Sunday 30 December 2018

Congress sees conspiracy by KCR in cut in BC quota

Congress sees conspiracy by KCR in cut in BC quota





Hyderabad, December 30: Telangana Pradesh Congress Committee (TPCC) Chief Spokesperson Dr. Dasoju Sravan has dismissed the version of Chief Minister K. Chandrashekhar Rao over reduction in quota for Backward Classes in Panchayat Raj elections.

Addressing a press conference at Gandhi Bhavan on Sunday, Sravan said that the Chief Minister not only defended cut in reservation percentage for BCs but also tried to divert people's attention to other topics by targetting opposition leaders in the most inappropriate language. "KCR must realise that he is not the Chief Minister only for TRS. He is the Chief Minister for 4 crore people of Telangana. Therefore, he must learn to speak in a decent and balanced manner. His cheap talk by calling Congress leaders 'bevaqoof' or 'idiots' does not suit the stature of a man who is sitting on the CM's chair. KCR has brought utter shame and disrespect only to his position, but to the entire State of Telangana," he said.

He said KCR was like his father and he won't mind if he uses harsh language against him. However, he said he would tolerate if KCR tries to divert the real issues.

Sravan said KCR's attack on Congress leaders and defence of cut in quota for BCs in Panchayat Raj polls was nothing but a major conspiracy to disempower the Backward Classes politically by reducing their representation in local bodies. He attributing motives he wants to prevent everyone from going to court to seek justice and by indulging in cheap talk, he wants to stop Congress leaders from taking up public issues. "Its war to get justice for BCs and we will not fall into the KCR's trap," he said.

He said KCR apparently expects everyone, including the opposition parties, to accept all his decisions without raising any questions. KCR could not suppress BCs with his arrogant talk and misrepresentation of facts, he said.

Sravan said KCR's accusation that Congress was trying to stop Panchayat Raj elections was only a figment of his imagination. He said Congress never approached the court to stop an election. However, it went to the court seeking adequate representation for the BCs in PR polls. Showing the open letters that he wrote to the Chief Minister on the issue, he said it was on 9th June, 2018, he had questioned only 33% reservation for BCs while they constitute 52% of total population as per the Intensive Household Survey held in August 2014. After getting no response to the first letter, he said he wrote another letter on 14th June to Commissioner and Principal Secretary of Panchayat Raj and also the Election Commission. They too did not respond on the issue. Finally, on 17-06-2018, Ravindranath of Yadadri Bhongiri District filed Writ Petition No. 20477 in the High Court.

Acting on the petition, the Congress leader said that High Court directed the State Government to conduct caste-wise enumeration of BCs in Telangana before holding the PR polls. He said Karnataka has already done categorisation of BCs and therefore, it can also be done in Telangana. However, he said TRS Government simply ignored the HC directives and did not act on its directions for the last six months.

Sravan pointed out that it were the TRS leaders who tried to stop the Panchayat Raj elections and not the Congress party. He said Nagarkurnool MPTC Gopal Reddy, who is a close associate of TRS MLA from Nagarkurnool Marri Janardhan Reddy, who filed a petition No. 21651/2018 in the court demanding that reservation in PR elections should not cross 50% ceiling. He said he would send a copy of the petition to the Chief Minister if he was not having that information. He said that the TRS Government did not even file the counter in this case as it wanted BC quota to be slashed. He said it was a matter of shame that the Chief Minister himself is indulging in falsehood and only to prevent political empowerment of BCs, KCR wants to hold elections without having categorisation and without giving them reservation in proportionate to their population.

The Congress leaders also ridiculed KCR's claims on measures taken by his government for BC welfare. He said that the TRS Government did not spend promised Rs. 25,000 Crore on BC welfare. Further, he said nothing was done to introduce a BC Sub-Plan. He said BCs were not given any importance and were suppressed everywhere. He pointed out despite having a population of 52% in the State, there were only 25 BC MLAs out of 119 members. He said now conspiracies were being hatched to crush them in the local bodies.   

ఒక్కరోజు నాకు అవకాశం ఇవ్వండి, బీసి కులాల గణన ఎలా సాధ్యం కాదో చేసి చూపిస్తాను..డాక్టర్ శ్రవణ్ దాసోజు

పంచాయితీరాజ్ ఎన్నికల్లో రిజర్వేషన్లు కల్పించకుండా బీసిల నోట్లో మన్ను కొట్టొద్దన్న డాక్టర్ శ్రవణ్ ..
ప్రభుత్వమే కుట్రతో సుప్రీంకోర్టు కు వెళ్లి బీసి రిజర్వేషన్లు తగ్గించిందని ఆరోపణ.
జనాభా దామాషా ప్రకారం వర్గీకరణ చేపట్టాలని కోరితే ఎన్నికలు అడ్డుకుంటున్నామని ముఖ్యమంత్రి అసత్య ఆరోపణలు చేయడం సరికాదన్న శ్రవణ్.
బీసీ లకు అన్యాయం చేస్తూ ఎన్నికలు నిర్వహించడం ఎవరి ప్రయోజనాలకోసమని సూటి ప్రశ్న.
బీసిలకు గొర్లు, బర్లు, మంగలికత్తులు,రాజకీయ పదవులు కాదు...రాజ్యాధికారం కావాలని డిమాండ్.
తనకు ఒక్కరోజు అధికారం ఇస్తే రిజర్వేషన్లు ఎలా అమలు చేయాలో చేసి చూపిస్తానన్న శ్రవణ్
అధికార పార్టీ బిసి నాయకులంతా ఇప్పటికైనా బీసిలకు న్యాయం చేయడానికి ముందుకు రావాలని పిలుపు.
ఆంధ్రా పత్రికలంటూ మీడియా పై ముఖ్యమంత్రి అక్కసు సరికాదని విమర్శ.






