Monday 30 March 2020

జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ గారు, ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి డాక్టర్ శ్రవణ్ దాసోజు గారి ట్వీట్ కి స్పందన

జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ గారు, ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి డాక్టర్ శ్రవణ్ దాసోజు గారి ట్వీట్ కి స్పందన


జార్ఖండ్ రాష్టానికి చెందిన రోజువారీ ఉపాధి కూలీ కార్మికులు కరోనా వైరస్‌ మహమ్మారి వల్ల ఉపాధి కోల్పోయి, ఉండడానికి కనీసం నివాసయోగ్యం కూడా లేకుండా చిక్కుకుపోయి ఉన్న తరుణంలో, ఈరోజు హైదరాబాద్ నగరంలో వారు ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి డాక్టర్ శ్రవణ్ దాసోజు గారిని సంప్రదించడం జరిగింది. వారు పడుతున్న బాధలు చూసి వారిని ఆదుకోవడం కోసం శ్రవణ్ దాసోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి, మంత్రి కేటీఆర్ గారికి మరియు జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ గారికి ట్విట్టర్ లో జార్ఖండ్ కార్మికుల సమస్యను తెలుపుతూ ట్యాగ్ చేయడం జరిగింది, వెంటనే జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ గారు శ్రవణ్ దాసోజు ట్వీటీకి స్పందిస్తూ,  దేశ వ్యాప్తంగా కరోనా వ్యాప్తి మరియు లాక్‌డౌన్ కారణంగా ప్రతి ఒక్కరూ కూడా వారు ఉన్న ప్రాంతంలోనే  ఉండడం మంచిదని మేము నిర్ణయం తీసుకున్నామని తెలుపుతూ. మా రాష్ట్ర పౌరులకు అక్కడే  ఆదుకోవాలని వారికీ ఆహారంతో పాటుగా అవసరమైన వస్తువులు మరియు ఉండడానికి అన్ని రకాల సదుపాయాలు ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ గారికి మరియు మంత్రి కేటీఆర్ గారికి ఇద్దరికీ కూడా ట్విట్టర్ లో విజ్ఞప్తి చేస్తూ, ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి డాక్టర్ శ్రవణ్ దాసోజు గారికి ఈ అంశాన్ని లేవనెత్తినందుకు ధన్యవాదాలు తెలిపారు.

https://twitter.com/HemantSorenJMM/status/1244571135427002368?s=19

No comments:

Post a Comment