Tuesday 29 August 2017

TPCC Chief Spokesperson Dr. Sravan Dasoju sent an eight-page letter while questioning the very credibility of #ICFA itself.





http://www.sakshi.com/news/telangana/tpcc-spokesperson-dasoju-sravan-reply-to-icfa-502993?pfrom=home-telangana

Dr Sravan Dasoju #Reply to #ICFA Notice On Global Leadership #Award -2017 to CM #KCR -ENGLISH












Dr Sravan Dasoju Reply to 2 ICFA on #Agriculture #Leadersip Award to #Shri #KCR-TELUGU













శ్రీయుత ఎన్ ఎస్ రంధావ గారు,

ఎక్స్యూటివ్ డైరెక్టర్ ,
ఇండియన్ కౌన్సిల్ ఫర్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్
విషయము: తెలంగాణా ముఖ్యమంత్రి శ్రీయుత చంద్రశేఖర్ రావుగారి గ్లోబల్ లీడర్ షిప్ అవార్డు 2017 గూర్చి
1. తేదీ 23.08.2017 నాడు మీరు పంపిన లేఖకు నా సమాధానం..
2. మొదటిది మీకు ఒక విషయాన్ని స్పష్టం చేస్తున్నాం వ్యక్తిగతంగా నేను గాని, తెలంగాణా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటిగాని.. మీకు గాని మీ సంస్ధకు వ్యతిరేకంగా ఎలాంటి వ్యక్తిగత వైషమ్యాలు లేవు.
3. రెండోది మీడియా సమావేశంలో మా ప్రధాన ఆరోపణ ఏమంటే... కేంద్ర ప్రభుత్వమే ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ప్రతిష్టాత్మక గ్లోబల్ లీడర్ షిప్ అవార్డ్ 2017 ను ప్రకటించినట్లు, రాష్ట్రగవర్నర్ ఆయన అభినందిందిస్తూ మీడియాకు ఒక తప్పుడు లేఖ విడుదల చేయడం పైనే..ఇదే అదను అన్నట్లు తెలంగాణ ప్రభుత్వం కే. చంద్రశేఖర్ రావు గారు వ్యవసాయ అభివ్రిద్ది కోసం తాను చేసిన కృషి ని గుర్తించినట్లు పెద్ద ఎత్తున మోసపూరిత ప్రచారం చేసుకోవడం పైనే..
4. ముఖ్యమంత్రిగారు, గవర్నర్ కలిసి చేస్తున్న ఈ తప్పుడు ప్రచారాన్ని, మోసపూరిత విధానాన్ని వెలికి తీయడం మా కనీస భాద్యత.. విఫలమవుతున్న ప్రభుత్వ నిర్ణయాలను కప్పిపుచ్చుకునేందుకు రైతులవద్ద మోసపూరితంగా మంచి పేరు కోట్టేసేందుకు రాజకీయంగా లబ్ది పోందేందుకు గ్లోబల్ అగ్రికల్చరల్ లీడర్ షిప్ అవార్డు వాడుకునేందుకు చేసే ప్రయత్నాలను అడ్డుకున్నాం.
5. దురదృష్టవశాత్తూ ICFA ఇవ్వబోతున్న అవార్డును కేసీయార్ గారు దుర్వినియోగపరిచి, రాజకీయంగా లబ్దిపొంది తెలంగాణా ప్రజలను వెర్రిబాగుల వాళ్లను చేస్తున్నారు. .దురదృష్టవశాత్తూ రాష్ట్ర ప్రధమ పౌరుడు, రాజ్యాంగ రక్షకుడు క ఉండాల్సిన గవర్నర్ సైతం తెలంగాణ ముఖ్యమంత్రి చేస్తున్న ఈ మోస పూరిత ప్రచారంలో భాగస్తుడు అయ్యిండు. ఇది ప్రజాస్వయానికి ప్రమాదకరం
గవర్నర్ గారి ప్రెస్ స్టేట్ మెంట్ తర్వాత చూసిన తర్వాత మేము చేసిన లోతైన పరిశోధనలో ఐసీఎఫ్ ఎ అనే సంస్ధ ఒక ప్రైవేట్ సంస్ధ గా గుర్తించాం.
§ M/s ఇండియన్ కౌన్సిల్ ఫర్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ (ICFA) అనే కంపెనీ జూన్ 5వ తేదీ 2015లో రిజిష్టర్ అయినట్లుగా రిజిష్టర్ ఆఫ్ కంపెనీస్ లో పొందుపరిచి ఉన్నది. కాని మీరు మీ యెక్క లేఖలో 2008 నుంచి అవార్డులు ప్రకటిస్తున్నామని తెలిపారు. ఇది మోసం కాదా?
§ RoC రికార్డుల లో M/s ICFA పూర్తిగా శ్రీయుత ఎం జె ఖాన్ గారి స్వంత కంపెనీ అని తెలుస్తుంది. అంతేకాక M/s కాన్సెప్ట్ అగ్రోటెక్ కన్సల్టెంట్స్ లిమిటెడ్ మరియు M/s భగీరథి అగ్రోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ లాంటి లాభాపేక్ష కలిగిన వ్యవసాయ మరియు విత్తన సంబంధిత వ్యాపార కంపెనీలలో శ్రీయుత ఎం జె ఖాన్ భాగస్వామి గా ఉన్నాడు.
§ రిజిష్టార్ ఆఫ్ కంపెనీస్ లో ఫైల్ అయిన రిటర్న్ లో ICFA అనే సంస్ధ M/s కాన్సెప్ట్అగ్రెటెక్ కన్సల్టెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇస్తున్న డబ్బుద్వారానే నడుస్తోందని తెలుస్తొంది.
§ M/s. ICFA కంపెనీలో ఎంజె ఖాన్, అలోక్ సిన్హా మరియు సునిల్ కుమార్ లు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ లుగా ఉన్నారు. ఇక సునిల్ కుమార్ గారు M/sఅజార్డికా ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ M/s ఎన్ వి ఇండియన్ ఆగ్రో ఫ్రెష్ ప్రైవేట్ లిమిటెడ్, మరియు M/s సినర్జీ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీల్లో డైరెక్టర్ గా కొనసాగుతున్నారు, అదేవిధంగా అలోక్ సిన్హాగారు. ఇతర కంపెనీలతో పాటు M/s భారత జాతీయ బహుళ సరుకుల మారక సంస్థ అనే ప్రైవేట్ కంపెనీ కు డైరెక్టర్ గా కొనసాగుతున్నారు. అదేవిధంగా M/s. ఎంటెర్గా లిమిటెడ్ లో కూడా డైరెక్టర్ గా కొనసాగుతున్నారు. అయితే M/s.ఎంటెర్గా లిమిటెడ్ దాదాపు 280 కోట్లరూపాయలు బకాయిలు పెండింగ్ లో ఉన్నాయి. ఈ కంపెనీలన్నీ వ్యవసాయం మరియు విత్తన కంపెనీలతో సంబంధం ఉన్నట్లు నిర్ధారణ అవుతుంది.