పంచాయితీరాజ్ ఎన్నికల్లో కుల గణన నిర్వహించి జనాభా దామాషా ప్రకారం బిసి రిజర్వేషన్లు కల్పించాలని కోరితే   ఎన్నికలు అడ్డుకుంటున్నామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మాట్లాడడం సరికాదని టిపిసిసి ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ శ్రవణ్ దాసోజు విమర్శించారు. ఇవాళ గాంధీ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన కాంగ్రెస్ పార్టీ నేతలను బేవఖూఫ్ లు, ఈడియట్లు అని తిట్టడం ఆయన విజ్నతకే వదిలేస్తున్నామన్నారు. తండ్రి లాంటి కేసీఆర్ తనను వాడూ... వీడంటూ మాట్లాడినా ఫర్వాలేదని...అదే సందర్బంలో బీసీలకు అన్యాయం చేస్తే మాత్రం సహించబోనన్నారు. ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలన్న సామెతను పక్కన బెట్టి  రెండో మారు ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ నాలుక మడత పెట్టి అహంకారంతో మాట్లాడుతున్న మాటలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.  కేసీఆర్ కేవలం టీఆర్ఎస్ పార్టీకే ముఖ్యమంత్రిలా భావిస్తున్నారని ఆయన యావత్ తెలంగాణాకు ముఖ్యమంత్రన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. ముఖ్యమంత్రి  మాట తీరు యావత్ తెలంగాణా సమాజం సిగ్గుపడేలా, తల దించుకునేలా ఉందన్నారు.
జనాభా దామాషా ప్రకారం బీసిల వర్గీకరణ చేపట్టాలని కోరితే పంచాయితీ ఎన్నికలు అడ్డుకుంటున్నామని ముఖ్యమంత్రి అసత్య ఆరోపణలు సరికాదన్న శ్రవణ్.
జనాబా దామాషా ప్రకారం బీసీ వర్గీకరణ చేపట్టి తద్వారా ఎన్నికలు నిర్వహించాలని కోరితే కాంగ్రెస్ పార్టీ కేసు వేసి ఎన్నికలు ఆపుచేసిందని ముఖ్యమంత్రి గారు అనడం ఒక పచ్చి అబద్దమని, అభూత కల్పనేనని డాక్టర్ శ్రవణ్  అన్నారు. ముఖ్యమంత్రికి సమాచారం లోపం ఉన్నట్లుందని , అధికారులు  తగిన సమాచారం ఇవ్వడం లేదోమోనని ఎద్దేవా చేశారు. లేదంటే ముఖ్యమంత్రి కావాలని ప్రతిపక్షాలపైన బురదజల్లేకార్యక్రమానికి పూనుకున్నారేమోనని బట్టకాల్చి మీదేసేందుకు ప్రయత్నిస్తున్నారేమోనని ఆరోపించారు.  
తప్పుల తడకగా తయారుచేసిన పంచాయితీ రాజ్ ఆక్ట్ ను ప్రశ్నిస్తూ లేఖరాస్తే సమాధానం రాలేదన్న శ్రవణ్
పంచాయితీ రాజ్ ఆక్ట్ లో రెండు రకాల కేసులున్నాయని కాని వాటిని పట్టించుకోకుండా ముఖ్యమంత్రి దబాయింపు రాజకీయాలకు పాల్పడుతున్నారన్నారు. జూన్, 2018 మొదటి వారంలో పంచాయితీరాజ్ ఆక్ట్ ను తెచ్చారన్నారు.  ఆయన ఆదరాబాదరాగా తెచ్చిన ఆక్ట్ లో తప్పులున్నాయన్నారు. ఒక హేతు బద్దత లేకుండా బిసి రిజర్వేషన్లును ఖరారు చేశారని  2014 లో చేసిన సమగ్ర సర్వే ప్రకారం 52 శాతం ఉన్న బీసీలకు 33 శాతం రిజర్వేషన్లు ఎలా ఖరారు చేస్తారో చెప్పాలన్నారు.  ఈ విషయాన్ని ప్రశ్నిస్తూ జూన్ 9, 2018లో ముఖ్యమంత్రికి లేఖ రాసినా సమాధానం రాలేదని అందుకు సంబంధించిన లేఖ ప్రతిని మీడియాకు శ్రవణ్ ప్రదర్శించారు. అలాగే  ఆర్టీ ఐ ప్రకారం 14.6.2018 నాడు మరో లేఖ ను 33 శాతం రిజర్వేషన్లు ఎలా ఖరారు చేశారని కమీషనర్ పంచాయితిరాజ్ , ప్రిన్సిపల్ సెక్రెటరీ పంచాయితీరాజ్, ఎన్నికల కమీషనర్ లకు రాసామని కాని ఎవరూ స్పందించలేదన్నారు.
ప్రభుత్వ స్పందన లేక పోవడం వల్లే కోర్టు తలుపు తట్టామన్న శ్రవణ్ దాసోజు
ఎన్నిమార్లు ప్రభుత్వానికి లేఖ రాసిన  ప్రయోజనం లేక పోవడం వల్లే తేది 17.06.2018 నాడు రిట్ పిటిషన్ నెంబర్ 20477 ద్వారా  తాను, యాదాద్రి బోనగిరి జిల్లాలకు చెందిన  రవీంద్రానధ్ లు హైకోర్టులో పిటిషన్ వేసామన్నారు.
తాము వేసిన కేసులో ఎక్కడా ఎన్నికలు ఆపాలని కోరలేదని కేవలం కులగణన చేపట్టి తద్వారా జనాభా దామాషా ప్రకారం బిసిలకు ఎబీసిడి ఈ వర్గీకరణ చేపట్టి రిజర్వేషన్లు కేటాయించాలని కోరామని స్సష్టం చేశారు. కోర్టుకు చేసిన వినతిలో 52 శాతం ఉన్న బిసిలకు 33 శాతం ఏ ప్రాతిపదిక న అమలచేస్తారని అదే విధంగా విద్యా ఉపాధి రంగాల్లో అమలవుతున్నట్లు ఎబీసిడిఈ వర్గీకరణ చేయాలని మాత్రమే కోరామని డాక్టర్ శ్రవణ్ స్పష్టం చేశారు.
నిమ్మక జయరాం వర్సెస్ ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ తీర్పును పాటించాలన్న ధర్మాసనం.. హైకోర్టు తీర్పును ఉల్లంఘించిన టీఆర్ఎస్ ప్రభుత్వం.
తాము వేసిన పిటిషన్ ఆధారంగా విచారించిన  హైకోర్ట్ ధర్మాసనం బిసి రిజర్వేషన్ల అంశంలో  జస్టిస్  ఎంఎస్ రామచంద్రారావుగారు  నిమ్మక జయరాం వర్సెస్ స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంద్ఱప్రదేశ్ సందర్భంలో ఇచ్చిన తీర్పును అమలు చేయాలని తీర్పు ఇచ్చారని గుర్తుచేశారు.తేది 27.6.2018 నాడు ఇచ్చిన తీర్పు ప్రకారం  గతంలో ఇచ్చిన తీర్పును ఉదహరిస్తూ  కులగణన చేయాలని  అలాంటి సర్వేను ప్రజలముందుంచాలని తద్వారా వచ్చిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని ఆతర్వాతే  రిజర్వేషన్లను ఖరారు చేసి రాజ్యంగం ప్రకారం  అమలు చేయాలని ఆదేశించారన్నారు. కాని  ఆరునెలల క్రితం తీర్పు వస్తే ఇన్నాళ్లు ఆ తీర్పును అమలు చేయకుండా, బిసిల కుల గణన చేయకుండా  హైకోర్టు తీర్పు ఉల్లంఘించారని ఆరోపించారు.
బీసిలకు గొర్లు, బర్లు, మంగలికత్తులు,రాజకీయ పదవులు కాదు...రాజ్యాధికారం కావాలని డిమాండ్.
బిసిలకు కావాల్సింది గొర్లు బర్లు  కాదన్నారు డాక్టర్ శ్రవణ్.. రాజకీయపదవుల ఎరవేసి రాజ్యాధికారాన్ని దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారని బీసిలంతా రాజ్యాధికారం కోసం పోరాడుతున్నారన్నారు. రాజ్యాధికారం కల్పించాలని కోరితే దొంగ మాటలతో కాలక్షేపం చేస్తూ, నెపం కాంగ్రెస్ పార్టీ పై నెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కర్ణాటక రాష్ట్రంలో బీసిలను ఏ,బి  వర్గాలుగా విడగొట్టి రిజర్వేషన్లు అమలుచేస్తున్నారని అదేవిధానాన్ని ఇక్కడా అమలు చేయాలని డిమాండ్ చేశారు.
