Monday 10 December 2018

నాంపల్లి యూసఫ్ బాబా దర్గాను సందర్శించినఖైరతాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధి దాసోజు శ్రవణ్ కుమార్


బాబా ఆశీస్సులతో ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా విజయం సాధిస్తానని ధీమా.










నాంపల్లి యూసఫ్ బాబా దర్గాను ఖైరతాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధి దాసోజు శ్రవణ్ కుమార్ సోమవారం సాయంత్రం సందర్శించారు. బాబా సమాధిని సందర్శించిన ఆయన భక్తి పూర్వకంగా ముస్లీం సాంప్రదాయాల ప్రకారం చాదర్ ను సమర్పించారు.  ఈ సందర్భంగా దాసోజు శ్రవణ్   మాట్లాడుతూ మంచికి, మానవత్వానికి ప్రతీక  నాంపల్లి యూసఫ్ బాబా అన్నారు. యూసఫ్ బాబా ఆశీస్సులు తనపై సంపూర్ణంగా ఉన్నాయన్నారు. గంగా జమునా తెహజీబ్ కు ప్రతీక అయిన తెలంగాణాలో  అన్ని వర్గాల ప్రజలు సామరస్యంగా కలిసి మెలిసి ఉండేలా రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం మరింత కృషి చేస్తుందన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా  బాబా ఆశీ  స్సులతో  మంగళవారం ప్రకటించబోయే ఎన్నికల ఫలితాల్లో ఖైరతబాద్ ఎమ్మెల్యే గా ఘనవిజయం సాధించబోతున్నానని దాసోజు ధీమా వ్యక్తం చేశారు.  ఈ సందర్భంగా దాసోజు శ్రవణ్ వెంట మాజీ కార్పోరేటర్ ఎస్ కే షరీఫ్,ఎన్ యూఐ స్టేట్ సెక్రటరీ షానవాజ్, ముఖేష్, ఇస్మాయిల్, జాకీర్, ఓయూ జేయేసీ కురువ విజయ్ కుమార్ తదితర ముస్లీం మత పెద్దలు, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

No comments:

Post a Comment