§ 2016 మార్చి 31 వరకు M/s ICFA బాలెన్స్ షీట్ ప్రకారం షేర్ కాపిటల్ కూడా కేవలం 66,639 రూపాయలు మాత్రమే. ఇక ప్రింటింగ్ మరియు స్టేషనరీఖర్చులు కేవలం 21,830., ఆఖరికి 7000 రూపాయలు ఆడిటర్ ఖర్చులు కూడా చెల్లించలేదు. ఎలాంటి చెల్లింపులు లేవు, ఆఖరికి ఉద్యోగులజీతాలు చెల్లించలేదు. అదేవిధంగా కంపెనీ కార్యకలాపాల పై ఖర్చులు కూడా లేవు. M/s ICFA..కు సంబంధించి ఏ లవ దేవీలు లేవు. ICFA వారు ఒక్కరూపాయి ఆదాయం లేదని , ఏ ఖర్చు కూడా చేయలేదని వారు సమర్పించిన బాలెన్స్ షీట్ మరియు RoC రికార్డులు చెపుతున్నాయి. .కాని మీరు 2015లోనే గ్లోబల్ అగ్రికల్చరల్ లీడర్ షిప్ అవార్డు ను శ్రీ శివరాజ్ చౌహన్ గారికి ఇచ్చామని చెబుతున్నారు. అంతపెద్ద ప్రోగ్రాం చేయడానికి ఎలాంటి ఖర్చులేకుండా ఎలా నిర్వహించారో చెప్పగలరా? మీకు ఈ అవార్డు ఫంక్షన్లకు ఎవరు డబ్బులు ఇస్తున్నారు?
§ M/s ICFA కంపెనీలో 20మంది పేరెన్నికగన్న వ్యక్తులు బోర్డ్ మెంబర్లుగా ఉన్నారని చెబుతున్నారు. కాని రిజిష్టర్ ఆఫ్ కంపెనీ వివరాల ప్రకారం కేవలం ముగ్గురు మాత్రమే (ఎంజె ఖాన్, అలోక్ సిన్హా మరియు సునిల్ కుమార్ లు) కంపెనీ డైరెక్టర్లుగా నమోదయ్యారు. కాని మీరు చెబుతున్న పేరెన్నికగన్న వ్యక్తులకు సంబంధించి ఎలాంటి వివరాలు RoC రికార్డులలో లేవు. ఇది మోసం గాద? ఒకవేళ వారంతా మీ కంపెనీతో సంనడం ఉన్న వారైతే, వారంతా విత్తనాల వ్యాపారం, వ్యవసాయయంత్రాలు, వ్యవసాయ సామాగ్రి పురుగులమందులు అమ్మే మల్టీనేషనల్ కంపెనీలకు సంధించిన వారు. దీన్ని బట్టి ప్రైవేట్ విత్తన సంస్ధలతో .లేదా వ్యవసాయ వ్యాపార లావాదేవీలు ఉన్నట్లు గాదా?
§ స్వాతంత్ర్యం కు ముందు నుంచి ఫిక్కీ మరియు సిఐఐ లాంటి పెద్ద సంస్ధలు ప్రాధమికంగా వారి సభ్యులతో సహాయం తో న్నాయి. నిర్ణయానుసారంగా పరిశ్రమలు మరియు వ్యాపార అభివృద్లిలో భాగంగా అవి ఆయా సంస్ధలను ప్రభుత్వం ను ప్రభావితం చేస్తాయికూడా చేస్తున్నాయి.. అలాంటివి ఇప్పటివరకు ఏ ఒక్క రాజకీయ నేతకు అవార్డులు ప్రకటించలేదు. కాని M/s ICFA అనేసంస్ధ మాత్రం ప్రభుత్వాలను నడిపే రాజకీయ నేతలకు అవార్డులు ఇస్తోంది.. కారణాలేంటో మీకే తెలియాలి?
§ దేశంలో వ్యవసాయిక విధానం, రైతు సాంకేతిక విజ్నానం పై పరిశోధనలో తామే అపెక్స్ బాడీ అని ICFA ప్రకటించుకోవడం సరిగా లేదు. భారత వ్యవసాయిక రిసెర్చ్ కౌన్సిల్ (ICAR) మాత్రమే దేశంలో వ్యయసాయ రంగంలో అపెక్స్ బాడీ గా గుర్తింపు ఉంది. ICAR దేశవ్యాప్తంగా 101 ICAR కేంద్రాలతో సేవలందిస్తోంది. 71 వ్యవసాయిక విశ్వవిద్యాలయాలను దేశవ్యాప్తంగా విస్తరించింది.జూలై 16.1929లో స్ధాపించబడిన ICAR డిపార్ట్ మెంట్ ఆఫ్ వ్యవసాయిక పరిశోధన మరియు విద్య(DARE) కింద పనిచేస్తోంది. భారత ప్రభుత్వం ద్వారా జాతీయ స్ధాయిలో ఈ సంస్ధ అతిపెద్ద పబ్లిక్ రంగ సంస్ధగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పోందింది. ICAR కు మీకు పోలిక ఏమిటి?
§ శ్రీయుత డాక్టర్ ఎంజె ఖాన్ , ఛైర్మెన్ ICFA గారు తెలంగాణా ముఖ్యమంత్రిగారికి రాసిన AT/ Awards/ 01/08/17 తేదీ 05.08.2017 లేఖలో ప్రోఫెసర్ స్వామినాధన్ గారి నేతృత్వంలోని నేషనల్ అవార్డ్ కమిటీ యే (పాలసీ నాయకత్వంకింద) ఈ అవార్డును ముఖ్యమంత్రిగారికి ఇచ్చినట్లు ఉంది. ఎలాంటి ప్రతిభను కనబరచని, అత్యంత బాధ్యత రహితంగా వ్యహరించిన తెలంగాణా ముఖ్యమంత్రికి ఈ అవార్డు ప్రకటించడం పట్ల మేం నిజంగానే ఆశ్చర్యం వ్యక్తం చేశాము. అది ముఖ్యమంత్రి చేస్తున్న మోసానికి పరోక్షంగా తోడ్పడ్డట్లు గాదా?
§ అసలు తెలంగాణా లో పర్యటించకుండా ఇక్క రైతులను కలువకుండా, క్షేత్ర స్థాయిలో వాస్తవాలను తెలుసుకోకుండా ముఖమంత్రి పాలసీలు బాగున్నాయని యెట్లా నిర్ధారణకు వచ్చారో వివరణ ఇవ్వాలని కోరుతున్నాము.
§ అవార్డు ఇస్తున్నట్లు ముఖ్యమంత్రిగారి నుద్దేశించి డాక్టర్ఎంజె ఖాన్ గారు రాసిన లేఖలో రాసింది పూర్తిగా తప్పు. క్షేత్రస్ధాయిలో నిజానిజాలు తెలుసుకోకుండా వాస్తవాలు తెలియకుండా చేసిన చర్యగా భావిస్తున్నాం. నిజానిజాలేంటో మేం తెలియజేస్తున్నాం గమనించండి.
§ మీరు అవార్డు ప్రకటించిన తెలంగాణా ముఖ్యమంత్రి కేసీయార్ గారు ఎలాంటి వ్యవసాయం పై ఎలాంటి విధాయక నిర్ణయాలు తీసుకున్నారో. ఎన్ని లక్షల మంది రైతుల జీవితాల్లో ఏమి మార్పు కనిపించిందో మిమ్మల్ని, మీ అవార్డుల కమిటీని (అగ్రికల్చరల్ పాలసి ) అంతగా ప్రభావితం చేసిన విషయమేంటో తెలపాలని తెలంగాణా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మిమ్మల్ని ప్రశ్నిస్తోంది. మహారాష్ట్ర తర్వాత రైతుల ఆత్మహత్యల్లో దేశ వ్యాప్తంగా రెండో స్దానం వచ్చిన తెలంగాణా ముఖ్యమంత్రి కి ఈ అవార్డు ఏ ప్రాతిపదిక మీద ఇస్తారో చెప్పండి
