాబు ఆంధ్రారాక్షసి అంటూ నేడు తిట్లు
విజ్ డమ్ ఆఫ్ ఎకానమీ కి
చంద్రబాబు కారణమన్న నోటితోనే చంద్రబాబుతో పోత్తా థూ అంటూ తూలనాడిండన్నారు.టీడిపి అంటేనే ఆంధ్రాపార్టీ అంటూ ఆంధ్రా తెలంగాణా బేధ
భావాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడని,
పేద వర్గాల ఆశాజ్యోతి
వైయస్సేనన్నశ్రవణ్ దాసోజు
రిక్షాతొక్కుకునే, చెప్పులు
కుట్టుకునే వారి పిల్లలు సైతం ఉన్నత విద్య అభ్యసించి ఉన్నత స్ధానానికి
ఎదిగేలా చేసినందుకుఫీజు రీయంబర్స్ మెంట్ పథకం
ప్రవేశపెట్టిన వైయస్ తిట్టడానికి నోరెలా వచ్చిందని శ్రవణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పార్టీ నేతలను తిడితే సహించేది లేదని ఖబర్ధార్ కేసీఆర్ అంటూ ఆగ్రహం
వ్యక్తం చేశారు. ఆరోగ్య శ్రీ పథకం ద్వారా పేదలందరికి కార్పోరేట్ వైద్యం
అందించి ప్రాణదానం చేసిన గోప్పనేత వైయస్సేనన్నారు. 108 104 ద్వారా గ్రామీణ
ప్రాంతాల ప్రజలకు వైద్యం ,అంబులెన్స్ అందుబాటులో ఉంచి
ప్రాణాలను కాపాడితే ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో వాటిని కనుమరుగు చేసాడన్నారు.
2004 లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 60 వేల కోట్ల రూపాయల బడ్జెట్ రూ.200
రూపాయల ఫించన్ ఇచ్చిన ఘనత వైయస్సార్ దేనని, ఆనాటి మార్కెట్
ధరల ప్రకారం బియ్యం ధర రూ. 10 ఉండగా నేడు అదే బియ్యం ధర 40 నుంచి 50 రూపాయలుందని
నాటి దరలతో పోల్చుకుంటే నేడు2లక్షల కోట్ల బడ్జెట్ లో కేసీఆర్ ఇస్తున్న
రూ.1000 రూపాయలు చాలా తక్కువన్నారు. నేటి ధరల ప్రకారం కాంగ్రెస్ పార్టీ రూ. 2000
పింఛన్ ఇస్తామంటే, అర్రాస్ పాట పాడుతున్నరని ఎద్దేవా
చేస్తున్న కేసీఆర్ వైఖరి ని ప్రజలు గమనించాలన్నారు.
వైయస్ ను ఎందుకు తిడుతున్నవో
చెప్పాలనిడిమాండ్
హైదరబాద్ లో ఇంటర్నేషనల్ ఎయిర్
పోర్ట్ కట్టినందుకు తిడుతున్నవా, లేక హైదరాబాద్
చుట్టూ రింగ్ రోడ్డు కట్టినందుకు తిడుతున్నవాఅని
ప్రశ్నించారు.వందలాది ఐటీ కంపెనీలు తెచ్చినందుకు
తిడుతున్నారా, లేక ఎంఎంటీఎస్, మెట్రో
రైల్ లాంటి బృహత్తర పథకాలను అమలు చేస్తున్నందుకు తిడున్నావా , లేక జలయజ్నం పేరిట భారీ, మధ్యతరగతి నీటిపారుదల
ప్రాజెక్ట్ లను నిర్మించి కోటి ఎకరాలకు నీరందిస్తున్నందుకు తిడుతున్నవా అంటూ
సూటిగా ప్రశ్నించారు. విద్యార్దుల భవిష్యత్త్ కోసం తెలంగాణా వ్యాప్తంగా పది
విశ్వవిద్యాలయాలను ఏర్పాటుచేశారని,, ఐఐటీ ట్రిపుల్ ఐటీ
తెచ్చారనిఆఖరుకు టీఆర్ఎస్ పార్టీ
కార్యాలయాన్ని నిర్మించుకునేందుకు స్థలం కేటాయించిన నేతను తూలనాడేముందు జాగ్రత్తగా
ఉండాలని, చరిత్రలో ఎందరో మట్టిలో కలిసిపోయారని మీరేం
ఎల్లకాలం ఉండేందుకు రాలేదని నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు.
ఉచిత విద్యుత్ ఇచ్చిన వ్యక్తిని
,లక్షల మంది గ్రాడ్యుయేట్ లు
తయారయ్యేందుకు దోహదపడ్డ వ్యక్తిని, తిట్టి పేద బడుగు బలహీన
వర్గాల ప్రజల మనసులను గాయపరచడం సరికాదని హితవు పలికారు. ప్రజలకోసం ఏంజేసినవో
చెప్పమంటే అది చెప్పకుండా తిట్లరాజకీయాలతోకాలం
వెళ్లదీస్తున్నడని చిల్లర రాజకీయాలకోసం తెలంగాణాను భ్రష్టుపట్టించొద్దని శ్రవణ్
హెచ్చరించారు.
తన గ్రాఫ్ పడిపోతుందన్న సమయంలో
బూతు పురాణం మొదలు పెట్టి, సభ్యసమాజం సిగ్గుపడేలా
వ్యవహరిస్తున్నాడన్నారు. జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీలు
తెలంగాణా పట్ల మోసపూరితంగా వ్యవహరిస్తే కాంగ్రెస్ పార్టీలో యూత్ కాంగ్రెస్ నేతగా,
జాతీయ నేతగా ఎందుకు చెలామణి అయ్యిన్రో చెప్పాలని డిమాండ్ చేశారు.
మానిన గాయాలను మళ్లీ రేపి ఆ మంటల్లో లబ్ది పొందాలని కేసీఆర్ చూస్తున్నాడని శ్రవణ్
ఆరోపించారు.ఎవరూ శాశ్వతంగా జీవించలేరని చిల్లర
రాజకీయాలకు పాల్పడవద్దని సూచించారు.
తెలంగాణా వ్యాప్తంగా 30 లక్షల
ఓట్లను తొలగించారని మర్రి శశిధర్ రెడ్డి కేసు వేస్తే కేవలం 14 లక్షల ఓట్లను
పునరుద్దరించిన ఎన్నికల కమీషన్ అదే సమయంలో దొంగఓట్లను గుర్తించడం లేదన్నారు
శ్రవణ్.. కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న కుమార్తెల పేరిట ఉన్న ఓట్ల జాబితాను
మీడియాకు ప్రదర్శించారు.రాష్ట్రంలో ఫేర్ అండ్
ఫ్రీ ఎన్నికలు జరిగేందుకుతగిన వాతావరణం ఎన్నికల
కమీషన్ కల్పించాలని శ్రవణ్ కోరారుమీడియా సమావేశంలో
శ్రవణ్ దాసోజు తో పాటు యువ నేతకాంగ్రెస్ పార్టీ
అధికార ప్రతినిధి మన్నెక్రిషాంక్ పాల్గొన్నారు.