Monday 8 April 2019

ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని హిమాయత్ నగర్ డివిజన్ లో పాదయాత్ర, ఇంటింటి ప్రచారంలో : డా.శ్రవణ్ దాసోజు


ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని హిమాయత్ నగర్ డివిజన్ లో  పాదయాత్ర, ఇంటింటి ప్రచారంలో ఏఐసీసీ అధికార ప్రతినిధి & ఖైరతాబాద్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే, డా.శ్రవణ్ దాసోజు గారు. 

ఖైరతాబాద్ 08 ఏప్రిల్,2019: కాంగ్రెస్ పార్టీ  సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్ధి శ్రీ అంజన్ కుమార్ యాదవ్ గారిని బలపరిచే ఎన్నికల ప్రచారంలో భాగంగాను ఏఐసీసీ అధికార ప్రతినిధి & ఖైరతాబాద్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే, డా.శ్రవణ్ దాసోజు గారు, ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని హిమాయత్ నగర్ డివిజన్ మరియు ఆయిల్ సీడ్ కాలనీ , హైదెరాగూడ, ముత్యాలాబాగ్, సిడిఆర్ గల్లీ ప్రాంతాలలో   సోమవారం రోజు పాదయాత్ర చేస్తూ ఇంటింటి ప్రచారంలో  పాల్గొనడం జరిగింది .

అలాగే స్థానిక సమస్యలు తెలుసుకుని, కేంద్రంలో  మోడీ,  రాష్టంలో  కేసిఆర్ చేసిన మోసాలను ప్రజలకు తెలుపుతూ, ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీ అంజన్ కుమార్ యాదవ్ గారిని గెలిపించి, రాహుల్ గాంధీ గారిని కేంద్రంలో ప్రధానమంత్రి చేయడం ద్వారా పేద ప్రజల కోసం కనీస ఆదాయ పథకం ద్వారా దేశంలోని 20శాతం పేద ప్రజల బ్యాంక్ ఖాతాల్లో ఏటా రూ.72 వేల రూపాయలు జమ చేస్తామని . అలాగే వచ్చే  ఐదేళ్లలో ఒక్కొక్కరి ఖాతాలో రూ. 3,60,000 వేసి వారికి ఆర్థిక భరోసా కలిపిస్తాం , దేశం నుండి పేదరికాన్నీ పూర్తిగా పారదోలుతామని. అలాగే ప్రభుత్వ ఆస్పత్రుల్లో వసతులు మెరుగుపరిచి, నిరుపేదలకు సైతం కార్పొరేట్ స్థాయి వైద్యం మరియు మందులు ఉచితంగా అందిస్తామని, శ్రవణ్ దాసోజు  పాదయాత్ర ఇంటింటి ప్రచారంలో ప్రజలతో మాట్లాడం జరిగింది . ఈ కార్యక్రమంలో హిమాయత్ నగర్ కాంగ్రెస్ పార్టీ ఇంద్ర రావు మరియు సీనియర్ నాయకులూ, ఇంద్ర రావు , ముకేశ్, ముజ్జు లాల, శ్రీనాథ్  తాహెర్ , హిమాయత్ నగర్ మైనారిటీ యూత్ ప్రెసిడెంట్ నిజాం, యూత్ లీడర్స్ అనీష్ , వంశీ  మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొనడం జరిగింది .   










   

No comments:

Post a Comment