సుప్రీంకోర్టుకు వెళ్లి పంచాయితీ ఎన్నికలు ఆపాలని చూస్తోంది టీఆర్ఎస్ పార్టీయేనని ఆరోపణ
పంచాయితీరాజ్ ఎన్నికలు ఆపాలని కాంగ్రెస్ పార్టీ చూస్తోందని ఆరోపణ చేస్తున్న కేసీఆర్ అబద్దాలు ప్రచారం చేస్తున్నారని నిజానికి రిట్ పిటీషన్ నెంబర్  21651, 2018 ద్వారా  నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అనుచరుడు, నాగర్ కర్నూల్ ఎంపీటిసి  గోపాల్ రెడ్డి   తమిళ నాడు రాష్ట్రం మాదిరిగా 50 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని కేసు వేశారని దాన్ని విచారించిన న్యాయస్ధానం 50 శాతం దాటి రిజర్వేషన్లు ఇవ్వడం వీలు కాదని తీర్పు ఇచ్చిందని గుర్తిచేశారు. ముఖ్యమంత్రి కి సమాచారం లోపం ఉంటే దానికి సంబంధించిన కాపీని పంపిస్తామని డాక్టర్ శ్రవణ్ అన్నారు. గోపాల్ రెడ్డి వేసిన కేసులో మూడు మార్లు హియరింగ్ వచ్చినా రాష్ట్ర ప్రభుత్వం తరుఫున వాదించడానికి ప్రభుత్వ న్యాయవాది వెళ్లలేదన్నారు. తదనుగుణంగానే కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిందన్నారు.  ప్రభుత్వానికి కౌంటర్ దాఖలు చేసే తీరిక లేకుండా ఉండడం వల్లే బీసిలకు అన్యాయం జరిగిందని ఆరోపించారు. వాస్తవాలు వెల్లడి చేయకుండా తమిళ నాడు తరహాలో 69 శాతం రిజర్వేషన్ల అంశాన్ని ప్రస్తావించడం వల్లే 50 శాతం మించి రిజర్వేషన్లు ఇవ్వాలన్న కృష్ణమూర్తి కేసు అంశాలు సాధ్యం కాదని తేల్చిందని శ్రవణ్ వివరించారు. హైకోర్టులో వాస్తవాలు వెల్లడిచేసిఉంటే పరిస్థితి మరోలా ఉండేదన్నారు. హైకోర్టులో కొట్లాడే అవకాశం ఉన్నా సుప్రీం కోర్టుకు వెళ్లారని ఆరోపించారు. ఇవన్నీ మరుగున పెట్టి కాంగ్రెస్  వల్లే నష్టం జరుగుతున్నట్టు కేసీఆర్ వక్రీకరించడం సరికాదన్నారు. అసలు కోర్టులో కేసు వేసిన గోపాల్ రెడ్డి ఎవరి ప్రోత్భలంతో వేసారో కూపీ లాగాలని డిమాండ్ చేశారు. ఇవన్నీ పక్కన పెట్టేందుకు దొడ్డిదారిన ఆర్డినెన్స్ తెచ్చారని న్యాయపరంగా ఇది నిలవదని శ్రవణ్ అన్నారు. 112 కులాలతో ఉన్న బిసి ల్లో ఉప కులాల వారిగా రిజర్వేషన్ల ఖరారు చేసి ఎన్నికలు జరుపాలని కోరితే ఎన్నికలు ఆపేందుకు కుట్ర పన్నింది కేసీఆరేనని ఆరోపించారు. కులాల వారిగా గణన చేపడితే అట్టడుగున ఉన్న చాకలి, మంగలి, కంసాలి, వడ్రంగి, ముస్లీం లకు రాజకీయాధికారం వస్తుందన్నారు. 2009 లో జీహెచ్ ఎంసీలో మున్సిపాలిటీలో ఎ,బి,సి,డి వర్గీకరణ చేయాలని సత్యం రెడ్డి కేసు వేసిన విషయాన్ని డాక్టర్ శ్రవణ్ గుర్తుచేశారు. అప్పుడు అడిషనల్ అడ్వకేట్ జనరల్ తో అందరు ఏ ఉద్దేశ్యంతో కొట్లాడారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. అలాగే బిసిలకు లాభం కలిగేందుకు 2018లో కేసేస్తే తప్పెలా అవుతుందని ప్రశ్నించారు. బిసిల కు రాజ్యాధికారం వస్తే గతంలో 25 వేల కోట్లిస్తానని మోసగించిన విధానాన్ని ఎండగట్టే వారమని సబ్ ప్లాన్ వేస్తానని మోసగించిన విషయాన్ని ప్రశ్నించేవారమన్నారు.
రాజ్యాధికారంలో బిసి కులాలకు తగిన ప్రాధాన్యం లేదన్న శ్రవణ్
119 స్ధానాలున్న శాసనసభలో కేవలం 25 మంది మాత్రమే ప్రతినిధులున్నారని మొత్తం జనాభాలో 52 శాతం మంది ఉన్న తమ కు ఎందుకు తక్కువ స్ధాయిలో ప్రతినిధులుండాలన్నారు. రిజర్వేషన్లు సక్రమంగా అమలు చేస్తే  అన్నికులాలకు అవకాశాలు వచ్చేవన్నారు. లోకల్ బాడీల ఎన్నికల్లో అన్ని కులాలకు సమానావకాశాలు వస్తే రాజకీయంగా ఎదుగుదలకు అవకాశం ఉంటుందని అది కల్పించాల్సిన భాద్యత ప్రభుత్వాలదేనని హితవు పలికారు. చట్టాన్ని అమలు చేయమంటే  అడ్డుకుంటున్నారనడం భావ్యం కాదన్నారు.
రిజర్వేషన్లు తేల్చడం కష్టమేమీ కాదని తనకు అవకాశం ఇస్తే చేసి చూపిస్తానని సవాల్
2014లో సమగ్ర సర్వేలో 4 కోట్ల మంది వివరాలు సేకరించగలిగిన సత్తా, లక్షకోట్లతో కాళేశ్వరం కట్టగలిగిన సత్తా ఉన్న  ఉన్న ముఖ్యమంత్రి కి బిసిల కులగణన ఎందుకు సాద్యం కాదని ప్రశ్నించారు. బీసీల పట్ల ముఖ్యమంత్రి కి చిత్తశుద్దిలేదన్నారు. అంబేధ్కర్ రాజ్యాంగం ప్రకారం జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు అమలు చేయాలని కోరారు.బిసీ ల పట్ల ప్రేమ ఉన్నట్లు ముఖ్యమంత్రి నటిస్తున్నారని ఎంబీసి కార్పోరేషన్ ఏర్పాటు చేసిన ఆయన కార్యాలయంలో కనీసం కుర్చీలు బెంచీలు కూడా ఏర్పాటు చేయలేదన్నారు. అలాగే ఒక్క రూపాయి కేటాయించకుండా  అలంకార ప్రాయంగా కార్పోరేషన్ ఏర్పాటు తో లాభమేంటని ప్రశ్నించారు. బీసిలను మోసగిస్తున్న కేసీఆర్ తనకేమీ తెలియనట్లు నటిస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి బీసీ కులాలను మోసగిస్తున్నా టీఆర్ఎస్ పార్టీలో ఉన్న బీసి నాయకులు స్వలాభం కోసం యావత్ బీసి సమాజానికి ద్రోహం చేస్తున్నారని ఆరోపించారు. తనకు ఒక్కరోజు అవకాశం ఇస్తే బీసి కులాల గణన ఎలా చేయాలో చేసి చూపిస్తానని శ్రవణ్ సవాల్ విసిరారు.
ఆంధ్రా పత్రికలంటూ మీడియా పై ముఖ్యమంత్రి అక్కసు సరికాదని విమర్శ.
ఆంధ్రా వార్తలు రావోద్దంటున్న ముఖ్యమంత్రి ఇతర రాష్ట్రాల భాషల్లో అడ్వర్టయిజ్ మెంట్ లు ఎందుకు ఇచ్చినారో చెప్పాలన్నారు. వేల కోట్లు రూపాయల అడ్వర్టయిజ్ మెంటుల పేరిట ఎందుకు ఖర్చుచేశారో అవన్నీ తిరిగి కట్టాలని చెప్పారు. ఒరిస్సాలో పశ్చిమ బెంగాల్ల ఉత్తర్ ప్రదేశ్లో మీరు కలిసిన నాయకుల కు సంబంధించిన వార్తలు ఎందుకు రావాలన్నారు. ఆంధ్రా వారు వద్దుకాని ఆ పెట్టుబడి దారులు మాత్రమం కావాలా అని ప్రశ్నించారు. మీకు మద్దెల కొడితే మంచోళ్లు లేకుండే వారు అంతుచూస్తామనడం మంచిది కాదన్నారు. స్వచ్చమైన భయంలేని మీడియా ఉంటేనే ప్రజాస్వామ్యం మనుగడ సాగించగలదని ముఖ్యమంత్రికి హితవు పలికారు. డాక్టర్ శ్రవణ్ దాసోజు వెంటపిసిసి కార్యదర్శి  కేతూరు వెంకటేశ్  మీడియా సమావేశంలో పాల్గొన్నారు.

