Monday 8 April 2019

ప్రతి ఏటా పేదవారికి రూ.72 వేల రూపాయలు,ఐదేళ్లలో ఒక్కొక్కరి ఖాతాలో రూ. 3,60,000 లక్షల ఆర్థిక భరోసా ; ఏఐసీసీ అధికార ప్రతినిధి & ఖైరతాబాద్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే, డా.శ్రవణ్ దాసోజు


Ø ఏటా రెండు కోట్ల ఉద్యోగాల పేరిట మోడీ, ఇంటికో ఉద్యోగం పేరిట కేసీఆర్, ఇద్దరు కలసి మోసం చేసిండ్రు : ఏఐసీసీ అధికార ప్రతినిధి & ఖైరతాబాద్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే, డా.శ్రవణ్ దాసోజు
Ø కేంద్రంలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతే, ప్రతి ఏటా పేదవారికి రూ.72 వేల రూపాయలు. ఐదేళ్లలో ఒక్కొక్కరి ఖాతాలో రూ. 3,60,000 లక్షల ఆర్థిక భరోసా..
Ø ఉచిత వైద్యం ప్రతి ఒక్కరి హక్కు అనే చట్టం అమలు చేస్తాం : దాసోజు
Ø మహిళలకు 33 శాతం  రిజర్వేషన్ : శ్రవణ్  దాసోజు
Ø హైదరాబాద్ విశ్వనగరంపేరిట గుంతల నగరంగానే మిగిలించిండ్రు :శ్రవణ్ దాసోజు



ఖైరతాబాద్ 08 ఏప్రిల్,2019: కాంగ్రెస్ పార్టీ  సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్ధి శ్రీ అంజన్ కుమార్ యాదవ్ గారిని బలపరిచే ఎన్నికల ప్రచారంలో భాగంగాను ఏఐసీసీ అధికార ప్రతినిధి & ఖైరతాబాద్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే, డా.శ్రవణ్ దాసోజు గారు, ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఆదివారం రాత్రి, శ్రీరామ్ నగర్, బంజారాహిల్స్ డివిజన్ లో  మరియు  NBT నగర్ లో ఇంటింటి ప్రచారం మరియు పబ్లిక్ మీటింగ్ జరిగింది. ఈ సమావేశంలో దాసోజు శ్రవణ్ గారు మాట్లాడుతూ, కేంద్రంలో మోడీ, రాష్టంలో కేసీఆర్  ఇద్దరు కలసి గత ఐదు ఏళ్లుగా ప్రజలను మోసం చేయడం జరిగింది . ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఏర్పాటు చేస్తానని, ప్రతి పేదవాడి బ్యాంక్ అకౌంట్లో 15 లక్షల రూపాయలు వేస్తానని ప్రధానమంత్రి  మోడీ నమ్మబలికాడు, అలాగే రాష్టంలో కేసీఆర్ అధికారంలోకి వస్తే ప్రతి ఇంటికో ఉద్యోగం ఇస్తానని మీ బిడ్డలను, మేములను మోసం చేసిండ్రు, అలాగే పేద ప్రజలకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు , ద‌ళిత‌, గిరిజ‌న కుటుంబాల‌కు 3 ఎక‌రాల వ్య‌వ‌సాయ‌ భూమిని ఇస్తానని ఇవ్వలేదు, మైనార్టీలకు నాలుగు నెలల్లో 12 శాతం రిజర్వేషన్లు ఇస్తామని ఇవ్వకుండా మోసం చేసిండ్రు .  జీహెచ్ ఎం సీ ఎన్నికల్లో  100 రోజుల ప్రణాళిక తయారుచేసి ఎన్నికల ఫలితాల తరువాత ఏ ఒక్క హామీ కూడా అమలు చేయకుండా మోసం చేసిండ్రు. హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా మారుస్తామని చెప్పి ఈరోజు వరకు గుంతల నగరంగానే మిగిలించిండ్రు అని శ్రవణ్ దాసోజు గారు మాట్లాడారు .
అదేవిధంగాను కాంగ్రెస్ పార్టీ  సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్ధి శ్రీ అంజన్ కుమార్ యాదవ్ గారిని గెలిలించి, రాహుల్ గాంధీ గారిని ప్రధాన మంత్రి చేయండి. కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలో వస్తే పేద ప్రజల కోసం కనీస ఆదాయ పథకం ద్వారా దేశంలోని 20శాతం పేద ప్రజల బ్యాంక్ ఖాతాల్లో ఏటా రూ.72 వేల రూపాయలు జమ చేస్తాం. అలాగే వచ్చే  ఐదేళ్లలో ఒక్కొక్కరి ఖాతాలో రూ. 3,60,000 వేసి వారికి ఆర్థిక భరోసా కలిపించి , దేశం నుండి పేదరికాన్నీ పూర్తిగా పారదోలుతామని. అలాగే ప్రభుత్వ ఆస్పత్రుల్లో వసతులు మెరుగుపరిచి, నిరుపేదలకు సైతం కార్పొరేట్ స్థాయి వైద్యం మరియు మందులు ఉచితంగా అందిస్తామని శ్రవణ్ దాసోజు గారు మాట్లాడారు. కేవలం అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అవుతుంది అని దాసోజు ప్రజలతో మాట్లాడం జరిగింది . చివరాగా మాట్లాడుతూ ఈ ఎన్నికలు కేవలం రాహుల్ గాంధీ గారికి మరియు మోడీ గారి మధ్య మాత్రమే అని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఖైరతాబాద్ సీనియర్ నాయకులూ రహీం, ఫిరోజ్, ధనరాజ్, ప్రభాకర్ యూత్ కాంగ్రెస్ నాయకులూ, కార్యకర్తలు మరియు ప్రజలు పాల్గొనడం జరిగింది .  






No comments:

Post a Comment