Friday 14 July 2017

లండన్ లో - గడీల పాలన -తాకట్టు లో తెలంగాణ పీపుల్స్ ఛార్జ్ షీట్ - పుస్తక ఆవిష్కరణ

ఈ రోజు లండన్ లో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఎన్నారై విభాగం ఆధ్వర్యం లో టీపీసీసీ తయారుచేసిన పీపుల్స్ ఛార్జ్ షీట్ - పుస్తక ఆవిష్కరణ జరిగింది . ఆవిష్కరణ కార్యక్రమానికి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దాసోజు శ్రవణ్ ముఖ్యఅతిథి గా పాల్గొని ఆవిష్కరించారు.
తెరాస 3 ఏండ్ల రాచరిక పాలనలో ప్రజల అవస్థలు ,తప్పిన ఎన్నికల వాగ్ధానాలు , నిరంకుశ ,అప్రజాస్వామిక ,ప్రజా వ్యతిరేక విధానాల పై ,వివిధ రంగాల్లో అడ్డగోలు వ్యవహారాల పై తయారుచేసిన '' గడీల పాలన -తాకట్టు లో తెలంగాణ '' పుస్తక ఆవిష్కరణ చేసారు.
దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ అమరుల బలిదానాల సాక్షి గ తెచ్చుకున్న తెలంగాణ రాచరిక పాలన ను తలపిస్తుందని, ఒంటెద్దు పోకడలు ఎన్ని రోజులు అని, ఓట్లు సీట్లు ఆలోచన లేకుండా ప్రజల కోసం పనిచేయాలని ముఖ్యమంత్రి కి సూచించారు .
కార్యక్రమం లో అడ్వైసరి మెంబర్లు డోకుర్ పవన్ కుమార్ ,ఓరుగంటి కమలాకర్ రావు , యూకే కన్వీనర్ గంప వేణుగోపాల్ తదితరులు ప్రసంగించి ప్రభుత్వ పని తీరు పై ఘాటుగా విమర్శించారు .
ఈ కార్యక్రమం లో కో కన్వీనర్లు రంగుల సుధాకర్ గౌడ్ ,రామ్మోహన్ రెడ్డి ,రాకేష్ బిక్కుమండ్ల ,అచ్యుత రెడ్డి సభ్యులు ,సత్య ప్రకాష్ , రాజేశ్వేర్ రెడ్డి , దేవులపల్లి శ్రీనివాస్ ,మధు గట్ట ,తదితరుల ఆధ్వర్యం లో సుమారు 100 మంది పుస్తకావిష్కరణ కి మద్దతు తెలిపారు .






No comments:

Post a Comment