తెలంగాణా ప్రజలకు కు అర్ధం కావడం మీరు ఈ క్రింది విషయాలపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నాము:
1. గ్లోబల్ లీడర్ షిప్ అవార్డ్ 2017 కోసం ఎన్ని దరఖాస్తులు మీకు,,మీసంస్థకు వచ్చాయి ?
2. అవార్డు ఇవ్వడానికి మీరు ఎలాంటి నిబంధనలు పెట్టారు.?
3. కేసీయార్ గారికి అవార్డు ఇవ్వడానికి ఆయన పాలసీలకు సంబందించి మీరు ఎలాంటి పత్రాలను తీసుకున్నారు.?
4. వాస్తవ పరిస్థితులను తెలుసుకునేందుకు అవార్డు కమిటీ వారు ఎన్ని వ్యవసాయక్షేత్రాలను
5. పరిశీలించారు. ఎవరి అధ్వర్యంలో పరిశీలించారు.?
6. అవార్డును నిర్ణయించేముందు ఎన్ని సమావేశాలను అవార్డుకమిటీ నిర్వహించింది?
7. మీరు సమావేశాలను నిర్విహిస్తే అవి ఎక్కడ ఎప్పుడు నిర్వహించారు.?
8. మీ అడ్వైజరీ కమిటీ ద్వారా మీరు నిర్వహించిన సమావేశాల ప్రతులను మాకు అందచేయగలరా?
9. అవార్డు కు అర్హులను ఎన్నుకునే మొత్తం విధానం ఏంటి.?
10. ఈ అవార్డు కమిటీ కి సంబంధించిన పూర్తి రాజ్యాంగం ఏమిటి ?
గ్లోబల్ అగ్రికల్చరల్ లీడర్షిఫ్ అవార్డు ను ముఖ్యమంత్రి శ్రీ చంద్రశేఖర్ రావు గారికి ఇవ్వడంపై
తెలంగాణా సమాజం ముందు అవార్డుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఉంచాలని కోరుతున్నాను. తేదీ 02.06.2014 నుంచి ఆగస్ట్ 25 2017 వరకు శ్రీ కే. చంద్రశేఖర్ రావు గారి పాలన కాలం కూడా దృష్టిలొ ఉంచుకోవాలి. ఆయన పరిపాలనా కాలంలో ఇప్పడి వరకు 3141మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అందులో ఆయన స్వంత నియోజక వర్గం ఉన్న జిల్లా సిద్దిపేటలోనే ఏకంగా 271 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. సహాయం మాట అటుంచితే..ఇప్పడి వరకు ముఖ్యమంత్రి వారిని కనీసం ఓదార్చిన పాపాన పోలేదు. అటువంటి వ్యక్తి కి అవార్డు యెట్లా ఇస్తారు.
ICFA అవార్డు ఇచ్చేముందు, ఈ క్రింది తెలంగాణా వ్యవసాయానికి సంబంధించి వాస్తవ విషయాలను తెలిసికునుంటే బాగుండేది.
గౌరవనీయ ముఖ్యమంత్రి ఎన్నికల మానిఫెస్టోలో చెప్పిన విషయాలపై పూర్తిగా విఫలమయ్యారు. రైతులకు ఇస్తామన్నరుణమాఫీ పూర్తిచేయలేదు. తెలంగాణా కాంగ్రెస్ కమిటీ మరియు ఇతర ప్రజాసంఘాల తీవ్ర వత్తిడితో నాలుగువిడుతలుగా ఇస్తామని అంగీకరించారు. కాని వారిచ్చిన డబ్బుతో కేవలం మిత్తీ మాత్రమే తీరింది అసలు అలాగే మిగిలిపోయింది..దీంతో వారి రుణాలు అలాగే బకాయిలుగా మిగిలిపోయాయి.. దీంతో 36 లక్షల మంది రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.దీనికి నిదర్శనంగా బ్యాంకులవద్దవారి యొక్క పాస్ బుక్కులు జప్తుచేయబడ్డాయి.బంగారు ఆభరణాలు సైతం బాంకుల్లో తాకట్టుల్లో ఉన్నాయి.
కరువు పరిస్థితులను సరిగా అంచనా వేయలేకపోవడం లో ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యింది.ముఖ్యంగా వర్షాలు పడినప్పుడు ఎలా మేనేజ్ చేయాల్లో ప్రణాళిక లేదు. మార్కెట్ హెచ్చుతగ్గులను ఎలా అంచనావేయాలో సరైన ప్రణాళిక లేదు. ఊహాతీత కల్పిత చర్యలద్వారా ప్రభుత్వం ముందకు పోతోంది..దీనివల్ల దళారులు రైతులను సులభంగా మోసగిస్తున్నారు.రైతులు పండించే పంటల నష్లాలకు సంబంధించిన రిపోర్ట్ కేంద్ర ప్రభుత్వం కు సరయిన సమయంలో పంపడంలో పూర్తిగా విఫలం అయింది. నోట్ల రద్దు అంశంతో గ్రామీణ బ్యాంకుల్లో డబ్బులు సరయిన సమయానికి అందక రైతులు తీవ్ర ఇబ్బందుకు గురయ్యారు.స్ధానిక మార్కెట్లలో విత్తనాలు కొనుగోలు చేసేందుకు ,పురుగులమందులు కోనేందుకు చాలా ఇబ్బందులు పడ్డారు.ఇదంతా జరుగుతున్నా తెలంగాణా ప్రభుత్వం ఎలాంటి ముందస్తు చర్యలు చేపట్టలేదు.
గత సీజన్ లో రైతులకు సరైనMSP కనీస మద్దతు ధర కల్పించలేకపోయారు.దీంతో చాలా మంది రైతులు కనీస గిట్టుబాటు ధర లేక తాము పండించిన పంటలను తామేకాల్చివేసారు. తెలంగాణాలో రైతన్నలు రోజంతా కష్టపడి చెమట ధారపోసినా వారికి సరియైన ధర పొందలేకపోయారు. ఇదంతా ప్రభుత్వం వద్ద సరైన ప్రణాళిక లేకపోవడమే, వారికెలాంటి న్యాయం ప్రభుత్వం చేయలేకపోయింది.. ఎవరన్నా రైతులు తమకు అన్యాయం జరుగుతోందని ఎదురుతిరిగితే వారిపై దారుణంగా దాడులకు పాల్పడ్డారు. పోలీసులతో కొట్టించారు రైతులను రౌడీలగా చిత్రీకరించారు. వారిచేతులకు బేడీలు వేసి జైల్లో తోయించారు. గతంలోనే నిర్మాణం ప్రారంభం అయిన వాటిని ప్రాజెక్టల రీడీజైన్ పేరిట కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని ఇష్లాను సారంగా ఖర్చు చేస్తూ పెద్దయెత్తున అవినీతికి పాల్పడుతోంది తెలంగాణ ప్రభుత్వం. నిర్ధాక్షిణ్యంగా తెలంగాణా ప్రభుత్వం వ్యవసాయిక భూములునుదోచుకుంటోంది. దొడ్డిదారిన తెచ్చి కొత్త భూసేకరణ చట్టాన్ని తెచ్చి చిన్న సన్నకారు రైతులనుంచి బలవంతంగా భూములు సేకరిస్తూ భయభ్రాంతులకుగురిచేస్తోంది.. నియంతృత్వ పోకడలతో ప్రభుత్వం వ్యవహరిస్తూ అసలైన భూసేకరణ చట్టాన్ని భూసేకరణ చట్టం 2013 ను తుంగలో తొక్కింది. గ్రామాల్లో పోలీసులను రెవెన్యూ యంత్రాంగాన్ని మోహరించి రైతులను ఇబ్బందులకు గురిచేస్తోంది.పర్యావరణ చట్టాలంటే ఈ ప్రభుత్వానికి గౌరవం లేదు.ప్రజల జీవితాలంటేవిలువ లేదు. పేద రైతులు భూమిలేని కూలీలంటే లెక్కెలేదు.