Press Meet Video Link : 

Tuesday 25 December 2018

ఫెడరల్ ఫ్రంట్ పేరిట కేసీఆర్ రాష్ట్రాలు తిరుగుతూ స్వరాష్ట్రాన్ని పట్టించుకోవడం లేదని ఆరోపించిన రాజ్యసభ ఎంపీ, ఏఐసిసి స్పోక్స్ పర్సన్ ఫ్రొఫెసర్ ఎం వీ రాజీవ్ గౌడ

ఫెడరల్ ఫ్రంట్ పేరిట కేసీఆర్ రాష్ట్రాలు తిరుగుతూ స్వరాష్ట్రాన్ని పట్టించుకోవడం లేదని ఆరోపించిన  రాజ్యసభ ఎంపీ, ఏఐసిసి స్పోక్స్ పర్సన్  ఫ్రొఫెసర్ ఎం వీ రాజీవ్ గౌడ  
బీజేపీ, కాంగ్రెసేతర ప్రభుత్వాల ఏర్పాటుకు శ్రీకారం చుడుతున్నామంటూనే.. మోడీని కలువడమేంటో గమనించాలని ప్రజలకు సూచన.
వ్యవస్ధలన్నింటిని భ్రష్టు పట్టించిన బిజెపి  అధికారంలోకి వస్తే అక్రమాలకు అడ్డుండదని వ్యాఖ్య.
కరెప్షన్ కింగ్ లను దాచిపెడుతూ ప్రజలను మోడీ ప్రభుత్వం మోసగిస్తుందని ఆరోపణ.
కాంగ్రెస్ హయాంలో బలోపేతంగా ఉన్న ఆర్ధిక వ్యవస్థను మోడీ చిన్నాభిన్నం చేశారన్న గౌడ.
న్యాయవ్యవస్ధ, డిఫెన్స్, ఇతర ఆర్ధిక సంస్ధల నిర్వీర్యానికి కుట్ర జరుగుతుందని ఆందోళన.
తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు చిత్తశుద్దితో వ్యవహరించిన  కాంగ్రెస్ పార్టీ.
క్రిస్మస్ పర్వదినం సందర్భంగా  ప్రజలందరికి శుభాకాంక్షలు తెలిపిన ప్రొఫెసర్ రాజీవ్ గౌ, డాక్టర్ శ్రవణ్ దాసోజు.



హైదరాబాద్ : కేంద్రంలో నరేంద్రమోడీ ప్రభుత్వంరాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం  ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తూ ప్రజలను మోసగిస్తున్నారని ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ రిసెర్చ్ డిపార్ట్ మెంట్  ఛైర్మెన్,   రాజ్యసభ ఎంపీ, ఏఐసిసి స్పోక్స్ పర్సన్  ఫ్రొఫెసర్ ఎం వీ రాజీవ్ గౌడ అన్నారు. ఇవాళ మధ్యాహ్నం గాంధీ భవన్ లో టిపిసిసి ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ శ్రవణ్ దాసోజు తో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన భారత్ దేశంలో బలమైన ఆర్ధిక వ్యవస్థ ను పునరుద్దరించాల్సిన అవసరముందన్నారు. గతంలో మన్మోహన్ సింగ్ హయాంలో బలోపేతంగా మారిన ఆర్దిక వ్యవస్ధను మోడీ, అమిత్ షాలు భ్రష్టు పట్టించారన్నారు.  మరికొద్ది నెలల్లో లోక్ సభ ఎన్నికల కు వెళ్ల బోతున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. సెక్యులర్ దేశంలో కొన్ని మతాల పట్ల బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల దేశంలో అనిశ్చితి, అసహనం నెలకొందన్నారు. కేవలం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే అన్ని మతాల పట్ల సమభావంతో కలిసి మెలిసి ఉండే అవకాశముందన్నారు.ఈ రోజు క్రిస్మస్ పర్వదినం జరుపుకుంటున్న వారందరికి శుభాకాంక్షలు తెలిపిన గౌడ.. భారతదేశ సెక్యులరిజానికి అన్ని మతాలను గౌరవించడమే నిదర్శనమన్నారు. దురదష్టవశాత్తూ అన్ని మతాలను అణిచివేసే కుట్ర జరుగుతుందన్నారు.
ఫెడరల్ ఫ్రంట్ పేరిట కేసీఆర్ రాష్ట్రాలు తిరుగుతూ స్వరాష్ట్రాన్ని పట్టించుకోవడం లేదని ఆరోపించిన  రాజ్యసభ ఎంపీ, ఏఐసిసి స్పోక్స్ పర్సన్  ఫ్రొఫెసర్ ఎం వీ రాజీవ్ గౌడ
తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ పేరిట రాష్ట్రాల్లో పర్యటిస్తూ తెలంగాణా ప్రజలను మోసగిస్తున్నారని రాజీవ్ గౌడ ఆరోపించారు. బీజేపీ, కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పాటు చేద్దామంటూ రాష్ట్రాల్లో పర్యటిస్తున్న కేసీఆర్ ప్రధాని మోడీని ఎందుకు కలిశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఓవైపు మోడీ తో దోస్తీ చేస్తూనే మరో వైపు బీజెపి పార్టీకి వ్యతిరేకిగా మాట్లాడుతూ ప్రజలను మోసగిస్తున్న వైనాన్ని గమనించాలని విజ్నప్తిచేశారు. దేశాన్ని,రాష్ట్రాన్ని రక్షించేది, ప్రజలకు అండగా నిలిచేది కాంగ్రెస్ పార్టీ ఒక్కటేనని రాజీవ్ గౌడ అన్నారు.
రాఫెల్ కుంభకోణం.. అనిల్ అంబానికి దోచిపెట్టేందుకేనన్న గౌడ.
దేశంలో అతిపెద్ద కుంభకోణానికి బిజెపి ప్రభుత్వం తెరలేపిందన్న రాజీవ్ గౌడ రాఫెల్ యుద్దవిమానాల దిగుమతి విషయంలో మూడింతల ధర చెల్లించడం అక్రమమన్నారు. రాఫెల్ ఒప్పందానికి పది రోజుల ముందే  ప్రారంభమయిన ఏమాత్రం అనుభవం లేని అనిల్ అంబాని కంపెనికి కట్టబెట్టి, అడ్డగోలుగా దోచిపెట్టేందుకు రాచబాట వేసిందని ఎద్దేవా చేశారు. డిఫెన్స్ మినిష్టర్ నిర్మలా సీతారామన్ రాఫెల్ యుద్దవిమానాల గురించి సమాధానం ఇవ్వకుండా దాటవేస్తున్నారన్నారు. కొందరికి లాభం చేకూర్చేందుకు గతంలో రాఫెల్ యుద్ద విమానాల తయారీ కి  సంబంధించిన టెక్నాలజీని స్వంతం చేసుకునే అవకాశాలను వదులుకున్నారని ఆరోపించారు. రాఫెల్ విషయంలో అబద్దాలతో సీల్డ్ రిపోర్ట్ ఇచ్చారని దాన్ని ఆధారంగా కోర్టులో తీర్పు వచ్చిందన్నారు. తీర్పు ను పరిశీలిస్తే మోడీ ప్రభుత్వం సమర్పించిన సీల్డ్ కవర్ రిపోర్ట్ అంతా తప్పుల తడకలా ఉందని మహాభారతంలో ధర్మరాజు వాడిన నీతి అశ్వద్దామ హతో హత: న నరోవ కుంజర “ అన్న నానుడిని ఉదహరించారు. అలాగే  మన్మోహన్ సర్కార్ ఎంతో శ్రమపడి అత్యుత్తమ ఆర్ధిక వ్యవస్థను నిర్మిస్తే. మోడీ ప్రభుత్వం నోట్ల రద్దు, జీఎస్టీ ద్వారా చిన్నాభిన్నం చేసిందని ఆరోపించారు.  ఆర్ధిక రంగ వ్యవస్థలైన ఆర్బీఐని ప్రభుత్వ అనవసర పెత్తనంతో భ్రష్టు పట్టించారన్నారు.  అలాగే న్యాయవ్యవస్ధలో జోక్యం చేసుకుంటున్నారని, ఎన్నికల సంఘంపై పెత్తనం చెలాయిస్తున్నారన్నారు. సిబిఐ ని దుర్వినియోగ పరుస్తున్న మోడీ ప్రభుత్వం  కంప్ట్రోటర్ అండ్ ఆడిటర్ జనరల్ నివేదిక లను కూడా తప్పుదోవ పట్టిస్తు ప్రజలను మోసగిస్తున్నారని ఆరోపించారు.  గతంలో మన్మోహన్ సర్కార్ తెచ్చిన పారదర్శక పాలనకు మోడీ ప్రభుత్వం చరమగీతం పాడిందని విమర్శించారు.
కరెప్షన్ కింగ్ లను దాచిపెడుతూ ప్రజలను మోడీ ప్రభుత్వం మోసగిస్తుందని వ్యాఖ్య.
మోడీ ప్రభుత్వం కరెప్షన్ కింగ్ లను కాపాడుతుందన్నారు. విజయ్ మాల్యా, నీరవ్ మోడీ, లలిత్ మోడీ లాంటి కరెప్షన్ కింగ్ లను దేశం దాటించారన్నారు. వారిని దేశం దాటించడం లో మోడీ ప్రభుత్వం చిత్తశుద్దితో వ్యవహరించిందన్నారు. నోట్ల రద్దు అంశంతో దేశ ప్రజల జీవనాన్ని అస్తవ్యస్తం చేసిన మోడీ ప్రజలకేం సమాధానం చెబుతారని నిలదీశారు.
అక్రమాలకు అకృత్యాలకు బిజెపి ప్రభుత్వం అడ్డాగా మారిందని వెల్లడి
ఆడపిల్లల పై అకృత్యాలు అత్యాచారాలు బీజెపి ప్రభుత్వంలో పెరిగిపోయాయని రాజీవ్ గౌడ ఆందోళన వ్యక్తం చేశారు. మైనార్టీలు శాంతియుతంగా జీవించే పరిస్థితులు లేవన్నారు. ఉత్తర్ ప్రదేశ్ లో జరిగిన అత్యాచారాలపై కేసుల నమోదయితే బాధితులపైనే చర్యలు తీసుకున్నారని ఆరోపించారు.
తెలంగాణా ఏర్పాటు కాంగ్రెస్ పార్టీ వల్లే సాధ్యమయింది...
తెలంగాణా ప్రజల ఆకాంక్షలను గుర్తించిన సోనియా గాంధీ చొరవ వల్లే తెలంగాణా రాష్ట్రం సాకారమయ్యిందన్నారు రాజీవ్ గౌడ.. ఇక్కడి ప్రజల ఆకాంక్షలను గుర్తించిన సోనియా గాంధీ రాజకీయంగా నష్టపోయినా ఫర్వాలేదని రాష్ట్రాన్ని సాకారం చేసారని కాని కేసీఆర్ తెలంగాణా ప్రాంత ప్రయోజనాలను భ్రష్టు పట్టిస్తున్నారన్నారు. తెలంగాణా ప్రాంత ప్రయోజనాలు నెరవేర్చకుండా ఫెడరల్ ఫ్రంట్ అంటూ దేశపర్యటనకు వెళ్ళిన కేసీఆర్ తీరు ను రాజీవ్ గౌడ తప్పుపట్టారు. దేశ ప్రయోజనాలు నెరవేర్చాలంటే ప్రాంతీయ పార్టీల వల్ల సాద్యం కాదన్నారు.

