Ø తెలంగాణలో బీజేపీ వాపు ను
చూసి బలుపు అనుకుంటుంది.
Ø ఇక్కడ బీజేపీకి అంత సీన్
లేదు. బీజేపీ, టిఆర్ఎస్ లు చీకటి రాజకీయాలు
చేస్తూ కాంగ్రెస్ ను దెబ్బ తీసే కుట్రలు చేస్తున్నాయి.
Ø బీజేపీ కేంద్ర మంత్రులు
తెలంగాణ పర్యటనలలో రాష్ట్రంలో అబ్దుతంగా పాలన సాగుతోందని పొగుడుతారు .
Ø కేంద్రంలో అన్ని అంశాలలో
టిఆర్ఎస్ భే షరతు మద్దతు ఇస్తుంది.
Ø ఇలా లోపాయికరిగా ఒకరికొకరు
మద్దతు ఇచ్చుకునే పార్టీ లు ఎలా ప్రత్యుర్డులు అవుతారు. వాళ్ళ నాటకాలు తెలంగాణ
ప్రజలను మోసం చేయడానికే.
తెలంగాణ లో బీజేపీకి స్థానం లేదు. ఎమ్యెల్యేగా ఓడిపోయిన
లక్ష్మణ్ ఎగిసి పడుతున్నారు...టిఆర్ఎస్ బీజేపీ రెండు దొంగ ఆటలు ఆడుతున్నాయి. బీజేపి, టిఆర్ఎస్ అక్రమ రాజకీయాలు
చేస్తున్నాయి .ఉత్తమ్
ను విమర్శించే స్థాయి లక్ష్మణ్ కు లేదు. దేశం
కోసం ప్రాణాలు ఫణంగా పెట్టి పోరాటాలు చేసి సైనికుడు ఉత్తమ్.. ఆయనపై బీజేపీ విమర్శలా..103 అసెంబ్లీ
స్థానాలలో డిపాజిట్ కోల్పోయిన బీజేపీ బలపడడం అసాధ్యం.
తెలంగాణలో బీజేపీ కి ఎప్పుడు స్థానం లేదని, 4 ఎంపీ
స్థానాలు అనుకోకుండా గెలవగానే బీజేపీ ఏదో ఊహించుకుంటుంది. బీజేపీ తెలంగాణలో ఎన్నటికీ బలపడదని, టిఆర్ఎస్ కు ప్రత్యామ్నాయ
కాంగ్రెస్ పార్టీ ఒక్కటేనని, బీజేపీ
వి పగటి కలలే
ఆగస్ట్ 7న 2016 నాడు
గజేవెల్ లో మిషన్ భగీరథ ప్రారంభం నాడు నరేంద్ర మోడీ టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని
మెచ్చుకుంటే, కేసీఆర్
ఏకంగా మీ గుండెల్లో స్థానం ఉంటే చాలు మాకు ఏమి అక్కరలేదు అనలేదా. ?
మే 5, 2018న
కేంద్ర రోడ్, భవనాల
మంత్రి నితిన్ గడ్కరీ హైద్రాబాద్ లో
తెలంగాణలో రోడ్లు అద్భుతంగా ఉన్నాయని అనలేదా..సెప్టెంబర్ 18, 2018న కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి పంజాగుట్ట పోలీస్
స్టేషన్ సందర్శించి రాష్ట్రంలో శాంతి
భద్రతలు చాలా బాగున్నాయని మెచ్చుకోలేదా..కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్
జయదేవకర్ రాష్ట్రంలో హరిత హారం పనులను మెచ్చుకోలేదా.. కేంద్ర మంత్రులు అహ్లువాలియా, వికె సింగ్ లు హైద్రాబాద్ కు వచ్చి
రాష్ట్ర ప్రభుత్వాన్ని విపరీతంగా పొగిడారు..
మీరు మీరు ఒకటి కాకపోతే కేసీఆర్ పైన ఉన్న సీబీఐ కేసుల
విషయంలో ఎందుకు విచారణ జరపడంలేదు.. ఈఏస్ ఐ భవనాల నిర్మాణం, ఈ ఎస్ ఐ ఉద్యోగుల పి ఎఫ్ పెన్షన్ల
కుంభకోణం విషయంలో ఎందుకు విచారణ చేయడం లేదు. బీజేపీ నిజంగా టిఆర్ఎస్ పోరాటాలు
చేస్తున్నది నిజమైతే బీజేపీకి దమ్ముంటే నాయీమ్ కేసును, మియపూర్ భూ కుంభకోణం, డ్రగ్ మాఫియా కేసు, సాగునీటి ప్రాజెక్టు ల కుంభకోణాలపై
సీబీఐ విచారణ జరిపించాలి..
నోట్ల రద్దు,
జిఎస్టీ, రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ నీతి
ఆయోగ్, త్రిబుల్
తలాక్, రైట్
ఇన్ఫర్మేషన్ ఆక్ట్ సవరణ, 370
ఆక్ట్ రద్దు లాంటి అనేక అంశాలలో బీజేపీకి భే శరతుగా మద్దతు ఇవ్వలేదా ?
2017, ఏప్రిల్
16న
అసెంబ్లీలో ముస్లిం రిజర్వేషన్లు బిల్లు కోసం తీర్మానం చేసి పార్లమెంట్ కు పంపారు
అది ఎందుకు అమలు కావడం లేదు.
తెలంగాణ రాష్ట్ర బిల్లులో మనకు హక్కుగా రావాల్సిన బయ్యారం
స్టీల్ ఫ్యాక్టరరీ, కాజీపేట
కోచ్ ఫేక్టరీ, ట్రైబల్
యూనివర్సిటీ, జాతీయ
సాగునీటి ప్రాజెక్టు ఇలా అనేకం పెండింగ్ ఉన్నాయి. అవి ఎందుకు డిమాండ్ చేయడం లేదు. రెండు పార్టీలు కలిసి తెలంగాణకు
మోసం చేస్తూ ప్రజాలకు నష్టం చేస్తున్నాయి.
No comments:
Post a Comment