తెలంగాణా ప్రభుత్వం చేపట్టిన చర్యలతో ఇబ్భందులపాలయిన రైతులకు న్యాయం జరుగాలని వారిని ఆదుకోవాలని మే 2015లో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు శ్రీయుత రాహుల్ గాంధీ పాదయాత్ర చేసినప్పటికిని, తెలంగాణాలో ఉన్న నియంత ప్రభుత్వం రైతుల సమస్యలను తీర్చడం లేదు. 2014 నుంచి ఇప్పడివరకు రైతుల జీవితాల్లో ఎలాంటి మార్పూ లేదు.రైతుల మాట వినేందుకు ప్రభుత్వంలో ఎవరికి తీరిక లేదు. బీద బడుగు బలహీన వర్గాల గొంతులు పూర్తి నొక్కివేయబడి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యంచేసేలా ప్రభుత్వం వ్యవహరిస్తోంది.
వ్యవసాయం పాడయిపోయి తీవ్ర నిరాశలో ఉన్న తెలంగాణా రైతాంగం ఇప్పడివరకు చెప్పిన విషయాలు కేవలం మచ్చు మాత్రమే.. గుండె పగిలే నిజాలు రైతులను కదిలిస్తే తెలుస్తాయి..ఇవేవీ పట్టించుకోని ముఖ్యమంత్రికి ఎలాంటి అవార్డుకు అర్హుడు కాడు. మీలాంటి మీకు ముఖ్యమంత్రికున్న వ్యాపార సంభంధం ఏమిటి చెప్పాలి?
మీరు ఆంధ్రప్రదేశ్ మాజీ ముంఖ్యమంత్రి దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి గారికిమొదటి బెస్ట్ అగ్రికల్చరల్ అవార్డ్ 2008 ఇచ్చామని చెబుతున్నారు. కాని మీరు రాసిన లేఖ ప్రకారం మీ సంస్ధ ICFA 2015లో ప్రారంభం అయిందని తెలిపారు.
ఏదేమైనప్పడికి మీరు చెప్పిన విషయాల్లో ప్రస్తుత ముఖ్యమంత్రికి దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డిగారికి ఏమాత్రం పోలిక లేదు. 2004 నుంచి 2009 వరకు దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డిగారి ఆధ్వర్యంలో ఎన్నో నూతన వ్యవసాయిక విధానాలను ప్రవేశ పెట్టి రైతు బాంధవుడిగా మారారు. ఉచిత విద్యుత్త్ అందించారు. రుణమాఫీ ఏకకాలంలో చేపట్టారు. ఇప్పడికి ఆయన రైతుల మదిలో చిరస్ధాయిగా నిలిచారు. ఇప్పడికి ఆయనే ఎలాంటి అవార్డుకు అయినా అర్హుడు.ఇది ఎంత మాత్రం అతిశయోక్తికాదని నిర్ధద్వందంగా చెప్పగలను. వ్యవసాయాన్ని పండుగ చేసిన పెద్ద మనిషి వైస్సార్, వ్యవసాయాన్ని దండుగ చేసిన మనిషి కెసిఆర్
తనస్వంత వ్యవసాయ క్షేత్రంలోఎకరానికి కోటి రూపాయలు పంటతీసే చంద్రశేఖర్ రావుగారికి వ్యక్తిగతం గా మీరు గ్లోబల్ లీడర్ అవార్డు ప్రకటిస్తే తెలంగాణా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కి ఎలాంటీ అభ్యంతరం లేదు. కాని తెలంగాణా ముఖ్యమంత్రి హోదాలో ఈ అవార్డు ప్రకటిస్తే తప్పనిసరిగా ప్రతిఘటిస్తాం..ఇది తెలంగాణా రైతాంగ సమాజాన్ని అవమానపరిచినట్టే అవుతుంది.తన తప్పుడు నిర్ణయాలతో తెలంగాణా వెనుకబాటు తనానికి కారణమవుతున్న ముఖ్యమంత్రికు అవార్డు ఇవ్వడం అన్యాయం.
మీరు రైతుల పట్ల, రైతులకు మంచి చేసే కార్యక్రమాలు చేస్తే కాంగ్రెస్ పార్టీ తప్పని సరిగా అభినందిస్తుంది. మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది. మిమ్మల్ని మీ పరిశీలక బృందాన్ని ఇక్కడ పర్యటించమని తెలంగాణా కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని ఆహ్వానిస్తోంది. క్షేత్రస్ధాయిలో ఉన్న వాస్తవ పరిస్థితులను అంచనావేయండి. చంద్రశేఖర్ రావు గారు ఈ అవార్డుకు అర్హులా కారా అన్నవిషయాన్ని రైతులే తీర్పుఇస్తారు.
మేము చంద్రశేఖర్ రావు గారిని విభేదిస్తున్నది కేవలం గొంతులేని పేద బీద రైతుల గొంతు వినిపించేందుకే కాని మీరన్నట్లు మాకేదో రాజకీయ లబ్దికోసం మాత్రం కాదు. మా వ్యాఖ్యలను మీరు తప్పుగా అర్ధం చేసుకున్నారు, మేము కేవలం ఒక అసమర్ధ ముఖ్యమంత్రి కి, అభూత కల్పనలతో రైతులను మోసం చేస్తున్న ముఖ్యమంత్రి కి, ఈ అవార్డు ఏ హేతుబద్ధతతో ఇచ్చారని మాత్రమే ప్రశ్నించాము మరియు ప్రభుత్వం మరియు గవర్నర్ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఎండగట్టాము అన్న కీలక విషయాన్నీ మాత్రమే గమనించాలని కోరుతున్నాము.
డా.శ్రవణ్ దాసోజు.
జనరల్ సెక్రెటరీ
చీఫ్ స్పోక్స్ పర్సన్
తెలంగాణా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ,
గాంధీభవన్ హైదరాబాద్,500001
Better POLITICS 4 Better INDIA
Cc to 1. Smt Sonia Gandhi , President, AICC
2 . Shri Rahul Gandhi Ji, Vice President, All India Congress Committee
3. Prof MS Swaminathan, Founder, MS Swaminathan Research Foundation & Chairman National Awards Committee
4. Capt N Uttam Kumar Reddy, President, Telangana Pradesh Congress Committee