క్రిస్మస్ పర్వదినం సందర్భంగా  ప్రజలందరికి శుభాకాంక్షలు తెలిపిన ప్రొఫెసర్ రాజీవ్ గౌడ.డాక్టర్ శ్రవణ్ దాసోజు.




గాంధీ భవన్ లో ఏర్పాటు చేసిన క్రిస్మస్ వేడుకల్లో టిపిసిసి ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ శ్రవణ్ దాసోజు తో కలిపి  పాల్గొన్న రాజీవ్ గౌడ కేక్ ను కట్ చేసి ప్రజలందరికి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రొఫెసర్ గౌడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టిపిసిసి అధికార ప్రతినిధి మొగుళ్ల రాజిరెడ్డి, దేవరకద్ర కాంగ్రెస్ నాయకులు డోకూరి పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Video Link : 

Sunday 23 December 2018

ఈవిఎంల అక్రమాలకు పాల్పడి కేసీఆర్ ఎన్నికల్లో గెలుపొందారన్న గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు అంజన్ కుమార్ యాదవ్

ఈవిఎంల అక్రమాలకు పాల్పడి కేసీఆర్ ఎన్నికల్లో గెలుపొందారన్న  గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు అంజన్ కుమార్ యాదవ్
ఈవిఎంలో జరిగిన అక్రమాలపై న్యాయపోరాటం చేస్తున్నాం.. టిపిసిసి ముఖ్యఅధికార ప్రతినిది డాక్టర్ శ్రవణ్ దాసోజు...
ఫ్రొఫెషనల్ గా , రాజకీయంగా జన్మనిచ్చిన తల్లి ఖైరతాబాదేనన్న. దాసోజు
పదవులున్నా లేకున్నా సమస్యలపై మడమతిప్పని పోరాటం చేస్తానని వెల్లడి.
అధికార పక్షం పై ప్రశ్నాస్త్రాలు గా మారుదాం..సమస్య ల సాధన కోసం బాణాలు ఎక్కుపెడుదామని కార్యకర్తలకు పిలుపు.
ఓట్లేసి ఆదరించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపిన దాసోజు.... జీవితాంతం ప్రజల వెంటే ఉంటానని వెల్లడి...
అర్భన్ సోషల్ ఆడిట్ నిర్వహించి సమస్యల సాధనకు కృషి.
రాహుల్ ప్రధాని కావడం చారిత్రిక అవసరం..రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో  కష్టపడి పోరాడుదామని కార్యకర్తలకు దిశానిర్ధేశం చేసిన శ్రవణ్.
బూత్ లెవల్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న మాజీ ఎంపీ, గ్రేటర్ హైదరాబాద్ ఇంచార్జి అంజన్ కుమార్ యాదవ్.
క్రిస్మస్ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన శ్రవణ్, అంజన్ కుమార్ యాదవ్



