Tuesday, 27 June 2017

అమరుల స్థూపం, కానీ 1500+ ఆత్మ త్యాగం చేసి అమరులైతే, కేవలం కొందరిని మాత్రమే గుర్తించి చేతులు దులుపుకున్రు.

అమరులైన అందరికి, తెరాస మేనిఫెస్టో లో పొందుపర్చినట్లుగా 10 లక్షల నగదు సహాయం, ఇంటికో ఉద్యోగం, 3 ఎకరాల సాగు భూమి, సామాజిక భద్రత ఇవ్వాలి. అదే నిజమైన నివాళి 
అంతే కాదు, 1969 లో పోలీసు కాల్పులలో చని పోయిన వాళ్లు దాదాపు 500 మంది యువకులు. అప్పుడు గాయపడి ఇప్పటికి నానా ఇబ్బందులకు గురౌతున్న వాళ్ళు వేలమంది.
అదే విధంగా 2009 తరువాత ఉద్యమంలో గాయపడ్డ వాళ్ళు కొన్ని వేల మంది.
అందుచేత అప్పటి వాళ్ళని, ఇప్పటి వాళ్ళని మొత్తానికి మొత్తం గుర్తించి అందరికి ప్రభుత్వం అన్ని రకాల సహాయం చేయాలి. వారి పోరాటాలను, ఆత్మ త్యాగాలను గౌరవించాలి..
అది ప్రస్తుత ప్రభుత్వ కనీస బాధ్యత, నైతిక ధర్మం.
కాని కేవలం స్తూపం గట్టి, అమరుల కుటుంబాలను విస్మరిస్తే తెరాస చేస్తున్న బ్రాంతి రాజకీయాలలో ఇది ఒకటి అని చెప్పవచ్చు.

No comments:

Post a Comment