ముఖ్యమంత్రి #కేసీఆర్ గారు ఇప్పుడు అసలు నిజాలు తెలిసినాకా తప్పించుకోవడానికి ప్రయత్నింస్తున్నారు..

ముఖ్యమంత్రి #కేసీఆర్ గారు ఇప్పుడు అసలు నిజాలు తెలిసినాకా తప్పించుకోవడానికి ప్రయత్నింస్తున్నారు..
మీ కార్యాలయ సిబ్బంది మీదకి నెట్టి తప్పించుకోవడానికి ప్రయత్నింస్తున్నారు.. అసలు ఆ కార్యాలయ సిబ్బంది , ఆ ఉన్నత అధికారులు ఎవరో చెప్పండి ప్రజలకు ? ఒకవేళ వారు మీకు తప్పుడు సమాచారం ఇస్తే.. వారి మీద మీరు, ప్రభుత్వం నుండి ఎలాంటి చర్యలు తీసుకొంటారు అనేది కూడా ప్రజలకు చెప్పవలసిన అవసరము మీ మీద ఉంది.
లేదా మీరు ఒకవేళ ఆ ఉన్నత స్థాయి అధికారుల మీద ఎలాంటి చర్యలు తీసుకోకుంటే,మీరు ఈ విషయంలో తప్పించుకోవడానికి ఆడుతున్న నటకంగా ప్రజలు అర్థం చేసుకోవలసి ఉంటుంది ?



http://telugugateway.com/kcr-agriculture-award-in-contravarsy/
https://www.muchata.com/main-news/times-of-india-exposes-real-value-of-icfa-award/

Wednesday 23 August 2017

బ్రదర్ కేటీఆర్.. ఇట్లు మీ శ్రావణ్..


తనపై టీఆర్ఎస్ చేస్తున్న విమర్శలపై తెలంగాణ కాంగ్రెస్ ప్రతినిధి డాక్టర్ శ్రావణ్ విరుచుకుపడ్డారు. కేటీఆర్ కు చెందిన మీడియా తనపై సోషల్ మీడియోలో దాడి చేస్తోందని, దీని కోసం ప్రజాధనాన్ని వాడుతోందని ఆరోపించారు.
ఈమేరకు మంగళవారం కేటీఆర్ కు ‘బ్రదర్ కేటీఆర్.. ’ అంటూ లేఖాస్త్రం సంధించారు. టీఆర్ఎస్ నాయకత్వం వాస్తవాలకు మసిపూస్తూ, ప్రచారార్భాటంతో ప్రజలను తప్పుదారి పట్టిస్తోందని శ్రావణ్ రోపించారు. ప్రజలకు సంబంధించిన ముఖ్యమైన అంశాలను లేవెనెత్తున్నవారిపై అధికార పార్టీ పెయిడ్ మీడియాతో బురదజల్లుడు ప్రచారానికి దిగుతోందని ధ్వజమెత్తారు.
కేసీఆర్ తో కలసి తాను దిగిన ఫొటోను కేటీఆర్ సోషల్ మీడియో పోస్ట్ చేయడంపై శ్రావణ్ నిప్పులు చెరిగారు. కేసీఆర్ కాంగ్రెస్ లో ఉన్నప్పటి గ్నాపకాలను, టీడీపీతో అనుబంధాలను ఇలాగే పదిలపరచుకున్నారా? అని ప్రశ్నించారు. ‘ఓటుకు నోట్ స్కాంలో చంద్రబాబును దేవుడు కూడా కాపాడలేడన్న కేసీఆర్ తర్వాత బాబుతో కలసి అమరావతిలో చేపల పులుసు, రొయ్యల వేపుడు ఆరగించిన విషయాన్ని కూడా పదిలంగా భద్రపరుచుకున్నారా?’ అని లేఖలో ఎద్దేవా చేశారు. పలు అంశాలపై కేటీఆర్ తో చర్చకు సిద్ధంగా ఉన్నానని సవాల్ విసిరారు.

https://www.muchata.com/main-news/dasoju-countet-to-ktr-tweet/#.WZz_BeOU8F8.facebookhttp://mictv.in/dasoju-sravan-accuses-ktr-of-neglecting-information-technology-project

We welcome judgement whole - heartedly as it recognized of muslim women.it should not be misinterpreted by people at helm of affairs to suit petty political interests


My Open Reply 2 Brother Kalvakuntla Taraka Rama Rao and His Paid Digital Army Atrocities in Social Media..