ప్రొఫెషనల్ గా, రాజకీయ నాయకుడిగా ఆరంగేట్రం చేసిన తనకు ఖైరతాబాద్ నియోజకవర్గం  కన్నతల్లి లాంటిదని టిపిసిసి ముఖ్యఅధికార ప్రతినిధి, ఖైరతాబాద్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే డాక్టర్ శ్రవణ్ కుమార్ అన్నారు.  1990 నుంచి 1993 వరకు ఖైరతాబాద్ నడిబొడ్డున ఉన్న అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీలో ఇండియాలో  ప్రాజెక్ట్ ఎయిడ్ ఫ్యాకల్టీగా పనిచేశానని, మళ్లీ రాజకీయంగా తొలి అడుగుకూడా ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచే వేసానని గుర్తుచేసుకున్నారు.  ఆదివారం మధ్యాహ్నం  ఇందిరాభవన్ ఆడిటోరియంలో జరిగిన విస్తృత స్ధాయి నియోజకవర్గ కార్యకర్తలు బూత్ కమిటి సభ్యుల సమావేశంలో మాజీ ఎంపీ గ్రేటర్ హైదరాబాద్ ఇంచార్జి అంజన్ కుమార్ యాదవ్ తో కలిసి పాల్గొన్న ఆయన నియోజకవర్గంలో తనను అతి తక్కువ కాలంలో ఆదరించి అక్కున చేర్చుకున్న ప్రజలందరికి పేరు పేరునా ధన్యవాదాలు తెలియజేశారు.
పదవులున్నా లేకున్నా కార్యకర్తలకు అండగా నిలుస్తా.. సమస్యలపై మడమతిప్పని పోరాటం చేస్తా..
ప్రచారం లో ఉన్న సమయంలో ఓటింగ్ ముగిసిన తర్వాత ఎంతో మంది ఫోన్ లు చేశారని ఎమ్మెల్యే గా గెలవబోతున్నారని చెప్పారన్నారు. అలాగే ఇంటలిజెన్స్ అధికారులు కూడా  తన గెలుపు ఖాయమని చెప్పారని  కాని
ఏదో మాయ జరిగిందని ఫలితాలు తారుమారయ్యాయన్నారు. గెలుపు ఓటములు సహజమే అయినా నియోజకవర్గ ప్రజల సమస్యల సాధనలో మడమ తిప్పని పోరాటం చేస్తానని శ్రవణ్ అన్నారు. నియోజకవర్గంలో తన 20 రోజుల ప్రచారంలో రోడ్ల సమస్య, నాలాల సమస్య, డ్రైనేజీ సమస్య, మంచినీటి సమస్య, ఇండ్ల సమస్య,  ఇళ్ల పట్టాల సమస్య, భూముల రెగ్యులరైజేషన్ సమస్యలను గుర్తించానని వాటన్నింటిని పరిష్కరించేందుకు చిత్తశుద్దితో కృషి చేస్తానన్నారు.
అధికార పక్షానికి ప్రతిపక్షానికి తేడా ఉంటుందని  సమస్యల సాధనకోసం వత్తిడి తెచ్చే అవకాశం  ఉంటుందన్నారు.
మంచి నాయకులుగా ఎదగాలంటే ప్రతిపక్షంలోనే ఉండాలన్న శ్రవణ్
యువకులు మంచి నాయకులుగా ఎదుగాలంటే  అధికార పక్షంలో ఉంటే అసలు ఎదిగే అవకాశం రాదన్నారు శ్రవణ్ . నాయకత్వ లక్షణాలను పెంచుకోవాలంటే ప్రతిపక్షం పెద్ద వేదిక అవుతుందన్నారు.  ప్రజా సమస్యలపై గళమెత్తితే ప్రజలే నెత్తికెత్తుకొని ఆదరిస్తారనన్నారు.  అధికార పక్షంలో ఉంటే పోలీసులు గన్ మెన్ లు  తిట్టుకుంటు వెనుక తిరుగుతారని కబ్జాలు లకు పాల్పడ్డాడనని  కాని  ప్రతి పక్ష నాయకలు కొట్లాడితే గౌరవిస్తారన్నారు.  
అర్భన్ సోషల్ ఆడిట్ నిర్వహించి సమస్యల సాధనకు కృషి
ఖైరతాబాద్ నియోజకవర్గ సమస్యలను గుర్తించేందుకు అర్భన్ సోషల్ ఆడిట్ నిర్వహించబోతున్నట్లు శ్రవణ్ దాసోజు తెలిపారు. వార్డుల వారిగా,డివిజన్ వారిగా  సమస్యలను గుర్తించేందుకు  ఓ ప్రణాళిక సిద్దం చేస్తున్నామని కార్యకర్తలు అందరూ భాగస్వాములు కావాలని పిలుపు నిచ్చారు.
రాహుల్ ప్రధాని కావడం చారిత్రిక అవసరం..రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో  కష్టపడి పోరాడుదామని కార్యకర్తలకు దిశానిర్ధేశం చేసిన శ్రవణ్.
కొద్ది నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు  సమీపిస్తున్నాయని, రాహుల్ గాంధీ ప్రధాని కావాల్సిన చారిత్రిక అవసరముందని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. గడిచిన నాలుగున్నర సంవత్సరాలుగా మోడీ పాలనలో ఆయన అవలంబించిన విధానాల వల్ల దేశంలో కులాలు మతాల పేరిట కొనసాగిన విధ్వంసం ఇకముందు కొనసాగరాదన్నారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో పెద్దయెత్తున ఓటర్ నమోదు కార్యక్రమాన్ని చేయించేందుకు ప్రతి కార్యకర్తా నడుం కట్టాలని, మోడీ దుర్మార్గ పాలనకు చరమ గీతం పాడుదాం రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చేద్దామని పిలుపు నిచ్చారు.
ప్రభుత్వ పథకాలకు లబ్దిదారులను గుర్తించడం లో కార్యకర్తలు సహకరించాలి
నియోజకవర్గంలో ప్రభుత్వ పథకాలు పేదలకు సక్రమంగా అందించేందుకు రేషన్ కార్డులు, నిరుద్యోగుల కు రూ. 3వేల భృతి సక్రమంగా అందడంలో కార్యకర్తలు కృషి చేయాలని పిలుపు నిచ్చారు. డబుల్ బెడ్రూం ఇళ్ళకు ఎంతమంది అర్హులున్నరో వారందరి వివరాలు డివిజన్ వారిగా సేకరించాలన్నారు. ఇందుకోసం ఓ ప్రొఫార్మాను సిద్దం చేస్తున్నట్లు శ్రవణ్ ప్రకటించారు.
కేసుల గురించి ఎవరూ భయపడవద్దు..కార్యకర్తలకు దాసోజు పిలుపు
కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై కేసులు నమోదు చేస్తే ఎవరూ భయపడొద్దని న్యాయపరంగా పోరాటం చేద్దామని, కార్యకర్తల వెంటే ఉంటానన్నారు. కేసీఆర్ పార్టీని బలహీన పరిచే ప్రయత్నం చేస్తూ ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తున్నాడన్నారు. కాంగ్రెస్ పార్టీనుంచి ఎంతమంది పోయినా సుదీర్ఘ చరిత్రి కలిగిన కాంగ్రెస్ పార్టీ గంగ ప్రవాహం లాంటిదని మళ్లీ స్వచ్చంగా,నిరాటంకంగా ముందుకు సాగుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ కి బలం కార్యకర్తలేనన్నారు.

ఈవిఎంల అక్రమాలకు పాల్పడి కేసీఆర్ ఎన్నికల్లో గెలుపొందారన్న  గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు అంజన్ కుమార్ యాదవ్
ఈవిఎంలు టాంపరింగ్ జరిగాయని మాజీ ఎంపీ, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు అంజన్ కుమార్ యాదవ్ అన్నారు. ఎన్నికల్లో ఎన్నో ఆశలతో పోటీలో ఉన్న వారి ఆశలు అడియాశలయ్యేలా కేసీఆర్ మోసానికి పాల్పడ్డాడని ఆరోపించారు. ప్రజల్లో సానుకూలతలేని ఎమ్మెల్యేలు  గతంలో రానంత భారీ మెజార్టీతో గెలుపోందడం చూస్తుంటే ఈవిఎం ల అక్రమాలు ఏ స్ధాయిలో ఉన్నాయో అర్దం అవుతోందన్నారు. ఎన్నికల సర్వేలో కాంగ్రెస్ పార్టీకీ గెలుపు అవకాశాలున్నాయన్న సమాచారం వెలుగులోకి వచ్చినా ఇంత దారుణంగా ఫలితాలు రావడం వెనుక అక్రమాలే కారణమన్నారు. నిమిషానికో ఓటు వేసే పరిస్థితుంటే అతి తక్కువ సమయంలో భారీ పోలింగ్ ఎలా సాధ్యమవుతుందో ఎన్నికల కమీషన్ స్పష్టం చేయాలన్నారు. ఈంట్ కా జవాబ్ పత్తర్ సే దేనా అన్నట్లు టీఆర్ఎస్, బీజెపీ పార్టీలకు బుద్ది చెప్పాలన్నారు.  కాంగ్రెస్ పార్టీ మానిఫెస్టో ను కాపీ కొట్టారని ఆరోపించారు. బీజెపీ, టీఆర్ఎస్ పార్టీలు వేరుకాదన్నారు. రాబోయే ఎంపీ ఎన్నికల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు.  ఓటింగ్ నుంచి మొదలు ఈవిఎంల భద్రత వరకు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. 

ఈవిఎంలో జరిగిన అక్రమాలపై న్యాయపోరాటం చేస్తున్నామని వెల్లడి..
శాసనసభ ఎన్నికల్లో ఈవిఎంల గోల్ మాల్ జరిగిందన్నారు శ్రవణ్ ... ఖైరతాబాద్ నియోజకవర్గంలో 19 బూత్ లలో కౌంటింగ్ మిషన్ ఇచ్చిన ఫలితాలకు , ఆర్వో ఇచ్చిన ఫలితాలకు400 ఓట్ల తేడాను గుర్తించామన్నారు.  కోర్టుకు వెళుతున్నామని నిజానికి  కౌంటింగ్ లో తేడా వస్తే ఆ ఎన్నిక చెల్లదని రాజ్యాంగం చెబుతుందన్నారు.
ఒక్కో ఓటు వేయడానికి  1 నిమిషం పడుతుందని,. 3 గంటల వరకు 34 శాతం ఓటింగ్ అయితే.. 3 నుంచి 5 వరకు 52 వేల ఓట్ల పడ్డాయన్నారు. అంటే 20 శాతం అధికంగా ఎలా పడుతాయని ప్రశ్నించారు.నియోజకవర్గంలోని 238 బూత్ లలో ఒక్కోబూత్ లలో 218 ఓట్లు పడితే మొత్తం 52 వేల ఓట్లు అవుతాయన్నారు. ఇందుకు సాయంత్రం 7 గంటలవరకు పోలింగ్ జరుగాల్సి ఉంటుందని ఒకటి అర మినహా 99 శాతం బూత్ లలో 5 గంటలకే ముగిసిందన్నారు. రాష్ట్రం మొత్తంమీద జరిగిన అవకతవక లపై న్యాయపోరాటానికి సిద్దం అవుతున్నామని కాంగ్రెస్ పార్టీ జెండాను, ఎజెండాను కాపాడుకుందామని పిలుపునిచ్చారు. కార్యక్రమం చివరగా క్రిస్మస్ వేడుకలను కార్యకర్తల సమక్షంలో డాక్టర్ శ్రవణ్ కేక్ కట్ చేసిన జరిపారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జి, గ్రేటర్ హైదారబాద్ ఇంచార్జి మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ తో పాటు టిపిసిసి నాయకులు మధుకర్ యాదవ్, మాజీ కార్పోరేటర్ షరీఫ్, మహేశ్ యాదవ్, ఇందిర, కోటేశ్వరమ్మ, కమ్మరి వెంకటేశ్, నరికెళ్ల నరేశ్, సుమన్, కవిత,  తదితర నాయకులు కార్యకర్తలు బూత్ కమిటి సభ్యులు పెద్దయెత్తున హజరయ్యారు.