My Open Reply 2 Brother Kalvakuntla Taraka Rama Rao and His Paid Digital Army Atrocities in Social Media..
Dear Brother K. Taraka Rama Rao,
With Age-We Experience; With Age-We Mature; As Age Passes by, We Attain Wisdom & We Assess People and Society. Ultimately Wisdom Prevails over Everything.
After a thorough introspection & deep reflection driven by 'Inner Conscience & Wisdom, I realized 'PRESENT' TRS Govt is a "Fraudulent Clique" headed by its Supremo continuously cheating his own Trusted Followers and People in general. Therefore, I myself distanced away.
Any picture or video or any images of the then social gathering that are being shown by disgruntled & fraudulent present TRS ruling group is only to DISTORT & DETER people's attention from their misdeeds and protect their mischief. Ultimately TRUTH prevails. But power seems to have intoxicated you all, blinded and made you immune of others feelings. Nevertheless, People are wise enough to judge.
Discussion, Dialogue and Dissent are the foundations are Democracy. Why TRS is using paid digital army (Paid from Public Money) to abuse, harass, bulldoze when someone raises fundamental issues and people concerns.
I am glad that you preserve the memories of my association with KCR and I thank you for that. But you seem to have conveniently forgotten my contribution to strengthening KCR and Telangana Movement.
In any case, I am not too sure if you have preserved the memories of KCR’s association with Congress Party as Youth Congress Leader and Association with NTR’s TDP and later his after his vital role in backstabbing NTR and associating with Chandrababu Naidu TDP? Do you have memories of KCR silence when Belli Lalitha and Maroju Veeranna were killed by CBN Police?
Have you preserved the memories of Tallasani Abrasiveness, Thummala Atrocities, Patolla Goondaism, Konda Surekha Abuses and many others anti-telangana activities before you came to power.
Have you preserved the memories of KCR statement that even GOD cant help Chandrababu Naidu in Vote4Note Scam and his subsequent Chapala Pulusu and Royyala Vepudu Lunch meeting with Chandrababu Naidu in Amravati? If you do not have these videos and photographs will send you across for your knowledge and further reference.
Whom are you fooling? Your Govt can fool people once or twice but not all the time. People are watching your family’s crony capitalism and organized loot of the state and surely will teach a lesson.
Why are you attempting to distract from what I raised using petty digital army.. Are you ready for an open debate?
1. Is ICFA a private organization or not? And do you agree that ICFA has no credentials other than indulging lobbying on behalf of seed companies? Can you explain the relation of Hon’ble CM with such fraudulent company?
2. How is that CM is eligible for such award? One may not have problem if he takes the award in an individual capacity because of his GREAT SKILLS OF GENERATING Rs 1Cr Revenue per acre. But one would surely question him if he intends to take the award as an agriculture policy maker? Is it not true that more than 3500 farmers committed suicides due to debt and crop failures? Is it not true that your government is insane to leave aside giving the compensation and social security to families of deceased farmers, but did not even console them? Is it not true that your government failed to provide MSP to Chilli farmers and labeled them as rowdies? Is it not that your government handcuffed the farmers and jailed them for their demand of better price for their agri-produce. It is shameful that despite so many misdeeds, Hon’ble CM accepts such award.
3. Can you explain the reason for haste of Hon’ble Governor to distort the truth and endorse that the award is from Government of India?
4. Are you ready for a debate on your failure on ITIR? Is it not lopsided priorities and inefficiency affected the ITIR project that would have transformed the fortunes of Telangana with nearly 50 lakhs of employment and Rs 2 lakhs crores of investment?
5. Are you ready for a debate on sand mafia? Can you answer why environmental clearances were not taken while indulging in Sand Mining? Can you put in public domain the report of Central Pollution Control Board on gross violations of environmental act by sand mafia?
6. Can you justify human rights violation in Nerella? Is it not at your behest that arrogant SP of police brutally injured the innocent farmers? How would you justify washing away your hands by suspending SI, a lower rank officer and rewarding an accused Police SP with on-job training at Ladak? Is not your arrogance to disregard the people’s appeal and protect notorious and habitual police officer
7. How would you justify crores of public money being wasted on advertisements for felicitating Mr Venkaiah Naidu and land allocation to Reddy Hostel? It is not your hypocrisy that on one hand you accuse Reddys and on the other hand you would attempt to appease them with advertisements and 10 acres of land?
8. Are you not cheating poor farmers with forcible land acquisition scuttling land acquisition act 2013?
9. In the name of mission Bhagiratha and irrigation projects, there is unlimited corruption in the state and those who question are being bullied and harassed with your paid army.
I have immense respect to KCR as a leader of Telangana Moment. But certainly condemn the act of KCR as a chief minister who is dismantling the dreams of every Telanganite with his dictatorial rule.
Neither the congress party nor me personally will get deterred and distracted from our role and responsibility with your petty paid digital army. I have not joined politics for survival, but left a lucrative corporate career for role model politics. I have come into politics to stand by the poor and needy and to be the voice of voiceless and we shall question and expose your Govt’s misdeeds in the interests of Telangana. After all, our entire endeavor is to establish a Democratic Telangana and we shall fight till we achieve it.
I fully sympathize with the miserable state of your mind and frustration to use your paid digital army against me and also publishing their vulgar and false postings in your PINK MEDIA called Namaste Telangana. Do not forget that PINK MEDIA and PINK THOUGHT POLICING JOURNALISM cant scuttle the democratic voices. You may derive sadistic pleasure by making Goebbels campaign, but you can’t deter us from our social responsibility.
I invite you for a democratic debate at T Martyrs Memorial or at Pragathi Bahavan or at a place of your choice on various issues of your three-year rule in addition to what were raised above…
With Best Wishes
Regards
Dr Sravan
Note: Attached the Screenshot of KTR Tweet, Namaste Telangana Screen Shot

Congress Leader Shravan Comments on ICFA Awards 2017 for KCR || Off The Record || NTV


Tuesday 22 August 2017

కల్వకుంట్ల తారక రామారావు గారి ట్విట్టర్ పోస్టింగ్ కు, డిజిటల్ ఆర్మీ చేస్తున్న వికృత దాడికి దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ






కల్వకుంట్ల తారక రామారావు గారి ట్విట్టర్ పోస్టింగ్ కు,
డిజిటల్ ఆర్మీ చేస్తున్న వికృత దాడికి దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
ప్రియమైన సోదరులు కల్వకుంట్ల తారక రామారావు గారికి..
మీతో పాటు, మీ భజన సంఘం సామాజిక మాధ్యమాల ద్వారా నాపై చేస్తున్న దాడికి ఇది నా స్పందన...
వయస్సుతో పాటు అనుభవం వస్తుంది.. వయస్సుతో పాటు ఆలోచనాశక్తి, పరిణితి (పరిపక్వత) వస్తుంది.. ఏండ్లు గడుస్తున్న కొద్దీ విచక్షణ జ్ఞానం పెరుగుతుంది. అప్పుడేమనం సంఘాన్ని..అందులోని వ్యక్తులను సరిగా అంచనా వేయగలుగుతాం...చివరకు మనిషికి విచక్షణ జ్ఞానం కలిగి ఉండడమే అన్ని సమస్యలనుంచి గెలిపిస్తుంది.
ఎంతో అంతర్మథనం..లోతైన పరిశీలన ..ఎదురీత తర్వాత లోపల దాగిఉన్న సోయి..విచక్షణ జ్ఞానం బయట పడుతాయి...అందులోంచి వచ్చిందే ప్రస్తుత టీఆర్ఎస్ ప్రభుత్వ గుంపు యొక్క మోసపూరిత చర్యల గుర్తింపు..దీనికి నాయకత్వం వహిస్తున్న పెద్దమనిషి తనను నమ్మీ సర్వం త్యాగం చేసి వారిని అనుసరించిన వారిని ఎలా మోసగిస్తారో తెలుసుకున్నాను. పెద్దాయన మోసపూరిత వైఖరి తెలిసిన తర్వాత నాకు నేనే మీ నుండి దూరం జరిగాను. నేను తెరాస లోకి రావడానికి మీరు చేసిన ప్రయత్నాలు, చేసిన వాగ్ధానాల గురించి ఇప్పుడు నేను చెప్పదల్చుకోలేదు. సమయం వచ్చినప్పుడు చర్చిద్దాం.
కానీ నాకు సంబందించిన ఏదో ఒక పాత ఫోటొ..పాత్త వీడియోలను సోషియల్ మీడియాలో ప్రదర్శించి మీ నైరాశ్యాన్ని..మోసపూరిత చర్యలను మీ వక్రబుద్దిని చూపుతూ అసలు సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించే నీచ ప్రయత్నం చేస్తున్నారు..తద్వారా మీ అక్రమాలను వెలుగులోకి రాకుండా అడ్డుకునే కుట్ర చేస్తున్నారు.
చిట్ట చివరిగా సత్యం గెలుస్తుంది. కానీ అధికార మత్తులో తూగుతున్న మీకు, బయటి వ్యక్తుల ఆలోచనలు, ఫీలింగ్స్ తెలుసుకోలేని మూర్ఖులుగా, అంధులుగా మారిపోయారు. కానీ విచక్షణ శక్తి తో ప్రజలు మీ కుట్రలను, కుతంత్రాలను అర్ధం చేసుకుంటారని ఆశిస్తున్నాను.
చర్చచేయడం..భావాలను వ్యక్తీకరించడం...ప్రజాస్వామ్య కనీస హక్కు..కానీ మీచే ప్రేరేపించబడ్డ కొందరు, ఎవరైనా ప్రజాసమస్యలపై ప్రశ్నిస్తే ప్రజల సొమ్ముతో సెక్రటేరియట్ కేంద్రంగా, ముఖ్యమంత్రి ప్రగతిభవన్ ని వేదిక గా చేసుకుని డిజిటల్ జీతగాళ్లుగా మీ మెప్పుకోసం, సామాజిక మాధ్యమాల ద్వారా, జుగుప్సాకర పోస్టింగ్స్ పెడుతూ, మానసిక వేధింపులకు పాల్పడుతున్నారు..వీరీ ప్రవర్తన మీ సంకుచితమయిన మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తుంది.
అయితే, కేసీయార్ తో నాకున్న అనుబంధం తాలూకు జ్ఞాపకాలను, ఫోటోలను, వీడియో లను మీరు చాలా జాగ్రత్తగా దాచుకున్నందుకు చాలా సంతోషం... కాని మీరో ముఖ్యమైన విషయం మరిచిపోయినట్టున్నారు. కానీ తెలంగాణ ఉద్యమ సమయంలో నేను మీనాయన గారిని బలపరిచేందు కు నేను చేసిన కృషి, తెలంగాణ సాధన కోసం నేను పడ్డ కష్టం కూడా గుర్తుపెట్టుకుంటే బాగుండేది.
అలాగే..కేసీయార్ గారు కాంగ్రెస్ లో యూత్ కాంగ్రెస్ తో కలిసి ఉన్నప్పడివి..అలాగే ఎన్టీయార్ చలువవల్ల కెసిఆర్ టీడీపీ లో నాయకుడి గా ఎదిగిన జ్ఞాపకాలు, తదుపరి కెసిఆర్ ను ఎమ్మెల్యే చేసిన ఎన్టీయార్ ను వెన్నుపోటు పొడవటం లో భాగస్వామి అయిన గుర్తులు, , తదనంతరం, చంద్రబాబు టీడీపీ లో నాయకుడిగా చలామణి అవుతూ బెల్లి లలిత, మారోజు వీరన్న లాంటి తెలంగాణ పోరు బిడ్డలను బలి తీసుకున్నప్పుడు నిమ్మకు నీరెత్తినట్లు కెసిఆర్ వ్యహరించిన తీరుకు సంబందించిన జ్ఞాపకాలను పదిలం కూడా చేసుకున్నారా లేదా?
ఉద్యమ సమయంలో తలసాని తిట్లు, తుమ్మల దౌర్జన్యం, పటోళ్ల దాడులు, కొండా సురేఖ బూతులు, ఇంకా చాలా మంది చీమలు పెట్టిన పుట్టలో పాములు చేరినట్లు, అధికారం కోసం తెలంగాణ రాగానే మీ పంచన చేరిన తెలంగాణ ద్రోహులు, కాదు బంగారు తెలంగాణ బ్యాచ్ గతం లో ఏం మాట్లాడారో గుర్తున్నాయా?
అలాగే..ఓటుకు నోటు కేసులో చంద్రబాబు ను ఆ దేవుడు కూడా కాపాడలేడంటూ కెసిఆర్ చేసిన కామెంటూ...దానికి పూర్తి బిన్నంగా అమరావతిలో చేపల పులుసు..రొయ్యలవేపుడు తో లంచ్ చేసిన సంఘటనల తాలూకు జ్ఞాపికలు ఉన్నాయా? లెవా? ఒక వేళ
ఇవన్ని మీవద్ద లేకపోతే, మీరేం కంగారు పడొద్దు వాటన్నింటి ని పంపడానికి సిద్దమేంగా ఉన్నాము..పంపమంటారా?
మీరు ఎవరిని ఫూల్స్ ని చేయదలుచుకున్నారు.. మీరు, మీ ప్రభుత్వం జనాన్ని ఒకటి..రెండు సార్లు ఫూల్స్ ని చేయగలరేమో కాని అన్నిసార్లు ఫూల్స్ చేయలేరు... మీ కుటుంబం చేస్తున్న దాష్టీకాలను ప్రజలంతా గమనిస్తున్నారు..మీకు త్వరలోనే సరైన గుణపాఠం చెప్పుతారు.
నేను చేసిన ఆరోపణలను మీరు ఎందుకు మీ డిజిటల్ జీతగాళ్లు, మరియు భజన బృందంతో పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారొ మాకు తెలుసు..కానీ మీకు నిజంగా సత్తా ఉంటే, సామాజిక మాధ్యమాలను వదిలి, ప్రజా క్షేత్రంలో బహిరంగచర్చకు సిద్దమా తెలపండి.
1. ఐసిఎఫ్ఏ అనేది ప్రైవేట్ సంస్ధ అవునా కాదా?...అది ఒక అనామక సంస్థ, మరియు విత్తనకంపెనీల కోసం ..లాబీయింగ్ చేసే సంస్థ. ఇలాంటి.మోసపూరిత సంస్థతో ముఖ్యమంత్రికి ఉన్న సంబంధమేంటి..? ఇలాటి అనామక సంస్ధ ఇచ్చే అవార్డు కు ముఖ్యమంత్రి ఎలా అర్హుడవుతారు?