Congress vows to wage legal battle against EVM manipulation

Congress vows to wage legal battle against EVM manipulation

Hyderabad, December 23: Telangana Pradesh Congress Committee (TPCC) Chief Spokesperson Dr. Dasoju Sravan said that the Congress party would take the legal battle against manipulation of EVMs and other irregularities in the recently held Assembly elections to its logical end.







Addressing a review meeting at Indira Bhavan on Sunday with the Congress party workers of Khairtabad Assembly constituency from where he had contested as Praja Kutami candidate, Sravan said that the Congress was doing booth-wise review of EVM manipulations in all the constituencies across Telangana State. He said the analysis of Khairtabad constituency clearly established that the results were manipulated in favour of TRS party. Citing instances, he said there was a mismatch of about 400 votes in as many as 19 polling booths in Khairtabad constituency alone.

Sravan said the polling percentage in Khairtabad constituency was 34% till 3 pm. He said it takes at least one minute to cast one vote. However, the poll authorities have declared that nearly 52,000 votes were polled from 3 pm to 5 pm. This was possible only if 218 votes were polled in all 238 polling booths in the constituency which is impossible. Therefore, he alleged that said additional polling was done illegally till 7 pm in favour of TRS. He said this was the main reason for the mismatch between the actual votes polled and those counted in EVMs.

He said that the pattern of EVM manipulation was similar in almost all the constituencies. Therefore, he said that the Congress party would wage a legal battle against this and would not rest until it gets justice.

Sravan thanked the Congress party workers for the cooperation and hard work during the campaign. He said he had begun his career as a Faculty in Administrative Staff College of India located in Khairtabad where he served from 1990 to 1993. He said it was a privilege for him to begin his career in electoral career from Khairtabad constituencies. He said he got positive feedback from the people and also from intelligence officials after the polling predicting his victory. However, he said he had lost due to EVM manipulation by the ruling party.

The Congress leader asked the party workers not to get disheartened from the results and continue to serve the people without aspiring for any positions. During the 20-day campaign, he said that he had learned about several problems being faced by the people in Khairtabad constituency. They include problems pertaining to roads, drainage, drinking water, housing and land regularisation. Unlike common perception, he said one could represent and solve people's problem while in opposition than in power. Therefore, he said that the Congress cadre should able active in identifying the problems being faced by people and work hard to resolve them.

Sravan asked the party workers to stay in touch with the people and identify the deserving beneficiaries for Unemployment Allowance, ration cards and double bed room houses. He said the Congress workers should collect the data and make effective representation with the government to ensure that all deserving people gain from the government schemes.

The Congress leader also asked the party cadre not to fear the TRS Government which was trying t harass them by implicating them in false cases and other means. He said Chief Minister K. Chandrashekhar Rao was trying to weaken the Congress party by buying out MLAs and MLCs. He said that the Congress party has a long history of fighting suppression and bouncing back to power. He said Parliament elections were only a few months away and therefore, all Congress workers must work hard to make Rahul Gandhi the next Prime Minister of India.

The meeting was also addressed by Greater Hyderabad Congress Committee president M. Anjan Kumar Reddy, TPCC leader Madhukar Yadav, ex-corporator Sharif, Mahesh Yadav, Indira, Koteshwaramma, Kammari Venkatesh, N. Naresh, Suman, Kavith and others. (eom) 
   

పదవులున్నా లేకున్నా సమస్యలపై మడమతిప్పని పోరాటం చేస్తానని వెల్లడి :టిపిసిసి ముఖ్యఅధికార ప్రతినిది డాక్టర్ శ్రవణ్ దాసోజు

ఈవిఎంలో జరిగిన అక్రమాలపై న్యాయపోరాటం చేస్తున్నాం.. టిపిసిసి ముఖ్యఅధికార ప్రతినిది డాక్టర్ శ్రవణ్ దాసోజు...
ఫ్రొఫెషనల్ గా , రాజకీయంగా జన్మనిచ్చిన తల్లి ఖైరతాబాదేనన్న. దాసోజు
పదవులున్నా లేకున్నా సమస్యలపై మడమతిప్పని పోరాటం చేస్తానని వెల్లడి.
అధికార పక్షం పై ప్రశ్నాస్త్రాలు గా మారుదాం..సమస్య ల సాధన కోసం బాణాలు ఎక్కుపెడుదామని కార్యకర్తలకు పిలుపు.
ఓట్లేసి ఆదరించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపిన దాసోజు.... జీవితాంతం ప్రజల వెంటే ఉంటానని వెల్లడి...
అర్భన్ సోషల్ ఆడిట్ నిర్వహించి సమస్యల సాధనకు కృషి.
రాహుల్ ప్రధాని కావడం చారిత్రిక అవసరం..రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో  కష్టపడి పోరాడుదామని కార్యకర్తలకు దిశానిర్ధేశం చేసిన శ్రవణ్.
బూత్ లెవల్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న మాజీ ఎంపీ, గ్రేటర్ హైదరాబాద్ ఇంచార్జి అంజన్ కుమార్ యాదవ్.
క్రిస్మస్ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన శ్రవణ్, అంజన్ కుమార్ యాదవ్


ప్రొఫెషనల్ గా, రాజకీయ నాయకుడిగా ఆరంగేట్రం చేసిన తనకు ఖైరతాబాద్ నియోజకవర్గం  కన్నతల్లి లాంటిదని టిపిసిసి ముఖ్యఅధికార ప్రతినిధి, ఖైరతాబాద్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే డాక్టర్ శ్రవణ్ కుమార్ అన్నారు.  1990 నుంచి 1993 వరకు ఖైరతాబాద్ నడిబొడ్డున ఉన్న అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీలో ఇండియాలో  ప్రాజెక్ట్ ఎయిడ్ ఫ్యాకల్టీగా పనిచేశానని, మళ్లీ రాజకీయంగా తొలి అడుగుకూడా ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచే వేసానని గుర్తుచేసుకున్నారు.  ఆదివారం మధ్యాహ్నం  ఇందిరాభవన్ ఆడిటోరియంలో జరిగిన విస్తృత స్ధాయి నియోజకవర్గ కార్యకర్తలు బూత్ కమిటి సభ్యుల సమావేశంలో మాజీ ఎంపీ గ్రేటర్ హైదరాబాద్ ఇంచార్జి అంజన్ కుమార్ యాదవ్ తో కలిసి పాల్గొన్న ఆయన నియోజకవర్గంలో తనను అతి తక్కువ కాలంలో ఆదరించి అక్కున చేర్చుకున్న ప్రజలందరికి పేరు పేరునా ధన్యవాదాలు తెలియజేశారు.