2. కెసిఆర్ ముఖ్యమంత్రిగా కాకుండా ఎకరానికి కోటి రూపాయలు సంపాదించే గొప్ప నైపుణ్యాలున్న వ్యక్తిగా, రైతుగా తాను వ్యక్తిగతంగా ఈ అవార్డు తీసుకుంటే మాకేలాంటి అభ్యంతరం లేదు. కాని వ్యవసాయ పాలసీ మేకర్ గా కెసిఆర్ ముఖ్యమంత్రి హోదాలో ఈ అవార్డు తీసుకుంటే తప్పకుండా అభ్యంతరం వ్యక్తం ఛేస్తాం. అయన అర్హతను ప్రశ్నిస్తాం. 3500మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంది నిజం కాదా?. కరువు కాటకాలతో అల్లాడిపోయి, అప్పుల బాధ తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటే వారి కుంటుంబాల ను ఆదుకోలేదు. కనీసం వారి కుటుంబాలను పరామర్శించడం కూడా చాతకాలేదుమీకు. రైతులకు కనీస మద్దతు ధరలేదు..వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించమంటే... మిర్చి రైతులను రౌడీలుగా చిత్రీకరించారు..చేతులకు బేడీలేశారు..అన్నదాతను జైళ్లలో మగ్గపెట్టిండ్రు. ఇలాంటి చర్యలకు సిగ్గుపడాల్సింది పోయి..సిగ్గులేకుండా అవార్డు తీసుకుంటారా?
3. 2013 భూసేకరణ చట్టాన్ని తుంగలో తొక్కి, దొడ్డి దారిన దొంగ చట్టాలను తెచ్చి, పేద రైతులను ఎదిరించి , బెదిరించి భూములు లాకుంటున్నది నిజామా కాదా? న్యాయం కోసం పేద రైతులు కోర్టుల కెళితే, వాళ్ళు తప్పు చేసినట్లు స్వార్ధ రాజకీయం కోసం డ్రామాలాడటం సమంజసమా?
4. గౌరవ గవర్నర్ గారికి నిజం దాచి కేంద్ర ప్రభుత్వం అవార్డు వచ్చిందని రాష్ట్ర మొదటి పౌరుడిని కూడా తప్పు దోవ పట్టించిన మీరు ఏం సంజాయిషీ ఇస్తారు?
5. ఐటీఐఆర్ విషయంలోమీ అసమర్ధత వల్ల రెండు లక్షల కోట్ల పెట్టుబడులు..50లక్షలు ఉద్యోగాలు కోల్పోలేదా.? కేవలం మీ తప్పుడు ప్రాధాన్యతల వల్ల ఐటీఐఆర్ వెనక్కు పోయింది?
6. ఇసుక మాఫియా పై చర్చిద్దాం సిద్దమేనా? పర్యావరణ అనుమతులు లేకుండా ఇసుక మైనింగ్ చేస్తోంది నిజం కాదా? కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి రిపోర్టు బయట పెట్టే దమ్ముందా?
7. నేరెళ్లలో మానవ హక్కుల ఉల్లంఘన కు పాల్పడ్డ ఎస్పీ పై చర్యలు తీసుకోకుండా..ఒక ఎస్సైని బలిపశువును చేసి చేతులు దులుపుకున్నారు. పైగా ట్రైనింగ్ పేరిట ఆరోపణలు ఎదుర్కొంటున్న జిల్లా పోలీస్ ఎస్ పి ని లఢఖ్ పంపిస్తారా? ఇదేనా మీకు చట్టం పట్ల రాజ్యాంగం పట్ల మీకున్న గౌరవం?
8. కోట్లాది రూపాయల ప్రజాధనం..వెంకయ్యనాయుడి గారి సన్మానాల పేరిట..రెడ్డి హాస్టల్ 10 ఎకరాల స్థలం కేటాయించి, 45 కోట్ల రూపాయలు పత్రిక ప్రకటనల కోసం, ఎలక్ట్రానిక్ మీడియా ప్రాచుర్యం కోసం ప్రజలు చెమటోడ్చి కట్టిన టాక్సుల ఖజానా నుండి ఖర్చు చేయడం తగునా? ఓ వైపు రెడ్డి కులంపై విషం కక్కుతూ మరోవైపు కుటిల ప్రేమ ప్రకటించడం మీ భావదారిద్రం కాదా?
9.మిషన్ భగీరథ..ఇసుక మైనింగ్, నీటి ప్రాజెక్టు ల పేరిట హద్దుల్లేని అవినీతి కి తెరలేపారు.
తెలంగాణ ఉంద్యమానికి నేతృత్వం వహించిన కెసిఆర్ పట్ల ఎల్లప్పుడూ గౌరవమే, కానీ తెలంగాణ వచ్చిన తరువాత దొంగలకు సద్దులు మోసినట్లు , తెరాస తెలంగాణ ద్రోహులకు కెసిఆర్ పట్టం కట్టిన తీరు, ఈరోజు ప్రజా ఖజానా ను అప్రాధాన్య అంశాలకు దుబారాగా ఖర్చు చేస్తున్న తీరు, ప్రశ్నించే గొంతుకలు ఉండొద్దు అన్నట్లు ఫత్వా లు జారీ చేసి, నియంత వలే పాలించడం, లెక్క పత్రం లేని దోపిడీకి పాల్పడటం గర్హనీయం. గత మూడు సంవత్సరాలలో రాసుకుంటే రామాయణమంతా, వింటే భారతమంత అన్నట్లు న్నవి మీ దాష్టీకాలు, మీ వైఫల్యాలు. మచ్చుకు మాత్రమే పైన కొన్ని తెల్పడమైంది.
మీ భజనబృందంతో డిజిటల్ జీతగాళ్లతో నాపై మీరు చేయిస్తున్న వికృత దాడితో మీ దిక్కుమాలిన..దిగజారిన దౌర్భాగ్య మానసిక స్థితి కనపడుతింది. మీ ఈ మానసిక స్థితి పట్ల నా సానుభూతిని తెలుపుతున్నాను.
నాపై మీరు రాయిస్తున్న రాతలు..అసభ్యకూతలలను మీ పింక్ మీడియాలో..నమస్తే తెలంగాణ పత్రిక లో ప్రచురిస్తూ గోబెల్స్ ప్రచారాన్నీ కొనసాగిస్తూ , మీరు ఒక శాడిస్టు వలే పైశాచిక ఆనందాన్ని పొందొచ్చు కానీ సమాజం పట్ల నాకున్న నిబద్దతను అడ్డుకోలేరు.
నేను ఉపాధి లేక రాజకీయాల్లోకి రాలే, ఉన్నత స్థాయి కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలి రాజకీయాల్లోకి వచ్చాను. పేద బడుగు బలహీన వర్గాల గొంతు వినిపించేందుకే వచ్చాను. నేను కూడా ఉస్మానియా గడ్డ మీద విద్యార్థి ఉద్యమాలనుండి వచ్చిన ఒక బడుగు బిడ్డను. కాంగ్రెస్ పార్టీ గాని వక్తిగతంగా నేను గాని మీ తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదు.
ఈన కాసినంక నక్కలా పాలైనట్లు, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ను, మరో కొత్తరకం దోపిడీ కి గురిచేస్తున్న తెరాస ప్రభుత్వ శక్తులను ప్రజాస్వామ్య బద్దంగా ఎదుర్కొంటాం. మీ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతాం, మీ అవినీతిని ఎత్తి చూపుతాం. మీ మోస పూరిత విధానాలను ప్రశ్నిస్తాం. ప్రజాస్వామిక తెలంగాణ ఏర్పడేంతవరకు, నిరంకుశ పాలనకు దోపిడీకి చరమ గీతం పాడేంతవరకు మా పోరు ఆగదు.
.
తెలంగాణా అమరవీరుల స్థూపం వద్దకు...లేదా మీ ప్రగతి భవన్ వద్ద కా చెప్పండి ప్రజాస్వామ్య పద్దతిలో చర్చిద్దం..దమ్ముంటే రండి..
ఇట్లు
అభినందలతో
దాసోజు శ్రవణ్

dasoju sravan kumar in kcr farm house