పదవులున్నా లేకున్నా కార్యకర్తలకు అండగా నిలుస్తా.. సమస్యలపై మడమతిప్పని పోరాటం చేస్తా..
ప్రచారం లో ఉన్న సమయంలో ఓటింగ్ ముగిసిన తర్వాత ఎంతో మంది ఫోన్ లు చేశారని ఎమ్మెల్యే గా గెలవబోతున్నారని చెప్పారన్నారు. అలాగే ఇంటలిజెన్స్ అధికారులు కూడా  తన గెలుపు ఖాయమని చెప్పారని  కాని
ఏదో మాయ జరిగిందని ఫలితాలు తారుమారయ్యాయన్నారు. గెలుపు ఓటములు సహజమే అయినా నియోజకవర్గ ప్రజల సమస్యల సాధనలో మడమ తిప్పని పోరాటం చేస్తానని శ్రవణ్ అన్నారు. నియోజకవర్గంలో తన 20 రోజుల ప్రచారంలో రోడ్ల సమస్య, నాలాల సమస్య, డ్రైనేజీ సమస్య, మంచినీటి సమస్య, ఇండ్ల సమస్య,  ఇళ్ల పట్టాల సమస్య, భూముల రెగ్యులరైజేషన్ సమస్యలను గుర్తించానని వాటన్నింటిని పరిష్కరించేందుకు చిత్తశుద్దితో కృషి చేస్తానన్నారు.
అధికార పక్షానికి ప్రతిపక్షానికి తేడా ఉంటుందని  సమస్యల సాధనకోసం వత్తిడి తెచ్చే అవకాశం  ఉంటుందన్నారు.
మంచి నాయకులుగా ఎదగాలంటే ప్రతిపక్షంలోనే ఉండాలన్న శ్రవణ్
యువకులు మంచి నాయకులుగా ఎదుగాలంటే  అధికార పక్షంలో ఉంటే అసలు ఎదిగే అవకాశం రాదన్నారు శ్రవణ్ . నాయకత్వ లక్షణాలను పెంచుకోవాలంటే ప్రతిపక్షం పెద్ద వేదిక అవుతుందన్నారు.  ప్రజా సమస్యలపై గళమెత్తితే ప్రజలే నెత్తికెత్తుకొని ఆదరిస్తారనన్నారు.  అధికార పక్షంలో ఉంటే పోలీసులు గన్ మెన్ లు  తిట్టుకుంటు వెనుక తిరుగుతారని కబ్జాలు లకు పాల్పడ్డాడనని  కాని  ప్రతి పక్ష నాయకలు కొట్లాడితే గౌరవిస్తారన్నారు.  
అర్భన్ సోషల్ ఆడిట్ నిర్వహించి సమస్యల సాధనకు కృషి
ఖైరతాబాద్ నియోజకవర్గ సమస్యలను గుర్తించేందుకు అర్భన్ సోషల్ ఆడిట్ నిర్వహించబోతున్నట్లు శ్రవణ్ దాసోజు తెలిపారు. వార్డుల వారిగా,డివిజన్ వారిగా  సమస్యలను గుర్తించేందుకు  ఓ ప్రణాళిక సిద్దం చేస్తున్నామని కార్యకర్తలు అందరూ భాగస్వాములు కావాలని పిలుపు నిచ్చారు.
రాహుల్ ప్రధాని కావడం చారిత్రిక అవసరం..రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో  కష్టపడి పోరాడుదామని కార్యకర్తలకు దిశానిర్ధేశం చేసిన శ్రవణ్.
కొద్ది నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు  సమీపిస్తున్నాయని, రాహుల్ గాంధీ ప్రధాని కావాల్సిన చారిత్రిక అవసరముందని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. గడిచిన నాలుగున్నర సంవత్సరాలుగా మోడీ పాలనలో ఆయన అవలంబించిన విధానాల వల్ల దేశంలో కులాలు మతాల పేరిట కొనసాగిన విధ్వంసం ఇకముందు కొనసాగరాదన్నారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో పెద్దయెత్తున ఓటర్ నమోదు కార్యక్రమాన్ని చేయించేందుకు ప్రతి కార్యకర్తా నడుం కట్టాలని, మోడీ దుర్మార్గ పాలనకు చరమ గీతం పాడుదాం రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చేద్దామని పిలుపు నిచ్చారు.
ప్రభుత్వ పథకాలకు లబ్దిదారులను గుర్తించడం లో కార్యకర్తలు సహకరించాలి
నియోజకవర్గంలో ప్రభుత్వ పథకాలు పేదలకు సక్రమంగా అందించేందుకు రేషన్ కార్డులు, నిరుద్యోగుల కు రూ. 3వేల భృతి సక్రమంగా అందడంలో కార్యకర్తలు కృషి చేయాలని పిలుపు నిచ్చారు. డబుల్ బెడ్రూం ఇళ్ళకు ఎంతమంది అర్హులున్నరో వారందరి వివరాలు డివిజన్ వారిగా సేకరించాలన్నారు. ఇందుకోసం ఓ ప్రొఫార్మాను సిద్దం చేస్తున్నట్లు శ్రవణ్ ప్రకటించారు.



కేసుల గురించి ఎవరూ భయపడవద్దు..కార్యకర్తలకు దాసోజు పిలుపు
కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై కేసులు నమోదు చేస్తే ఎవరూ భయపడొద్దని న్యాయపరంగా పోరాటం చేద్దామని, కార్యకర్తల వెంటే ఉంటానన్నారు. కేసీఆర్ పార్టీని బలహీన పరిచే ప్రయత్నం చేస్తూ ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తున్నాడన్నారు. కాంగ్రెస్ పార్టీనుంచి ఎంతమంది పోయినా సుదీర్ఘ చరిత్రి కలిగిన కాంగ్రెస్ పార్టీ గంగ ప్రవాహం లాంటిదని మళ్లీ స్వచ్చంగా,నిరాటంకంగా ముందుకు సాగుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ కి బలం కార్యకర్తలేనన్నారు.
ఈవిఎంలో జరిగిన అక్రమాలపై న్యాయపోరాటం చేస్తున్నామని వెల్లడి..
శాసనసభ ఎన్నికల్లో ఈవిఎంల గోల్ మాల్ జరిగిందన్నారు శ్రవణ్ ... ఖైరతాబాద్ నియోజకవర్గంలో 19 బూత్ లలో కౌంటింగ్ మిషన్ ఇచ్చిన ఫలితాలకు , ఆర్వో ఇచ్చిన ఫలితాలకు400 ఓట్ల తేడాను గుర్తించామన్నారు.  కోర్టుకు వెళుతున్నామని నిజానికి  కౌంటింగ్ లో తేడా వస్తే ఆ ఎన్నిక చెల్లదని రాజ్యాంగం చెబుతుందన్నారు.
ఒక్కో ఓటు వేయడానికి  1 నిమిషం పడుతుందని,. 3 గంటల వరకు 34 శాతం ఓటింగ్ అయితే.. 3 నుంచి 5 వరకు 52 వేల ఓట్ల పడ్డాయన్నారు. అంటే 20 శాతం అధికంగా ఎలా పడుతాయని ప్రశ్నించారు.నియోజకవర్గంలోని 238 బూత్ లలో ఒక్కోబూత్ లలో 218 ఓట్లు పడితే మొత్తం 52 వేల ఓట్లు అవుతాయన్నారు. ఇందుకు సాయంత్రం 7 గంటలవరకు పోలింగ్ జరుగాల్సి ఉంటుందని ఒకటి అర మినహా 99 శాతం బూత్ లలో 5 గంటలకే ముగిసిందన్నారు. రాష్ట్రం మొత్తంమీద జరిగిన అవకతవక లపై న్యాయపోరాటానికి సిద్దం అవుతున్నామని కాంగ్రెస్ పార్టీ జెండాను, ఎజెండాను కాపాడుకుందామని పిలుపునిచ్చారు. కార్యక్రమం చివరగా క్రిస్మస్ వేడుకలను కార్యకర్తల సమక్షంలో డాక్టర్ శ్రవణ్ కేక్ కట్ చేసిన జరిపారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జి, గ్రేటర్ హైదారబాద్ ఇంచార్జి మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ తో పాటు టిపిసిసి నాయకులు మధుకర్ యాదవ్, మాజీ కార్పోరేటర్ షరీఫ్, మహేశ్ యాదవ్, ఇందిర, కోటేశ్వరమ్మ, కమ్మరి వెంకటేశ్, నరికెళ్ల నరేశ్, సుమన్, కవిత,  తదితర నాయకులు కార్యకర్తలు బూత్ కమిటి సభ్యులు పెద్దయెత్తున హజరయ్యారు.